Movie News

ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు రానక్కర్లేదా?

ఆంధ్రప్రదేశ్‌లో టికెట్ల రేట్లు అమాంతం తగ్గించేయడంతో టాలీవుడ్ జనాలు ఎంతగా ఇబ్బంది పడ్డారో తెలిసిందే. అక్కడ నిర్దేశించిన రేట్లు ప్రేక్షకులకే అన్యాయంగా అనిపించాయి. దాదాపు ఏడాది పాటు ఇండస్ట్రీని సతాయించాక ఈ మధ్యే ప్రభుత్వం రేట్లు సవరించింది. సాధారణ రేట్లు అయితే ఇండస్ట్రీ జనాలు కోరుకున్న స్థాయిలో లేవు. అయినా సరే.. ఈ రేట్లు చాలా సంతృప్తికరం అంటూ స్టేట్మెంట్లు ఇచ్చారు.

కానీ తెలంగాణలో ప్రభుత్వం తాము అడిగిందల్లా ఇచ్చేస్తుండటంతో అత్యాశకు పోతున్నారు నిర్మాతలు. ఇప్పటికే సాధారణ స్థాయిలో పెంచిన రేట్లు ప్రేక్షకులకు భారంగా మారాయి. సింగిల్ స్క్రీన్లలో రూ.150, మల్టీప్లెక్సుల్లో రూ.200గా మారింది కనీస ధర. ఆ భారం చాలదన్నట్లు పెద్ద సినిమాలకు రెండు వారాలు అదనంగా రేట్లు పెంచుకునే సౌలభ్యమూ పొందుతున్నారు. దీంతో సింగిల్ స్క్రీన్లో రూ.200, మల్టీప్లెక్సుల్లో రూ.250కి కనీస ధర పెరిగిపోయింది.

మెజారిటీ మల్టీప్లెక్సుల్లో టికెట్ ధర రూ.295కు పెరిగిపోయింది. దానికి ఇంటర్నెట్ హ్యాండ్లింగ్ ఛార్జీలు కూడా కలిపితే రేటు రూ.330 దాకా అవుతుండటం గమనార్హం. ఒక్కో టికెట్‌కు ఇంత పెట్టి ఫ్యామిలీని తీసుకుని థియేటరుకు వెళ్లి సినిమా చూడాలంటే మధ్య తరగతి జనాలకు ఎంత భారమన్న ఎవరూ ఆలోచించడం లేదు. ఈ రేటే ఎక్కువ అంటే.. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు దీని మీద అదనంగా రేట్లు పెంచేస్తున్నారు. దీని ప్రకారం ఇంటర్నెట్ హ్యాండ్లింగ్ ఛార్జీలతో కలిపి సింగిల్ స్క్రీన్లలోనే రేటు రూ.250 అవుతోంది. మల్టీప్లెక్సుల ధర రూ.350కి చేరుకుంది. ఎంత భారీ చిత్రం అయినా సరే.. ఈ స్థాయికి రేట్లు పెంచేయడం ఎంత వరకు సమంజసం?

దక్షిణాది రాష్ట్రాలన్నింట్లో ఇప్పుడు తెలంగాణలోనే అత్యధిక టికెట్లు రేట్లు ఉన్నాయి. ఆల్రెడీ పరిస్థితి ఇలా ఉంటే.. పెద్ద సినిమా, తొలి వారం డిమాండును దృష్టిలో ఉంచుకుని ఇలా మరింతగారేట్లు పెంచేయడం  విడ్డూరం. ఆల్రెడీ కరోనా, ఓటీటీ వంటి కారణాలతో థియేటర్లకు వచ్చి సినిమాలు చూడటం ఫ్యామిలీ ఆడియన్స్ తగ్గించేశారు. సినిమాలకు రిపీట్ ఆడియన్స్ కూడా బాగా తగ్గిపోయారు. అందుకే వీకెండ్ అవ్వగానే ఎంత పెద్ద సినిమా అయినా చల్లబడిపోతోంది. చూస్తుంటే అత్యాశతో బంగారు గుడ్లు పెట్టే బాతును కోసేసిన చందంగా ఈ వ్యవహారం తయారయ్యేట్లే ఉంది.

This post was last modified on March 19, 2022 3:44 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ప్రీమియర్ల నుంచే హడావిడి మొదలు

కంటెంట్ మీద ఎంత నమ్మకం ఉన్నా ప్రీమియర్ల విషయంలో నిర్మాతలు ఒకటికి పదిసార్లు ఆలోచించే పరిస్థితులు ఇప్పుడున్నాయి. కొన్నిసార్లు ఈ…

49 minutes ago

హ్యాపీగా వస్తే ఎవరూ పట్టించుకోలేదు

జివి ప్రకాష్ కుమార్ మనకూ బాగా సుపరిచితుడైన సంగీత దర్శకుడు. తమిళంలో అయితే రెగ్యులర్ గా హీరోగా కూడా నటిస్తూ…

2 hours ago

‘మావిగన్’ పేరుతో జగన్ కొత్త రాజధాని ప్రతిపాదన

ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్లాన్-బీ’గా మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు ప్రాంతాన్ని…

4 hours ago

కాంగ్రెస్ ఎమ్మెల్యేకు మంచు విష్ణు కౌంటర్

టాలీవుడ్ టాప్ స్టార్లందరూ తమ సినిమా రిలీజ్ ముంగిట డ్రగ్ టెస్టులు చేసుకోవాలని.. అప్పుడే ఆ సినిమాలు రిలీజ్ అయ్యేలా…

4 hours ago

అమరావతిపై జగన్ అక్కసు తగ్గలేదా?

ఏపీ మాజీ సీఎం జగన్ తన అజ్ఞానపూరితమైన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. జగన్ ప్రెస్ మీట్…

4 hours ago

జయలలిత స్ట్రాటజీ మళ్లీ: విజయ్ పెద్ద ప్లాన్

సినిమాల్లో డ్యూయల్ రోల్స్ తో మెప్పించిన హీరో విజయ్ ఇప్పుడు రాజకీయ రంగంలోనూ అదే తరహాలో రెండు నియోజకవర్గాల నుంచి…

5 hours ago