Movie News

ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు రానక్కర్లేదా?

ఆంధ్రప్రదేశ్‌లో టికెట్ల రేట్లు అమాంతం తగ్గించేయడంతో టాలీవుడ్ జనాలు ఎంతగా ఇబ్బంది పడ్డారో తెలిసిందే. అక్కడ నిర్దేశించిన రేట్లు ప్రేక్షకులకే అన్యాయంగా అనిపించాయి. దాదాపు ఏడాది పాటు ఇండస్ట్రీని సతాయించాక ఈ మధ్యే ప్రభుత్వం రేట్లు సవరించింది. సాధారణ రేట్లు అయితే ఇండస్ట్రీ జనాలు కోరుకున్న స్థాయిలో లేవు. అయినా సరే.. ఈ రేట్లు చాలా సంతృప్తికరం అంటూ స్టేట్మెంట్లు ఇచ్చారు.

కానీ తెలంగాణలో ప్రభుత్వం తాము అడిగిందల్లా ఇచ్చేస్తుండటంతో అత్యాశకు పోతున్నారు నిర్మాతలు. ఇప్పటికే సాధారణ స్థాయిలో పెంచిన రేట్లు ప్రేక్షకులకు భారంగా మారాయి. సింగిల్ స్క్రీన్లలో రూ.150, మల్టీప్లెక్సుల్లో రూ.200గా మారింది కనీస ధర. ఆ భారం చాలదన్నట్లు పెద్ద సినిమాలకు రెండు వారాలు అదనంగా రేట్లు పెంచుకునే సౌలభ్యమూ పొందుతున్నారు. దీంతో సింగిల్ స్క్రీన్లో రూ.200, మల్టీప్లెక్సుల్లో రూ.250కి కనీస ధర పెరిగిపోయింది.

మెజారిటీ మల్టీప్లెక్సుల్లో టికెట్ ధర రూ.295కు పెరిగిపోయింది. దానికి ఇంటర్నెట్ హ్యాండ్లింగ్ ఛార్జీలు కూడా కలిపితే రేటు రూ.330 దాకా అవుతుండటం గమనార్హం. ఒక్కో టికెట్‌కు ఇంత పెట్టి ఫ్యామిలీని తీసుకుని థియేటరుకు వెళ్లి సినిమా చూడాలంటే మధ్య తరగతి జనాలకు ఎంత భారమన్న ఎవరూ ఆలోచించడం లేదు. ఈ రేటే ఎక్కువ అంటే.. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు దీని మీద అదనంగా రేట్లు పెంచేస్తున్నారు. దీని ప్రకారం ఇంటర్నెట్ హ్యాండ్లింగ్ ఛార్జీలతో కలిపి సింగిల్ స్క్రీన్లలోనే రేటు రూ.250 అవుతోంది. మల్టీప్లెక్సుల ధర రూ.350కి చేరుకుంది. ఎంత భారీ చిత్రం అయినా సరే.. ఈ స్థాయికి రేట్లు పెంచేయడం ఎంత వరకు సమంజసం?

దక్షిణాది రాష్ట్రాలన్నింట్లో ఇప్పుడు తెలంగాణలోనే అత్యధిక టికెట్లు రేట్లు ఉన్నాయి. ఆల్రెడీ పరిస్థితి ఇలా ఉంటే.. పెద్ద సినిమా, తొలి వారం డిమాండును దృష్టిలో ఉంచుకుని ఇలా మరింతగారేట్లు పెంచేయడం  విడ్డూరం. ఆల్రెడీ కరోనా, ఓటీటీ వంటి కారణాలతో థియేటర్లకు వచ్చి సినిమాలు చూడటం ఫ్యామిలీ ఆడియన్స్ తగ్గించేశారు. సినిమాలకు రిపీట్ ఆడియన్స్ కూడా బాగా తగ్గిపోయారు. అందుకే వీకెండ్ అవ్వగానే ఎంత పెద్ద సినిమా అయినా చల్లబడిపోతోంది. చూస్తుంటే అత్యాశతో బంగారు గుడ్లు పెట్టే బాతును కోసేసిన చందంగా ఈ వ్యవహారం తయారయ్యేట్లే ఉంది.

This post was last modified on March 19, 2022 3:44 pm

Share
Show comments
Published by
Tharun

Recent Posts

రేపే ర‌ణ‌భేరి.. ‘గాంధీ’ల ప‌రువు ద‌క్కుతుందా?

దేశంలో జ‌రుగుతున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల ఐదో ద‌శ పోలింగ్ సోమ‌వారం ఉద‌యం 7 గంట‌ల‌కు ప్రారంభం కానుంది. మొత్తం 6…

16 mins ago

తేనెతుట్టెను గెలుకుతున్న రేవంత్ !

లోక్ సభ ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే తెలంగాణలో ఉన్న 33 జిల్లాలను 17 జిల్లాలకు కుదిస్తారని వస్తున్న వార్తలు…

1 hour ago

సేఫ్ గేమ్ ఆడుతున్న ఆర్ఆర్ఆర్ నిర్మాత

ఇండస్ట్రీలో సుదీర్ఘ అనుభవంతో ఎన్నో బ్లాక్ బస్టర్లు చూసిన డివివి దానయ్య సగటు మాములు ప్రేక్షకుడికి బాగా దగ్గరయ్యింది మాత్రం…

2 hours ago

మాజీ ప్ర‌ధాని మ‌న‌వ‌డి కోసం… బ్లూ కార్నర్ నోటీసు!

భార‌త దేశ చ‌రిత్ర‌లో ఇదోక అనూహ్య‌మైన.. అస‌హ్యించుకునే ఘ‌ట‌న‌. ఈ దేశాన్ని పాలించి, రైతుల మ‌న్న‌న‌లు, మ‌హిళ‌ల మ‌న్న‌న‌లు పొందిన…

2 hours ago

జ‌గ‌న్.. నీరో : జేడీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ఏపీ సీఎం జ‌గ‌న్‌.. నీరో చ‌క్ర‌వ‌ర్తిని త‌ల‌పిస్తున్నారంటూ.. సీబీఐ మాజీ డైరెక్ట‌ర్ జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ సంచ ల‌న వ్యాఖ్య‌లు చేశారు.…

4 hours ago

ఐపీఎల్ ప్లే ఆఫ్స్ లో ఆర్సీబీ..కప్ కొడతారా?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో అత్యంత దురదృష్టకరమైన జట్టు పేరు చెప్పమని అడిగితే…ఠపీమని ఆర్సీబీ పేరు చెప్పేస్తారు క్రికెట్…

4 hours ago