మంచి క్రేజ్ ఉన్న సినిమా.. దాని నిర్మాతలకు బాగా నమ్మకం ఉంటే రిలీజ్కు ముందు రోజే సెకండ్ షోకు పెయిడ్ ప్రిమియర్స్ వేయడం అప్పుడప్పుడూ జరుగుతుంటుంది. గతంలో అర్జున్ రెడ్డి, బాహుబలి-2, ఫలక్ నుమా దాస్ లాంటి కొన్ని సినిమాలకు ఇలాగే జరిగింది. వీటిలో అర్జున్ రెడ్డి, బాహుబలి-2 సినిమాలకు ప్రిమియర్స్ బాగా కలిసొచ్చాయి కూడా. పాజిటివ్ టాక్ స్ప్రెడ్ అయి హైప్ మరింత పెరిగింది.
గత వారం విడుదలైన ప్రభాస్ సినిమా రాధేశ్యామ్కు కూడా ఇలాగే ముందు రోజు రాత్రి పెయిడ్ ప్రిమియర్స్ వేయాలనుకుంటున్నట్లుగా ప్రచారం జరిగింది. కానీ తర్వాత ఎందుకో ఆ ఆలోచనను మానుకున్నారు. సినిమాకు డివైడ్ టాక్ వచ్చేందుకు ఆస్కారముందని, అది సినిమాపై ప్రతికూల ప్రభావం చూపుతుందని భావించి వెనక్కి తగ్గినట్లుగా వార్తలొచ్చాయి.
ఐతే వచ్చే శుక్రవారం విడుదల కానున్న రాజమౌళి సినిమా ఆర్ఆర్ఆర్కు పెయిడ్ ప్రిమియర్స్ పక్కా అని ఇంతకుముందే వార్తలొచ్చాయి.
సంక్రాంతి రిలీజ్ టైంలోనే ఇలా ప్లాన్ చేశారు డిస్ట్రిబ్యూటర్లు. దీని గురించి అప్పట్లో రాజమౌళి సైతం స్పందించాడు. ఐతే సినిమా అనుకోకుండా మార్చి 25కు వాయిదా పడింది. ఇప్పుడు కూడా పెయిడ్ ప్రిమియర్స్కు సన్నాహాలు జరుగుతున్నట్లు కొన్ని రోజుల ముందు వరకు ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు ఆ ఆలోచనను డిస్ట్రిబ్యూటర్లు విరమించుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకు కారణాలేంటన్నది తెలియదు. సినిమా మీద సందేహాలైతే ఎవరికీ లేవు.
రాజమౌళి అండ్ కో చాలా కాన్ఫిడెంట్గా ఉందీ సినిమాపై. బాక్సాఫీస్ దగ్గర బాహుబలి స్థాయి సంచలనాలు ఖాయం అనే అంతా ధీమాగా ఉన్నారు. మరి అంత కాన్ఫిడెన్స్ ఉన్నపుడు పెయిడ్ ప్రిమియర్స్ ఆలోచన ఎందుకు విరమించుకున్నారో తెలియదు. హైదరాబాద్లో తెల్లవారుజామున రెండు షోలు పడే అవకాశాలున్నాయి. తర్వాత ఆరున్నర ఏడు గంటల ప్రాంతంలో రెగ్యులర్ షోలు మొదలు కానున్నాయి. ఏపీలో సైతం ఐదో షోకు అనుమతులుండటంతో అదే సమయంలో ఆర్ఆర్ఆర్ స్క్రీనింగ్ మొదలయ్యే అవకాశాలున్నాయి.
This post was last modified on March 19, 2022 8:34 am
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…