బాహుబలి తర్వాత ప్రభాస్ చేసిన సాహో సినిమాకు ముందుగా బడ్జెట్ రూ.50 కోట్లకు అటు ఇటుగా అనుకున్నారు. బాహుబలి-1 మేకింగ్ దశలో ఉండగానే ఈ సినిమా ఓకే అయింది. అప్పటికి ప్రభాస్కు ఉన్న మార్కెట్కు అనుగుణంగానే ఈ సినిమా తీయాలనుకున్నారు. కానీ ఈ చిత్రం పట్టాలెక్కేసరికి ప్రభాస్ ఇమేజ్, మార్కెట్ ఎక్కడికో వెళ్లిపోయాయి. దీంతో బడ్జెట్ అంతకంతకూ పెంచుకుంటూ పోయి రూ.300 కోట్లు చేసేశారు.
రాధేశ్యామ్ బడ్జెట్ కూడా ఇలా పెరిగిందే. ఐతే ఒక స్క్రిప్టు ఓకే అయినపుడే దానికి ఎంత ఖర్చు పెట్టాలన్నది కూడా నిర్ణయం అయిపోతుంది. బడ్జెట్ పెంచుకునే వెసులుబాటుంటే అది కొంత వరకే. కానీ ఇలా ఖర్చు ఐదారు రెట్లు అయిపోవడం మాత్రం ప్రభాస్ సినిమాల్లోనే చూశాం. ఐతే నిజంగా అవసరం అయి అంత ఖర్చు పెట్టారా అంటే అలా అనిపించదు. ప్రభాస్ మార్కెట్ పెరిగింది, ఇమేజ్ మారింది కాబట్టి.. భారీతనం ఉండాలని అవసరానికి మించి ఖర్చు చేశారనిపిస్తుందే తప్ప మరో భావన కలగదు సాహో సినిమా చూసినా, రాధేశ్యామ్ చూసినా.
అవసరానికి మించి ఖర్చు పెట్టడం వల్ల టెక్నికల్గా ఉన్నతంగా అనిపించాయే తప్ప సినిమాల స్థాయి ఏమీ పెరగలేదు. నిజానికి ఈ భారీతనం వల్ల కొంత అసహజత్వం వచ్చిన మాట కూడా వాస్తవం. అసలు సినిమాకు కీలకమైన కథాకథనాల మీద శ్రద్ధ పెట్టకుండా ఎంత ఖర్చు పెట్టి, ఎన్ని హంగులు జోడించి ఏం ప్రయోజనం? అయినా ప్రభాస్ సినిమా అంటే భారీతనం ఉంటేనే చూస్తారన్న భ్రమల్లో ఎందుకున్నారన్నది అర్థం కాని విషయం.
అతణ్ని మామూలు కథల్లో, ఒక సామాన్యుడిలా చూడలేమా అన్నది ప్రశ్న. సాహో, రాధేశ్యామ్ చిత్రాల్లో అతణ్నో అసామాన్యుడిగా చూపించడం వల్ల ఒరిగిందేమిటి? కాబట్టి అవసరం లేని భారీతనం, హంగులు, బడ్జెట్ మీద ఫోకస్ పక్కకు మళ్లించి మామూలు కథల్లో, ఓ మోస్తరు బడ్జెట్లలో సినిమా చేసి అందరినీ సంతోషపెట్టడానికి ప్రభాస్ ప్రయత్నిస్తే మంచిది.
This post was last modified on March 17, 2022 12:31 am
రాజకీయాల్లో అవకాశాలు రావడమే అరుదు. వచ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవసరం.. వాటిని పట్టుకుని ఎదగాల్సిన అవసరం కూడా పార్టీలకు, నాయకులకు…
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…
పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…
తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత పరిస్థితి తొలిగిపోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన…
దేశ ప్రధాని నరేంద్ర మోడీ.. ఆదివారం హైదరాబాద్లో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ పర్యటనలో మరో…
‘కహోనా ప్యార్ హై’ చిత్రంతో హృతిక్ రోషన్ మాత్రమే కాదు.. ఆ చిత్ర కథానాయిక అమీషా పటేల్ సైతం ఓవర్…