బాహుబలి తర్వాత ప్రభాస్ చేసిన సాహో సినిమాకు ముందుగా బడ్జెట్ రూ.50 కోట్లకు అటు ఇటుగా అనుకున్నారు. బాహుబలి-1 మేకింగ్ దశలో ఉండగానే ఈ సినిమా ఓకే అయింది. అప్పటికి ప్రభాస్కు ఉన్న మార్కెట్కు అనుగుణంగానే ఈ సినిమా తీయాలనుకున్నారు. కానీ ఈ చిత్రం పట్టాలెక్కేసరికి ప్రభాస్ ఇమేజ్, మార్కెట్ ఎక్కడికో వెళ్లిపోయాయి. దీంతో బడ్జెట్ అంతకంతకూ పెంచుకుంటూ పోయి రూ.300 కోట్లు చేసేశారు.
రాధేశ్యామ్ బడ్జెట్ కూడా ఇలా పెరిగిందే. ఐతే ఒక స్క్రిప్టు ఓకే అయినపుడే దానికి ఎంత ఖర్చు పెట్టాలన్నది కూడా నిర్ణయం అయిపోతుంది. బడ్జెట్ పెంచుకునే వెసులుబాటుంటే అది కొంత వరకే. కానీ ఇలా ఖర్చు ఐదారు రెట్లు అయిపోవడం మాత్రం ప్రభాస్ సినిమాల్లోనే చూశాం. ఐతే నిజంగా అవసరం అయి అంత ఖర్చు పెట్టారా అంటే అలా అనిపించదు. ప్రభాస్ మార్కెట్ పెరిగింది, ఇమేజ్ మారింది కాబట్టి.. భారీతనం ఉండాలని అవసరానికి మించి ఖర్చు చేశారనిపిస్తుందే తప్ప మరో భావన కలగదు సాహో సినిమా చూసినా, రాధేశ్యామ్ చూసినా.
అవసరానికి మించి ఖర్చు పెట్టడం వల్ల టెక్నికల్గా ఉన్నతంగా అనిపించాయే తప్ప సినిమాల స్థాయి ఏమీ పెరగలేదు. నిజానికి ఈ భారీతనం వల్ల కొంత అసహజత్వం వచ్చిన మాట కూడా వాస్తవం. అసలు సినిమాకు కీలకమైన కథాకథనాల మీద శ్రద్ధ పెట్టకుండా ఎంత ఖర్చు పెట్టి, ఎన్ని హంగులు జోడించి ఏం ప్రయోజనం? అయినా ప్రభాస్ సినిమా అంటే భారీతనం ఉంటేనే చూస్తారన్న భ్రమల్లో ఎందుకున్నారన్నది అర్థం కాని విషయం.
అతణ్ని మామూలు కథల్లో, ఒక సామాన్యుడిలా చూడలేమా అన్నది ప్రశ్న. సాహో, రాధేశ్యామ్ చిత్రాల్లో అతణ్నో అసామాన్యుడిగా చూపించడం వల్ల ఒరిగిందేమిటి? కాబట్టి అవసరం లేని భారీతనం, హంగులు, బడ్జెట్ మీద ఫోకస్ పక్కకు మళ్లించి మామూలు కథల్లో, ఓ మోస్తరు బడ్జెట్లలో సినిమా చేసి అందరినీ సంతోషపెట్టడానికి ప్రభాస్ ప్రయత్నిస్తే మంచిది.
This post was last modified on March 17, 2022 12:31 am
రామాయణం.. తరతరాలుగా ప్రతీ ఇంటితోనూ విడదీయరాని బంధం ఉన్న ఒక గొప్ప ఎమోషన్. అయితే ఈ కథను ఇండియన్ సినిమా…
కలిసి రాజకీయం చేయకపోయినా వైఎస్సార్సీపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య కొన్ని పోలికలు కనిపిస్తున్నాయి. అటు ఏపీలో, ఇటు తెలంగాణలో ఈ…
సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటూ.. తన సినిమాల ఈవెంట్లలో, ఇంటర్వ్యూల్లో హాట్ హాట్ కామెంట్లు చేస్తుంటాడు ప్రముఖ తెలుగు…
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు'తో ఇప్పుడు తప్పకుండా హిట్ కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. గతంలో 'గద్దలకొండ గణేష్'…
ఆదివారం రోజు అందులోనూ ప్రత్యేకంగా సాయంత్రం షోలకు ఆక్యుపెన్సీలు బాగుండటం సహజమే కానీ ఈవారం మాత్రం బయ్యర్లు ఆనందంతో మునిగిపోయేలా…
తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమలులో కీలక మార్పులు తెచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతుంది. కళాశాలలకు…