యువ కథానాయకుడు విశ్వక్సేన్ ప్రధాన పాత్రలో ఇటీవలే దస్ కా దమ్కీ అనే సినిమా అనౌన్స్ కావడం తెలిసిందే. గత ఏడాది విశ్వక్ నుంచి వచ్చిన పాగల్ మూవీతో దర్శకుడిగా పరిచయం అయిన నరేష్ కుప్పిలినే ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నట్లు ప్రకటించారు. పాగల్ సినిమా ఫ్లాపైనా నరేష్కు విశ్వక్సేన్ ఇంకో ఛాన్స్ ఇవ్వడం గురించి అంతా మాట్లాడుకున్నారు. కట్ చేస్తే.. బుధవారం ఈ చిత్ర షూటింగ్ మొదలైంది.
కానీ ఈ రోజు మెగా ఫోన్ పట్టుకున్నది మాత్రం నరేష్ కాదు. స్వయంగా విశ్వక్సేనే ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండటం విశేషం. వారం రోజుల ముందు అనౌన్స్మెంట్ సందర్భంగా నరేష్ కుప్పిలిని దర్శకుడిగా ప్రకటించి.. ఇప్పుడేమో విశ్వకే ఆ బాధ్యత తీసుకోవడం ఆశ్చర్యం కలిగించే విషయం. ఇంతలో ఏం జరిగిందన్నది ఎవరికీ అర్థం కావడం లేదు. అసలీ సినిమాకు స్క్రిప్టు రెడీ చేసిందెవరు.. ఇన్నాళ్లూ దాన్ని డీల్ చేసిందెవరు.. ఇప్పుడు ఇంత మార్పు ఎలా జరిగింది అన్నది తెలియడం లేదు.
ఐతే విశ్వక్కు దర్శకత్వం అయితే కొత్త కాదు. అతను ఇంతకుముందే ఫలక్నుమా దాస్ అనే సినిమా తీశాడు. ఐతే అది మలయాళ క్లాసిక్ అంగామలై డైరీస్కు రీమేక్. దాన్ని హైదరాబాద్ నేపథ్యంలో విశ్వక్ బాగానే తీశాడు. బాక్సాఫీస్ దగ్గర దానికి ఓ మోస్తరు ఫలితం దక్కింది.
మరి ఈసారి కూడా వేరే భాషా చిత్రాన్నేమైనా రీమేక్ చేస్తున్నాడా.. లేక సొంత కథతోనే సినిమా తీస్తున్నాడా అన్నది చూడాలి. అసలే తొలి సినిమా ఫ్లాప్. పైగా ఇప్పుడు రెండో సినిమాకు దర్శకుడిగా ప్రకటించి.. తీరా షూటింగ్ మొదలయ్యే టైంకి తప్పించడం అన్నది నరేష్ కెరీర్కు ఇబ్బందికరమే. మరి ఈ మార్పు ఎందుకు చేయాల్సి వచ్చిందో తన కొత్త చిత్రం అశోకవనంలో అర్జున కళ్యాణం రిలీజ్ టైంలో మీడియాను కలిసినపుడు విశ్వక్ చెప్పక తప్పదేమో.
This post was last modified on March 17, 2022 12:23 am
రాజకీయాల్లో అవకాశాలు రావడమే అరుదు. వచ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవసరం.. వాటిని పట్టుకుని ఎదగాల్సిన అవసరం కూడా పార్టీలకు, నాయకులకు…
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…
పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…
తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత పరిస్థితి తొలిగిపోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన…
దేశ ప్రధాని నరేంద్ర మోడీ.. ఆదివారం హైదరాబాద్లో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ పర్యటనలో మరో…
‘కహోనా ప్యార్ హై’ చిత్రంతో హృతిక్ రోషన్ మాత్రమే కాదు.. ఆ చిత్ర కథానాయిక అమీషా పటేల్ సైతం ఓవర్…