యువ కథానాయకుడు విశ్వక్సేన్ ప్రధాన పాత్రలో ఇటీవలే దస్ కా దమ్కీ అనే సినిమా అనౌన్స్ కావడం తెలిసిందే. గత ఏడాది విశ్వక్ నుంచి వచ్చిన పాగల్ మూవీతో దర్శకుడిగా పరిచయం అయిన నరేష్ కుప్పిలినే ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నట్లు ప్రకటించారు. పాగల్ సినిమా ఫ్లాపైనా నరేష్కు విశ్వక్సేన్ ఇంకో ఛాన్స్ ఇవ్వడం గురించి అంతా మాట్లాడుకున్నారు. కట్ చేస్తే.. బుధవారం ఈ చిత్ర షూటింగ్ మొదలైంది.
కానీ ఈ రోజు మెగా ఫోన్ పట్టుకున్నది మాత్రం నరేష్ కాదు. స్వయంగా విశ్వక్సేనే ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండటం విశేషం. వారం రోజుల ముందు అనౌన్స్మెంట్ సందర్భంగా నరేష్ కుప్పిలిని దర్శకుడిగా ప్రకటించి.. ఇప్పుడేమో విశ్వకే ఆ బాధ్యత తీసుకోవడం ఆశ్చర్యం కలిగించే విషయం. ఇంతలో ఏం జరిగిందన్నది ఎవరికీ అర్థం కావడం లేదు. అసలీ సినిమాకు స్క్రిప్టు రెడీ చేసిందెవరు.. ఇన్నాళ్లూ దాన్ని డీల్ చేసిందెవరు.. ఇప్పుడు ఇంత మార్పు ఎలా జరిగింది అన్నది తెలియడం లేదు.
ఐతే విశ్వక్కు దర్శకత్వం అయితే కొత్త కాదు. అతను ఇంతకుముందే ఫలక్నుమా దాస్ అనే సినిమా తీశాడు. ఐతే అది మలయాళ క్లాసిక్ అంగామలై డైరీస్కు రీమేక్. దాన్ని హైదరాబాద్ నేపథ్యంలో విశ్వక్ బాగానే తీశాడు. బాక్సాఫీస్ దగ్గర దానికి ఓ మోస్తరు ఫలితం దక్కింది.
మరి ఈసారి కూడా వేరే భాషా చిత్రాన్నేమైనా రీమేక్ చేస్తున్నాడా.. లేక సొంత కథతోనే సినిమా తీస్తున్నాడా అన్నది చూడాలి. అసలే తొలి సినిమా ఫ్లాప్. పైగా ఇప్పుడు రెండో సినిమాకు దర్శకుడిగా ప్రకటించి.. తీరా షూటింగ్ మొదలయ్యే టైంకి తప్పించడం అన్నది నరేష్ కెరీర్కు ఇబ్బందికరమే. మరి ఈ మార్పు ఎందుకు చేయాల్సి వచ్చిందో తన కొత్త చిత్రం అశోకవనంలో అర్జున కళ్యాణం రిలీజ్ టైంలో మీడియాను కలిసినపుడు విశ్వక్ చెప్పక తప్పదేమో.
This post was last modified on March 17, 2022 12:23 am
నిర్మాత దిల్ రాజు అన్నట్టు వందల సినిమాలు తీయకపోయినా కెవిఎన్ ప్రొడక్షన్స్ అనేది ఇప్పుడు అన్ని బాషల ఇండస్ట్రీలో హాట్…
మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా ‘కాాకా’ నుంచి ఇటీవల రిలీజ్ చేసిన టైటిల్ గ్లింప్స్ మెగా అభిమానులనే కాక సామాన్య…
కింగ్ సైజ్ ఫిలిం మేకర్ అని ఎవరికైనా బిరుదు ఇవ్వాల్సి వస్తే అందరి మదిలో మెదిలే ఒకే ఒక్క పేరు…
మాస్ రాజా రవితేజ నిఖార్సయిన హిట్టు కొట్టి నాలుగేళ్లయింది. ఈ నాలుగేళ్లలో ఆయన ఆరు చిత్రాలతో పలకరించాడు. వీటిలో కొన్ని…
ఏదైనా మితంగా తింటేనే అందం. మితిమీరిందా పొట్ట ఉబ్బిపోయి డాక్టర్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. తిండి సామెత సినిమాలకు కూడా…
కరోనా తర్వాత థియేటర్స్ కి జనం మళ్ళీ వచ్చేలా చేసిన సినిమాల్లో జాంబీ రెడ్డి ఉంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ…