Movie News

షూటింగ్ మొద‌లైంది.. కానీ డైరెక్ట‌ర్ మారిపోయాడు

యువ క‌థానాయ‌కుడు విశ్వ‌క్సేన్ ప్ర‌ధాన పాత్ర‌లో ఇటీవ‌లే ద‌స్ కా దమ్కీ అనే సినిమా అనౌన్స్ కావ‌డం తెలిసిందే. గ‌త ఏడాది విశ్వ‌క్ నుంచి వ‌చ్చిన పాగ‌ల్ మూవీతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అయిన న‌రేష్ కుప్పిలినే ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. పాగ‌ల్ సినిమా ఫ్లాపైనా న‌రేష్‌కు విశ్వ‌క్సేన్ ఇంకో ఛాన్స్ ఇవ్వ‌డం గురించి అంతా మాట్లాడుకున్నారు. క‌ట్ చేస్తే.. బుధ‌వారం ఈ చిత్ర షూటింగ్ మొద‌లైంది.

కానీ ఈ రోజు మెగా ఫోన్ ప‌ట్టుకున్న‌ది మాత్రం న‌రేష్ కాదు. స్వ‌యంగా విశ్వ‌క్సేనే ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌టం విశేషం. వారం రోజుల ముందు అనౌన్స్‌మెంట్ సంద‌ర్భంగా న‌రేష్ కుప్పిలిని ద‌ర్శ‌కుడిగా ప్ర‌క‌టించి.. ఇప్పుడేమో విశ్వ‌కే ఆ బాధ్యత తీసుకోవ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగించే విష‌యం. ఇంత‌లో ఏం జ‌రిగింద‌న్న‌ది ఎవ‌రికీ అర్థం కావ‌డం లేదు. అస‌లీ సినిమాకు స్క్రిప్టు రెడీ చేసిందెవ‌రు.. ఇన్నాళ్లూ దాన్ని డీల్ చేసిందెవ‌రు.. ఇప్పుడు ఇంత మార్పు ఎలా జ‌రిగింది అన్న‌ది తెలియ‌డం లేదు.

ఐతే విశ్వ‌క్‌కు ద‌ర్శ‌క‌త్వం అయితే కొత్త కాదు. అత‌ను ఇంత‌కుముందే ఫ‌ల‌క్‌నుమా దాస్ అనే సినిమా తీశాడు. ఐతే అది మ‌ల‌యాళ క్లాసిక్ అంగామ‌లై డైరీస్‌కు రీమేక్. దాన్ని హైద‌రాబాద్ నేప‌థ్యంలో విశ్వ‌క్ బాగానే తీశాడు. బాక్సాఫీస్ ద‌గ్గ‌ర దానికి ఓ మోస్త‌రు ఫ‌లితం ద‌క్కింది.

మ‌రి ఈసారి కూడా వేరే భాషా చిత్రాన్నేమైనా రీమేక్ చేస్తున్నాడా.. లేక సొంత క‌థ‌తోనే సినిమా తీస్తున్నాడా అన్న‌ది చూడాలి. అస‌లే తొలి సినిమా ఫ్లాప్. పైగా ఇప్పుడు రెండో సినిమాకు ద‌ర్శ‌కుడిగా ప్ర‌క‌టించి.. తీరా షూటింగ్ మొద‌ల‌య్యే టైంకి త‌ప్పించ‌డం అన్న‌ది న‌రేష్ కెరీర్‌కు ఇబ్బందిక‌ర‌మే. మ‌రి ఈ మార్పు ఎందుకు చేయాల్సి వ‌చ్చిందో త‌న కొత్త చిత్రం అశోక‌వ‌నంలో అర్జున క‌ళ్యాణం రిలీజ్ టైంలో మీడియాను క‌లిసిన‌పుడు విశ్వ‌క్ చెప్ప‌క త‌ప్ప‌దేమో.

This post was last modified on March 17, 2022 12:23 am

Share
Show comments
Published by
Tharun

Recent Posts

మోడీని మెస్మరైజ్ చేసిన లోకేష్

రాజ‌మండ్రిలో నిర్వ‌హించిన కూటమి పార్టీల‌(జ‌న‌సేన‌-బీజేపీ-టీడీపీ) ఎన్నిక‌ల ప్ర‌చార స‌భ 'ప్ర‌జాగ‌ళం'లో చంద్ర‌బాబు పాల్గొన లేక పోయారు. ఆయ‌న వేరే స‌భ‌లో…

3 hours ago

క్యారెక్టర్ ఆర్టిస్టులు హీరోలుగా మారితే

మాములుగా కమెడియన్లు హీరోలు కావడం గతంలో ఎన్నో చూశాం. చూస్తున్నాం. కానీ మధ్యవయసు దాటిన క్యారెక్టర్ ఆర్టిస్టులు కథానాయకులుగా మారడం…

4 hours ago

ఏపీలో అవినీతి తప్ప ఏం లేదు – మోడీ

ఏపీలో డ‌బుల్ ఇంజ‌న్ స‌ర్కారు రానుంద‌ని ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ అన్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూట‌మే కేంద్రంలోనూ…

5 hours ago

వేటు మీద వేటు.. ఆయనొక్కరే మిగిలారు

ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని వారాల నుంచి ఎన్నికల కమిషన్ కొరఢా ఝళిపిస్తూ ఉంది. ఎన్నికల సమయంలో తమ పరిధి దాటి వ్యవహరిస్తున్న…

6 hours ago

రాజ్ తరుణ్ నిర్మాతల భలే ప్లాన్

కుర్ర హీరోల్లో వేగంగా మార్కెట్ పడిపోయిన వాళ్ళలో రాజ్ తరుణ్ పేరు మొదటగా చెప్పుకోవాలి. కెరీర్ ప్రారంభంలో కుమారి 21…

6 hours ago

ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. కేంద్రం ఏం చెప్పింది వీళ్లేం చేశారు?

ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. గత ఏడాది ఏపీలో జగన్ సర్కారు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి చట్టం. ఇప్పుడీ చట్టం ఎన్నికల ముంగిట…

8 hours ago