తొలి సినిమా మిర్చితోనే అగ్ర దర్శకుల జాబితాలో
చేరిపోయాడు కొరటాల శివ. అతను ఇప్పటిదాకా తీసింది నాలుగు సినిమాలే. ఆ
నాలుగూ బ్లాక్బస్టర్లే. దర్శకుడిగా కొరటాలకు ఇది ఏడో సంవత్సరం.
ఆయన ఇంకా చాలా ఏళ్లు దర్శకుడిగా కొనసాగుతాడని.. మరెన్నో సినిమాలు
తీస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు.
కానీ ఆయన మాత్రం ఇంకో
ఐదేళ్లకు మించి తాను సినిమాలు తీయనంటున్నాడు. ప్రస్తుతం కమిటై ఉన్న
సినిమాలన్నీ పూర్తి చేసి ఐదేళ్లలో రిటైరవ్వాలనుకుంటున్నట్లు కొరటాల
తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పడం విశేషం. ఆ సమయానికి యువ ప్రతిభావంతులు
వచ్చి తన స్థానాన్నీ భర్తీ చేస్తారని ఆయన చెప్పాడు.
మరి
రిటైర్మెంట్ తీసుకుని కొరటాల ఏం చేస్తాడు అంటే.. సమాజ సేవ అంటున్నాడు.
ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా ఇంటి పట్టునే ఉన్న కొరటాల..
ఆత్మపరిశీలన చేసుకుంటున్నట్లు చెప్పాడు. సమాజానికి ఏం చేయాలనే ఆలోచన
చేస్తున్నట్లు వెల్లడించాడు. కొరటాలలో సామాజిక స్పృహ ఎక్కువన్నది
అతడి మాటలు, చేతల్ని బట్టి తెలుస్తూనే ఉంటుంది. ఇప్పటికే తన
సంపాదనలో కొంత భాగం సామాజిక కార్యక్రమాలకు వినియోగిస్తున్నాడు.
సొసైటీ
కోసమని పిల్లలు కూడా వద్దనుకున్న గొప్ప మనిషి కొరటాల. దీని గురించి
గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ
విషయాన్ని ప్రస్తావించాడు. అంటే ఇప్పుడు సినిమాల ద్వారా
సంపాదిస్తున్నదంతా కూడా భవిష్యత్తులో సమాజం కోసమే
వెచ్చించబోతున్నాడన్నమాట కొరటాల. సొసైటీ కోసం పిల్లల్ని
వద్దనుకుని.. బ్రహ్మాండమైన కెరీర్ను కూడా వదులుకుని సామాజిక సేవలో
నిమగ్నమవ్వాలనుకుంటున్నాడంటే కొరటాల గొప్పోడేనబ్బా!
This post was last modified on April 17, 2020 5:50 pm
సంక్రాంతి పండుగ హడావుడి మొదలవడంతో హైదరాబాద్ నగరం ఒక్కసారిగా ఖాళీ అవుతోంది. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో విజయవాడ జాతీయ రహదారి…
టాలీవుడ్లో సక్సెస్ ఫార్ములా తెలిసిన దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. కెరీర్ ప్రారంభం నుంచి ఆయన ఎంచుకుంటున్న పంథా చాలా…
తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్చార్జ్ శంకర్గౌడ్…
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…
అప్పుడు మహ్మద్ గజని… ఇప్పుడు వైఎస్ జగన్ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…