రాజమౌళి రాయబారం ఫలించినట్లే ఉంది. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన భారీ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’కు జగన్ సర్కారు బహుమతి ఇచ్చినట్లే కనిపిస్తోంది. ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ భారీ చిత్రానికి ఏపీలో అదనంగా టికెట్ల రేట్లు పెంచుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది. టికెట్ మీద రూ.100 అదనంగా పెంచుకోవడానికి జగన్ సర్కారు పచ్చజెండా ఊపినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.
ఐతే ఐదో షోకు కూడా అనుమతి ఇవ్వాలని, అదనపు షోగా చిన్న సినిమాను ప్రదర్శించాలనే మెలిక తీసేయాలని, తమ సినిమానే రోజుకు ఐదు ఆటలు నడిపించుకునే సౌలభ్యం కల్పించాలని రాజమౌళి కోరగా.. ఈ విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. బెనిఫిట్ షోల కోసం కూడా అడగ్గా.. దాని గురించీ క్లారిటీ రావాల్సి ఉంది. టికెట్ల రేట్ల పెంపు వరకు అయితే ఇబ్బంది ఏమీ లేదని సమాచారం. గత ఏడాది అనూహ్యంగా తగ్గించి పడేసిన టికెట్ల రేట్లను ఇటీవలే జగన్ సర్కారు పెంచుతూ జీవో ఇవ్వడం తెలిసిందే.
భారీ చిత్రాలకు కొన్ని షరతుల ప్రకారం దీని మీద అదనంగా రేట్లు పెంచుకునే సౌలభ్యం ఉంటుందని కూడా అందులో పేర్కొన్న సంగతి తెలిసిందే. ఐతే పారితోషకాలు కాకుండా మేకింగ్ ఖర్చు రూ.100 కోట్లు ఉండి, 20 శాతం షూటింగ్ ఏపీలో జరిగితేనే ఇది వర్తిస్తుందని పేర్కొంది. కానీ బడ్జెట్ పరంగా రాధేశ్యామ్, ఆర్ఆర్ఆర్ ఈ కేటగిరిలోకి వచ్చినా.. 20 శాతం షూటింగ్ ఏపీలో చేసుకోకపోవడం మైనస్ అయింది.
ఐతే ఈ జీవో తెచ్చింది ఇప్పుడే కాబట్టి ఇప్పటికే షూటింగ్ పూర్తయిన సినిమాలకు ఇది ఎలా వర్తింపజేస్తారన్న ప్రశ్న తలెత్తింది. ముందు రాధేశ్యామ్, ఆర్ఆర్ఆర్ రెంటికీ రేట్ల పెంపు ఉంటుందని ఏపీ మంత్రి పేర్ని నాని అన్నప్పటికీ.. ‘రాధేశ్యామ్’కు అవకాశం దక్కలేదు. అందుకు కారణాలేంటో తెలియదు. ఐతే రాజమౌళి, దానయ్య మాత్రం తమ సినిమాకు లాభం చేకూర్చడం కోసం నేరుగా ఏపీ సీఎంను కలిసి విన్నవించుకుని వచ్చారు. దీంతో జగన్ వరం ఇచ్చినట్లుగా కనిపిస్తోంది.
This post was last modified on March 15, 2022 6:03 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…