రాజమౌళి రాయబారం ఫలించినట్లే ఉంది. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన భారీ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’కు జగన్ సర్కారు బహుమతి ఇచ్చినట్లే కనిపిస్తోంది. ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ భారీ చిత్రానికి ఏపీలో అదనంగా టికెట్ల రేట్లు పెంచుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది. టికెట్ మీద రూ.100 అదనంగా పెంచుకోవడానికి జగన్ సర్కారు పచ్చజెండా ఊపినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.
ఐతే ఐదో షోకు కూడా అనుమతి ఇవ్వాలని, అదనపు షోగా చిన్న సినిమాను ప్రదర్శించాలనే మెలిక తీసేయాలని, తమ సినిమానే రోజుకు ఐదు ఆటలు నడిపించుకునే సౌలభ్యం కల్పించాలని రాజమౌళి కోరగా.. ఈ విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. బెనిఫిట్ షోల కోసం కూడా అడగ్గా.. దాని గురించీ క్లారిటీ రావాల్సి ఉంది. టికెట్ల రేట్ల పెంపు వరకు అయితే ఇబ్బంది ఏమీ లేదని సమాచారం. గత ఏడాది అనూహ్యంగా తగ్గించి పడేసిన టికెట్ల రేట్లను ఇటీవలే జగన్ సర్కారు పెంచుతూ జీవో ఇవ్వడం తెలిసిందే.
భారీ చిత్రాలకు కొన్ని షరతుల ప్రకారం దీని మీద అదనంగా రేట్లు పెంచుకునే సౌలభ్యం ఉంటుందని కూడా అందులో పేర్కొన్న సంగతి తెలిసిందే. ఐతే పారితోషకాలు కాకుండా మేకింగ్ ఖర్చు రూ.100 కోట్లు ఉండి, 20 శాతం షూటింగ్ ఏపీలో జరిగితేనే ఇది వర్తిస్తుందని పేర్కొంది. కానీ బడ్జెట్ పరంగా రాధేశ్యామ్, ఆర్ఆర్ఆర్ ఈ కేటగిరిలోకి వచ్చినా.. 20 శాతం షూటింగ్ ఏపీలో చేసుకోకపోవడం మైనస్ అయింది.
ఐతే ఈ జీవో తెచ్చింది ఇప్పుడే కాబట్టి ఇప్పటికే షూటింగ్ పూర్తయిన సినిమాలకు ఇది ఎలా వర్తింపజేస్తారన్న ప్రశ్న తలెత్తింది. ముందు రాధేశ్యామ్, ఆర్ఆర్ఆర్ రెంటికీ రేట్ల పెంపు ఉంటుందని ఏపీ మంత్రి పేర్ని నాని అన్నప్పటికీ.. ‘రాధేశ్యామ్’కు అవకాశం దక్కలేదు. అందుకు కారణాలేంటో తెలియదు. ఐతే రాజమౌళి, దానయ్య మాత్రం తమ సినిమాకు లాభం చేకూర్చడం కోసం నేరుగా ఏపీ సీఎంను కలిసి విన్నవించుకుని వచ్చారు. దీంతో జగన్ వరం ఇచ్చినట్లుగా కనిపిస్తోంది.
This post was last modified on March 15, 2022 6:03 pm
స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్ఎస్ తరఫున గత ఎన్నికల్లో గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్కు మద్దతుగా వ్యవహరిస్తూ…
నైజాంలో చాలా ఏళ్ల నుంచి డిస్ట్రిబ్యూషన్లో దిల్ రాజే కింగ్. ఆయన ఈ ఏరియాలో నంబర్ వన్ డిస్ట్రిబ్యూటర్గా ఎదిగాక..…
వచ్చే వారం ది కేరళ స్టోరీ 2 విడుదల కానుంది. మూడేళ్ళ క్రితం వచ్చిన మొదటి భాగం ఎంత సంచలనం…
రాజకీయ పార్టీలు ఓట్ల కోసం కురిపిస్తున్న ఉచితాల ఆఫర్లపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేవలం…
ఒకప్పుడు శంకర్తో సినిమా చేయడానికి వివిధ ఇండస్ట్రీల టాప్ స్టార్లు, అగ్ర నిర్మాతలు లైన్లో ఉండేవారు. మెగాస్టార్ చిరంజీవి అంతటి…
ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు ఎగ్గొట్టిన మాజీ సీఎం జగన్…తాపీగా ఈ రోజు మీడియా ముందుకు వచ్చారు. బడ్జెట్ లో…