మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో దర్శకుడు కె.ఎస్.రవీంద్ర(బాబీ) ఓ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. Mega154 అనే వర్కింగ్ టైటిల్ తో సినిమాను రూపొందించనున్నారు. ఈ సినిమాకి ‘వాల్తేర్ వాసు’ అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. ఈ సినిమాలో మెగాస్టార్ తమ్ముడి పాత్రలో రవితేజ కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. గతంలో చిరు, రవితేజ కలిసి ‘అన్నయ్య’ అనే సినిమాలో నటించారు.
ఆ తరువాత మెగాస్టార్ నటించిన ‘శంకర్ దాదా జిందాబాద్’ సినిమాలో ఓ పాటలో కనిపించారు రవితేజ. ఇప్పుడు వీరిద్దరూ కలిసి మరోసారి వెండితెరపై కనిపించబోతున్నారు. అయితే ఈ సినిమా కోసం రవితేజ తీసుకున్న రెమ్యునరేషన్ హాట్ టాపిక్ గా మారింది. సాధారణంగా ఒక్కో సినిమాకి రవితేజ 16 నుంచి 18 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటారు. అయితే మెగాస్టార్ సినిమాలో గెస్ట్ రోల్ కోసం రూ.10 కోట్లు అందుకున్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమా కోసం రవితేజ 20 రోజుల కాల్షీట్స్ కేటాయించారట. ఏప్రిల్ నుంచి రవితేజ ఈ సినిమా షూటింగ్ లో పాల్గొంటారని తెలుస్తోంది. మొత్తానికి రవితేజ గెస్ట్ రోల్ కోసం కోట్లలో రెమ్యునరేషన్ తీసుకోవడంతో ఇండస్ట్రీ సర్కిల్ లో డిస్కషన్ మొదలైంది. మెగాస్టార్ కోసం రవితేజ సినిమా ఒప్పుకున్నారా..? లేక భారీ రెమ్యునరేషన్ కోసమా అంటూ మాట్లాడుకుంటున్నారు.
ఏదైతేనేం అభిమానులు మరోసారి చిరు-రవితేజ కాంబినేషన్ చూడబోతున్నారు. ఈ సినిమాలో శృతిహాసన్ ను హీరోయిన్ గా తీసుకున్నట్లు ఇటీవల విమెన్స్ డే సందర్భంగా అనౌన్స్ చేశారు. ప్రస్తుతం శృతి వరుస సినిమాలు చేస్తోంది. బాలకృష్ణ, ప్రభాస్ లతో కలిసి సినిమాలు చేస్తుంది. ఇప్పుడు మెగాస్టార్ తో రొమాన్స్ చేయడానికి రెడీ అవుతోంది.
This post was last modified on March 14, 2022 12:58 pm
చాలాకాలంగా కాంగ్రెస్ పార్టీపై, సీఎం రేవంత్ రెడ్డిపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేస్తున్న సంగతి…
ఏపీ సీఎం చంద్రబాబు ఏ చిన్న అవకాశాన్నీ వదలట్లేదా? అంటే.. ఔననే సమాధానమే వస్తోంది. పెట్టుబడులకు ఎక్కడ అవకాశం ఉంటే..…
తెంపరి తనానికి చొక్కా.. ఫ్యాంటు తొడిగితే.. అది అమెరికా అధ్యక్షుడు ట్రంపేనన్న కామెంట్లు తరచుగా వినిపిస్తాయి. ఎప్పుడు ఎలాంటి నిర్ణయంతో…
ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేయడం చిన్న సినిమాల నిర్మాతలకు దినదిన గండంగా మారిపోయింది. ఆడియన్స్ అభిరుచులు మారిపోయాయో లేక ఓటిటిల…
మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో శాసన సభను బాయ్కాట్ చేసిన వైసీపీ ప్రజాప్రతినిధులు శాసన మండలిలో మాత్రం చిందులు తొక్కుతున్నారు.…