మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో దర్శకుడు కె.ఎస్.రవీంద్ర(బాబీ) ఓ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. Mega154 అనే వర్కింగ్ టైటిల్ తో సినిమాను రూపొందించనున్నారు. ఈ సినిమాకి ‘వాల్తేర్ వాసు’ అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. ఈ సినిమాలో మెగాస్టార్ తమ్ముడి పాత్రలో రవితేజ కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. గతంలో చిరు, రవితేజ కలిసి ‘అన్నయ్య’ అనే సినిమాలో నటించారు.
ఆ తరువాత మెగాస్టార్ నటించిన ‘శంకర్ దాదా జిందాబాద్’ సినిమాలో ఓ పాటలో కనిపించారు రవితేజ. ఇప్పుడు వీరిద్దరూ కలిసి మరోసారి వెండితెరపై కనిపించబోతున్నారు. అయితే ఈ సినిమా కోసం రవితేజ తీసుకున్న రెమ్యునరేషన్ హాట్ టాపిక్ గా మారింది. సాధారణంగా ఒక్కో సినిమాకి రవితేజ 16 నుంచి 18 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటారు. అయితే మెగాస్టార్ సినిమాలో గెస్ట్ రోల్ కోసం రూ.10 కోట్లు అందుకున్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమా కోసం రవితేజ 20 రోజుల కాల్షీట్స్ కేటాయించారట. ఏప్రిల్ నుంచి రవితేజ ఈ సినిమా షూటింగ్ లో పాల్గొంటారని తెలుస్తోంది. మొత్తానికి రవితేజ గెస్ట్ రోల్ కోసం కోట్లలో రెమ్యునరేషన్ తీసుకోవడంతో ఇండస్ట్రీ సర్కిల్ లో డిస్కషన్ మొదలైంది. మెగాస్టార్ కోసం రవితేజ సినిమా ఒప్పుకున్నారా..? లేక భారీ రెమ్యునరేషన్ కోసమా అంటూ మాట్లాడుకుంటున్నారు.
ఏదైతేనేం అభిమానులు మరోసారి చిరు-రవితేజ కాంబినేషన్ చూడబోతున్నారు. ఈ సినిమాలో శృతిహాసన్ ను హీరోయిన్ గా తీసుకున్నట్లు ఇటీవల విమెన్స్ డే సందర్భంగా అనౌన్స్ చేశారు. ప్రస్తుతం శృతి వరుస సినిమాలు చేస్తోంది. బాలకృష్ణ, ప్రభాస్ లతో కలిసి సినిమాలు చేస్తుంది. ఇప్పుడు మెగాస్టార్ తో రొమాన్స్ చేయడానికి రెడీ అవుతోంది.
This post was last modified on March 14, 2022 12:58 pm
సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్పలేమని సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పష్టం చేశారు. ఇటీవల…
బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…
తన సొంత నియోజకవర్గం కుప్పాన్ని ప్రయోగశాలగా మార్చనున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. తాజాగా శుక్రవారం రాత్రి తన నియోజకవర్గానికి వచ్చిన…
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ విషయంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పంతం నెగ్గలేదు. తనను ఎర్రవెల్లిలోని తన ఫామ్…
రామ్ చరణ్ కొత్త సినిమా ‘పెద్ది’కి సెట్స్ మీదికి వెళ్లే సమయంలో రిలీజ్ డేట్ ఖరారు చేశారు. ఈ ఏడాది…
వీణవంకలో సమ్మక్క-సారలమ్మ జాతరలో మొక్కులు చెల్లించుకునేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన కుటుంబ సభ్యులు, మహిళా సర్పంచ్…