మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో దర్శకుడు కె.ఎస్.రవీంద్ర(బాబీ) ఓ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. Mega154 అనే వర్కింగ్ టైటిల్ తో సినిమాను రూపొందించనున్నారు. ఈ సినిమాకి ‘వాల్తేర్ వాసు’ అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. ఈ సినిమాలో మెగాస్టార్ తమ్ముడి పాత్రలో రవితేజ కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. గతంలో చిరు, రవితేజ కలిసి ‘అన్నయ్య’ అనే సినిమాలో నటించారు.
ఆ తరువాత మెగాస్టార్ నటించిన ‘శంకర్ దాదా జిందాబాద్’ సినిమాలో ఓ పాటలో కనిపించారు రవితేజ. ఇప్పుడు వీరిద్దరూ కలిసి మరోసారి వెండితెరపై కనిపించబోతున్నారు. అయితే ఈ సినిమా కోసం రవితేజ తీసుకున్న రెమ్యునరేషన్ హాట్ టాపిక్ గా మారింది. సాధారణంగా ఒక్కో సినిమాకి రవితేజ 16 నుంచి 18 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటారు. అయితే మెగాస్టార్ సినిమాలో గెస్ట్ రోల్ కోసం రూ.10 కోట్లు అందుకున్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమా కోసం రవితేజ 20 రోజుల కాల్షీట్స్ కేటాయించారట. ఏప్రిల్ నుంచి రవితేజ ఈ సినిమా షూటింగ్ లో పాల్గొంటారని తెలుస్తోంది. మొత్తానికి రవితేజ గెస్ట్ రోల్ కోసం కోట్లలో రెమ్యునరేషన్ తీసుకోవడంతో ఇండస్ట్రీ సర్కిల్ లో డిస్కషన్ మొదలైంది. మెగాస్టార్ కోసం రవితేజ సినిమా ఒప్పుకున్నారా..? లేక భారీ రెమ్యునరేషన్ కోసమా అంటూ మాట్లాడుకుంటున్నారు.
ఏదైతేనేం అభిమానులు మరోసారి చిరు-రవితేజ కాంబినేషన్ చూడబోతున్నారు. ఈ సినిమాలో శృతిహాసన్ ను హీరోయిన్ గా తీసుకున్నట్లు ఇటీవల విమెన్స్ డే సందర్భంగా అనౌన్స్ చేశారు. ప్రస్తుతం శృతి వరుస సినిమాలు చేస్తోంది. బాలకృష్ణ, ప్రభాస్ లతో కలిసి సినిమాలు చేస్తుంది. ఇప్పుడు మెగాస్టార్ తో రొమాన్స్ చేయడానికి రెడీ అవుతోంది.
ధనుష్ కొత్త సినిమా పేరు 'ఓం'గా ఫిక్సయ్యింది. అమరన్ ఫేమ్ రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్…
తెలుగులో ఇప్పుడు నిర్మాతల పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా మారిందో తెలిసిందే. నిలకడగా విజయాలు అందుకుని, లాభాలు దక్కించుకునే నిర్మాతలు అరుదైపోయారు.…
విజయవాడలో కనిపించకుండా పోయిన గాదె సాయికృష్ణ వ్యవహారం అంతకంతకూ జఠిలంగా మారుతోంది. సాయికృష్ణ బతికి లేడని, అతడిని పోలీసులే అంతమొందించారని…
తప్పు చేసిన నేతలు ఎప్పటికైనా ప్రజాగ్రహానికి గురి కావాల్సి వస్తుందని చెప్పడానికి పల్నాడు జిల్లాలో జరిగిన ఈ ఘటన ఉదాహరణగా…
మా ఇంటి బంగారం అడ్వాన్స్ బుకింగ్స్ ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తున్నాయి. నిజానికి మూడేళ్ళ గ్యాప్ తర్వాత ఒక హీరోయిన్ ఫిమేల్…
ఏపీ డిప్యూటీ స్పీకర్, మాజీ ఎంపీ.. ప్రస్తుత ఉండి శాసనసభ్యుడు రఘురామకృష్ణరాజును కస్టడీలో టార్చర్ చేసిన కేసులో హైకోర్టు సంచలన…