పెళ్లి తర్వాత ఒక దశలో సినిమాలు బాగా తగ్గించేసి, చేసినా కూడా ట్రెడిషనల్ రోల్సే చేస్తూ నెమ్మదిగా ఫేడవుట్ అయిపోతున్నట్లు కనిపించింది సమంత. పెళ్లి తర్వాత హీరోయిన్లందరిదీ ఇదే వరస కాబట్టి అదేమీ ఆశ్చర్యం కలిగించలేదు. కానీ గత ఏడాది చైతూతో వివాహ బంధంలో ఉండగానే ‘ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ రెండో సీజన్లో సమంత సెన్సేషనల్ రోల్తో అందరికీ పెద్ద షాకిచ్చింది. వివాహానంతరం ఇంత బోల్డ్ రోల్ చేయడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది.
కానీ ఆ తర్వాతే తెలిసింది చైతూ నుంచి ఆమె విడిపోతోందని. అధికారికంగా విడాకులయ్యాక ఈ మధ్య ‘పుష్ప’ సినిమాలో ‘ఊ అంటావా మావా ఊహూ అంటావా’ ఐటెం సాంగ్లో సమంత ఎంత షాకింగ్గా కనిపించిందో తెలిసిందే. కెరీర్లో ఇప్పటిదాకా ఎన్నడూ లేనంత హాట్గా ఈ పాటలో కనిపించి అందరినీ విస్మయానికి గురి చేసిందామె. ఈ పాట ఎంత పాపులరో కొత్తగా చెప్పాల్సిన పని లేదు.
తాజాగా సామ్ ‘ఫ్యామిలీ మ్యాన్’లో తన పాత్రకు సంబంధించి ఒక అవార్డు అందుకోవడానికి ముంబయి వెళ్లింది. అక్కడ అందరి చూపులూ సమంత మీదే పడేలా సూపర్ హాట్గా డ్రెస్ చేసుకుని వెళ్లింది. ఈ ఫొటోలు నిన్న సాయంత్రం నుంచి ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నాయి. ఈ అవార్డుల వేడుకలో సమంత మాట్లాడుతూ.. ఫ్యామిలీ మ్యాన్-2 సిరీస్, ఊ అంటావా పాటలు తనకు తెచ్చిన పాపులారిటీ గురించి ప్రస్తావించింది.
‘‘ఫ్యామిలీ మ్యాన్-2 సిరీస్తో పాటు ఊ అంటావా పాట నాకు పాన్ ఇండియా స్థాయిలో నాకు ఎంతో పేరు తెచ్చిపెట్టాయి. అభిమానులు చూపించే ప్రేమాభిమానాల గురించి మాటల్లో చెప్పలేను. ఊ అంటావా పాట ఇంత విజయం సాధిస్తుందని అనుకోలేదు. తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాక దేశవ్యాప్తంగా సినీ అభిమానులందరూ నేను చేసిన సినిమాలన్నింటినీ మర్చిపోయారు. ఇక ముందు నన్ను ఈ పాటతోనే గుర్తు పెట్టుకునేలా ఉన్నారు’’ అని సమంత పేర్కొంది.
This post was last modified on March 11, 2022 8:05 pm
‘పవన్ కళ్యాణ్, చిరంజీవికి రక్తం పంచుకుని పుట్టిన తమ్ముడు కావొచ్చు.. కానీ, నేనూ ఆయనకి చెల్లెల్నే.. చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం…
మీ భూమి మీది కాదు.! ఈ మాట ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ విన్నా చర్చనీయాంశమవుతోన్న మాట.! వైఎస్…
సౌత్ ఇండియన్ ఫిలిం హిస్టరీలో మురుగదాస్ది ప్రత్యేక స్థానం. కమర్షియల్ సినిమాల్లో కూడా వైవిధ్యం చూపిస్తూ.. అదే సమయంలో మాస్ను ఉర్రూతలూగిస్తూ…
ఒకప్పుడు తెలుగు, తమిళంలో భారీ చిత్రాలతో ఒక వెలుగు వెలిగిన నిర్మాత ఎ.ఎం.రత్నం. సూర్య మూవీస్ బేనర్ మీద ‘ఖుషి’ సహా…
లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా పాటల గొప్పదనం గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. సంగీతాభిమానులు ఆయన్ని దేవుడిలా కొలుస్తారు.…
కూటమి అధికారంలోకి రాగానే.. తాను చేసే తొలి సంతకం.. మెగా డీఎస్సీపైనేనని.. దీనివల్ల 20 వేల మంది నిరుద్యోగులకు మేలు…