పెళ్లి తర్వాత ఒక దశలో సినిమాలు బాగా తగ్గించేసి, చేసినా కూడా ట్రెడిషనల్ రోల్సే చేస్తూ నెమ్మదిగా ఫేడవుట్ అయిపోతున్నట్లు కనిపించింది సమంత. పెళ్లి తర్వాత హీరోయిన్లందరిదీ ఇదే వరస కాబట్టి అదేమీ ఆశ్చర్యం కలిగించలేదు. కానీ గత ఏడాది చైతూతో వివాహ బంధంలో ఉండగానే ‘ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ రెండో సీజన్లో సమంత సెన్సేషనల్ రోల్తో అందరికీ పెద్ద షాకిచ్చింది. వివాహానంతరం ఇంత బోల్డ్ రోల్ చేయడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది.
కానీ ఆ తర్వాతే తెలిసింది చైతూ నుంచి ఆమె విడిపోతోందని. అధికారికంగా విడాకులయ్యాక ఈ మధ్య ‘పుష్ప’ సినిమాలో ‘ఊ అంటావా మావా ఊహూ అంటావా’ ఐటెం సాంగ్లో సమంత ఎంత షాకింగ్గా కనిపించిందో తెలిసిందే. కెరీర్లో ఇప్పటిదాకా ఎన్నడూ లేనంత హాట్గా ఈ పాటలో కనిపించి అందరినీ విస్మయానికి గురి చేసిందామె. ఈ పాట ఎంత పాపులరో కొత్తగా చెప్పాల్సిన పని లేదు.
తాజాగా సామ్ ‘ఫ్యామిలీ మ్యాన్’లో తన పాత్రకు సంబంధించి ఒక అవార్డు అందుకోవడానికి ముంబయి వెళ్లింది. అక్కడ అందరి చూపులూ సమంత మీదే పడేలా సూపర్ హాట్గా డ్రెస్ చేసుకుని వెళ్లింది. ఈ ఫొటోలు నిన్న సాయంత్రం నుంచి ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నాయి. ఈ అవార్డుల వేడుకలో సమంత మాట్లాడుతూ.. ఫ్యామిలీ మ్యాన్-2 సిరీస్, ఊ అంటావా పాటలు తనకు తెచ్చిన పాపులారిటీ గురించి ప్రస్తావించింది.
‘‘ఫ్యామిలీ మ్యాన్-2 సిరీస్తో పాటు ఊ అంటావా పాట నాకు పాన్ ఇండియా స్థాయిలో నాకు ఎంతో పేరు తెచ్చిపెట్టాయి. అభిమానులు చూపించే ప్రేమాభిమానాల గురించి మాటల్లో చెప్పలేను. ఊ అంటావా పాట ఇంత విజయం సాధిస్తుందని అనుకోలేదు. తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాక దేశవ్యాప్తంగా సినీ అభిమానులందరూ నేను చేసిన సినిమాలన్నింటినీ మర్చిపోయారు. ఇక ముందు నన్ను ఈ పాటతోనే గుర్తు పెట్టుకునేలా ఉన్నారు’’ అని సమంత పేర్కొంది.
టాలీవుడ్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా మొత్తానికి ముహూర్త వేడుకను ముగించింది. విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్…
టాలీవుడ్ లో క్లాసిక్ లుక్స్ తో ప్రేక్షకుల మనసు గెలుచుకున్న హీరోయిన్లలో మృణాల్ థాకూర్ ఒకరు. సీతారామం సినిమాతో తెలుగు…
పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కావడం ఇప్పుడు చాలా కామన్ పాయింట్. కానీ ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా…
ధనుష్ కొత్త సినిమా పేరు 'ఓం'గా ఫిక్సయ్యింది. అమరన్ ఫేమ్ రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్…
తెలుగులో ఇప్పుడు నిర్మాతల పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా మారిందో తెలిసిందే. నిలకడగా విజయాలు అందుకుని, లాభాలు దక్కించుకునే నిర్మాతలు అరుదైపోయారు.…
విజయవాడలో కనిపించకుండా పోయిన గాదె సాయికృష్ణ వ్యవహారం అంతకంతకూ జఠిలంగా మారుతోంది. సాయికృష్ణ బతికి లేడని, అతడిని పోలీసులే అంతమొందించారని…