సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య నేపథ్యంలో బాలీవుడ్లోని చీకటి కోణాలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి. ‘దబంగ్’ లాంటి పెద్ద బ్లాక్ బస్టర్ ఇచ్చిన దర్శకుడు అభినవ్ కశ్యప్.. సల్మాన్ ఖాన్ సంస్థలో దీనికి సీక్వెల్ సినిమా చేయనందుకు గాను అతడి తమ్ముళ్లు తనపై కక్ష గట్టి ఎలా కెరీర్ను నాశనం చేశారో చాలా వివరంగా ఒక పెద్ద పోస్టు పెట్టాడు ఫేస్ బుక్లో.
‘దబంగ్’ లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చాక అభినవ్ పదేళ్లలో చేసింది ఒకే ఒక్క సినిమా. ఆ సినిమా (బేషారం) విడుదలకు కూడా అనేక అడ్డంకులు ఎదురయ్యాయని.. సల్మాన్ తమ్ముళ్లు దాని రిలీజ్ ఆపేందుకు అనేక రకాలుగా ప్రయత్నించారని అభినవ్ సంచలన ఆరోపణలు చేశాడు. ఈ సినిమా చేయడానికి ముందు రెండు బేనర్లలో తాను సినిమాలు కోల్పోవడానికి కారణం కూడా సల్మాన్ తమ్ముళ్లు అర్బాజ్, సోహైల్లే అని కూడా అభినవ్ ఆరోపించాడు.
దీనిపై సల్మాన్, అతడి తమ్ముళ్లు ఎలా స్పందిస్తారా అని బాలీవుడ్ అంతా ఎదురు చూస్తోంది. ఐతే వాళ్లిద్దరూ తీవ్రంగానే స్పందించారు. అభినవ్ మీద కేసులు పెట్టడానికి రెడీ అయిపోయారు. అతడిపై పరువు నష్టం దావా వేయనున్నట్లు అర్బాజ్, సోహైల్ మీడియాకు వెల్లడించారు. అభినవ్ ఆరోపణలన్నీ అసత్యాలని.. అతను తమ ప్రతిష్ఠను దెబ్బ తీసేందుకే ఇలాంటి ఆరోపణలు చేశాడని.. ఇందుకు అతడికి తగిన బుద్ధి చెబుతామని అర్బాజ్ అన్నాడు.
అభినవ్కు ఇప్పటికే వాళ్లు నోటీసులు కూడా పంపినట్లు చెబుతున్నారు. దీనిపై సల్మాన్ ఖాన్ తండ్రి సలీమ్ ఖాన్ కూడా స్పందించాడు. ఈ విషయంపై తానైతే స్పందించి సమయం వృథా చేసుకోనని అన్నాడు. ఐతే అభినవ్ కెరీర్ ఏమాత్రం ముందుకు సాగకుండా ‘దబంగ్’ తర్వాత ఒక్క చిత్రంతో ఆగిపోయిన నేపథ్యంలో అతడి ఆరోపణల్లో నిజం లేకపోలేదనే జనాలు భావిస్తున్నారు.
This post was last modified on June 20, 2020 12:13 am
ఏపీ సీఎం చంద్రబాబుకు కేంద్రం చేసిన ప్రతిపాదన తీవ్ర సంకట స్థితిలోకి నెట్టేసింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలంటూ.. కేంద్ర…
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…