Movie News

చిరు కోసం మేఘనా రాజ్ కన్నీటి పోస్ట్

ఇటీవల దక్షిణాది సినీ పరిశ్రమను విషాదంలో ముంచెత్తిన విషయం.. అర్జున్ మేనల్లుడు, కన్నడ నటుడు చిరంజీవి సర్జా మరణమే. ఎంతో ఆరోగ్యంగా, హుషారుగా కనిపించే అతను.. 39 ఏళ్ల వయసులోనే హఠాత్తుగా గుండెపోటుకు గురై ప్రాణాలు వదిలాడు. తెలుగులో ‘బెండు అప్పారావు’ సినిమా చేసిన మేఘనా రాజ్‌కు అతను భర్త అనే విషయం మన వాళ్లకు కొంచెం ఆలస్యంగా తెలిసింది.

వీళ్లిద్దరూ పదేళ్ల పాటు ప్రేమలో ఉండి.. రెండేళ్ల కిందటే పెళ్లి చేసుకున్నారు. చిరంజీవి చనిపోయే సమయానికి మేఘన గర్భవతి అంటూ మీడియాలో వార్తలొచ్చాయి. అది తెలిశాక అందరూ మేఘనను చూసి అయ్యో అనుకున్నారు. భర్త అంతిమ సంస్కారాల వద్ద.. అతడిని ముద్దాడుతూ మేుఘన పొగిలి పొగిలి ఏడ్చిన వైనం అందరినీ కలచివేసింది.

చిరు మరణం నుంచి కొంచెం కోలుకున్న మేఘన.. ఈ రోజు కాస్త ఓపిక చేసుకుని ఒక హార్ట్ టచింగ్ నోట్‌ను ట్విట్టర్లో పోస్ట్ చేసింది. తమది ఎంత లోతైన బంధమో అందులో ఆమె వివరించింది. చిరును ఎంతగా మిస్సవుతున్నది హృద్యంగా చెప్పుకొచ్చింది. నేను ఇంటికొచ్చేశా అన్న చిరు మాట వినలేకపోతున్నందుకు.. ప్రతి నిమిషం చిరును తాకలేకపోతున్నందుకు గుండె బరువెక్కుతోందని అంది.

ఐతే చిరు తనను ఒంటరిగా వదిలి ఎలా వెళ్తాడన్న మేఘన.. తన కోసం అతను తమ చిన్నారి రూపంలో విలువైన బహుమతిని ఇచ్చి వెళ్లాడని.. అది తమ ప్రేమకు గుర్తు అని మేఘన వ్యాఖ్యానించింది. తద్వారా తాను గర్భవతిననే విషయాన్ని మేఘన కన్ఫమ్ చేసింది. తమ బిడ్డను భూమి మీదికి తెచ్చేందుకు, మళ్లీ చిరును చేతులతో పట్టుకునేందుకు, అతడి నవ్వును చూసేందుకు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నానని అంది మేఘన. చిరు తనలోనే ఉన్నాడని.. తన చివరి శ్వాస వరకు అతను బతికే ఉంటాడని మేఘన హృద్యమైన మాట చెప్పి ఈ పోస్ట్‌ను ముగించింది.

This post was last modified on June 18, 2020 3:43 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

మోడీని మెస్మరైజ్ చేసిన లోకేష్

రాజ‌మండ్రిలో నిర్వ‌హించిన కూటమి పార్టీల‌(జ‌న‌సేన‌-బీజేపీ-టీడీపీ) ఎన్నిక‌ల ప్ర‌చార స‌భ 'ప్ర‌జాగ‌ళం'లో చంద్ర‌బాబు పాల్గొన లేక పోయారు. ఆయ‌న వేరే స‌భ‌లో…

9 hours ago

క్యారెక్టర్ ఆర్టిస్టులు హీరోలుగా మారితే

మాములుగా కమెడియన్లు హీరోలు కావడం గతంలో ఎన్నో చూశాం. చూస్తున్నాం. కానీ మధ్యవయసు దాటిన క్యారెక్టర్ ఆర్టిస్టులు కథానాయకులుగా మారడం…

10 hours ago

ఏపీలో అవినీతి తప్ప ఏం లేదు – మోడీ

ఏపీలో డ‌బుల్ ఇంజ‌న్ స‌ర్కారు రానుంద‌ని ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ అన్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూట‌మే కేంద్రంలోనూ…

11 hours ago

వేటు మీద వేటు.. ఆయనొక్కరే మిగిలారు

ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని వారాల నుంచి ఎన్నికల కమిషన్ కొరఢా ఝళిపిస్తూ ఉంది. ఎన్నికల సమయంలో తమ పరిధి దాటి వ్యవహరిస్తున్న…

12 hours ago

రాజ్ తరుణ్ నిర్మాతల భలే ప్లాన్

కుర్ర హీరోల్లో వేగంగా మార్కెట్ పడిపోయిన వాళ్ళలో రాజ్ తరుణ్ పేరు మొదటగా చెప్పుకోవాలి. కెరీర్ ప్రారంభంలో కుమారి 21…

12 hours ago

ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. కేంద్రం ఏం చెప్పింది వీళ్లేం చేశారు?

ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. గత ఏడాది ఏపీలో జగన్ సర్కారు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి చట్టం. ఇప్పుడీ చట్టం ఎన్నికల ముంగిట…

14 hours ago