వలిమై.. తమిళ సూపర్ స్టార్లలో ఒకడైన అజిిత్ నటించిన కొత్త చిత్రం. గత నెల 24న భారీ అంచనాలతో విడుదలైందీ సినిమా. తెలుగులో కూడా అదే పేరుతో రిలీజ్ చేశారు. ఈ సినిమా చూసి మన వాళ్లు వేస్ట్ అని తేల్చేశారు. అదే పాత కథ.. రొటీన్ సన్నివేశాలు, ఓవర్ డోస్ సెంటిమెంటుతో మన వాళ్లను విసుగెత్తించిందీ సినిమా. యాక్షన్ సన్నివేశాలు మినహాయిస్తే ఇందులో చెప్పుకోదగ్గ ఆకర్షణలేమీ కనిపించలేదు.
అసలే టాక్ బాగా లేదు. పైగా రెండో రోజే ‘భీమ్లా నాయక్’ రిలీజైంది. దీంతో ‘వలిమై’ అడ్రస్ లేకుండా పోయింది. టాక్ పరంగా చూసినా, వసూళ్ల పరంగా చూసినా తెలుగులో ఈ చిత్రాన్ని డిజాస్టర్గా చెప్పొచ్చు. కానీ తమిళ ప్రేక్షకులు మాత్రం ఈ సినిమాకు పట్టం కట్టేశారు. దీన్ని బ్లాక్బస్టర్ను చేసేశారు. అక్కడ ఈ సినిమాకు టాక్ బాగుంది. వసూళ్లకూ ఢోకా లేదు. రెండో వారంలోనూ ‘వలిమై’ వసూళ్ల మోత మోగిస్తూ దూసుకెళ్తోంది.
తమిళనాట పాత రికార్డులను బద్దలు కొడుతూ దూసుకెళ్తున్న ‘వలిమై’ రూ.200 కోట్ల క్లబ్బులో చేరినట్లుగా అక్కడి ట్రేడ్ పండితులు పేర్కొంటుండటం విశేషం. రెండో వీకెండ్ తర్వాత కూడా, వీక్ డేస్లోనూ సినిమాకు మంచి ఆక్యుపెన్సీ వస్తోందట. ఇప్పటికీ హౌస్ ఫుల్స్ పడుతున్నాయట. వరల్డ్ వైడ్ ఈ సినిమా రూ.200 కోట్ల గ్రాస్ మార్కును దాటేసి ముందుకు వెళ్తోంది. ఇంత రొటీన్ సినిమాకు ఈ స్థాయిలో వసూళ్లు రావడం అనూహ్యం.
ఒకప్పుడు కొత్త తరహా చిత్రాలకు పట్టం కట్టి, రొటీన్ సినిమాలను తిరస్కరించి తమ అభిరుచిని చాటుకున్న తమిళ ప్రేక్షకులు కొన్నేళ్లుగా పరమ రొటీన్ సినిమాలనే నెత్తిన పెట్టుకుంటున్నారు. అన్నాత్తె (పెద్దన్న’ లాంటి పేలవమైన సినిమాకు అక్కడ మంచి వసూళ్లు వచ్చాయి. హౌస్ ఫుల్ కలెక్షన్లతో రన్ అయి ఫైనల్గా అక్కడ ఈ చిత్రం హిట్ అనిపించుకుంది. ఇలా గత కొన్నేళ్ల నుంచి రొటీన్ మాస్ మసాలా సినిమాలే అక్కడ రాజ్యమేలుతుండటం గమనార్హం.
This post was last modified on March 9, 2022 5:12 pm
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…