Movie News

నితిన్ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ

బాలీవుడ్ బ్యూటీస్ కోసం టాలీవుడ్ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. అందుకే మిగతా భాషల కంటే మన దగ్గరే నార్త్ హీరోయిన్స్ ఎక్కువ వర్క్ చేస్తుంటారు. ఇప్పుడు మరొక బాలీవుడ్‌ బ్యూటీ కూడా తెలుగునాట జెండా పాతడానికి ట్రై చేస్తోంది. ఆమె మరెవరో కాదు.. ఊర్వశీ రౌతేలా.     

ఆల్రెడీ ఊర్వశి ఓ తెలుగు సినిమాలో లీడ్ రోల్ చేస్తోంది. అదే ‘బ్లాక్‌ రోజ్‌’. సంపత్ నంది అందించిన కథతో మోహన్ భరద్వాజ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. శ్రీనివాస చిట్టూరి నిర్మాత. ఇప్పుడు నితిన్ నటిస్తన్న ‘మాచర్ల నియోజకవర్గం’ లోనూ ఊర్వశి నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెస్ రాజశేఖర్‌‌రెడ్డి డైరెక్ట్ చేస్తున్న ఈ పొలిటికల్ డ్రామాలో ఆల్రెడీ కీర్తి శెట్టి హీరోయిన్‌గా చేస్తోంది. ఒక కీలక పాత్ర కోసం ఊర్వశిని తీసుకున్నారని సమాచారం.       

నిజానికి పుష్ప సినిమా విషయంలోనూ ఊర్వశి పేరు వినిపించింది. ఊ అంటావా ఊఊ అంటావా పాటకి మొదట ఆమెనే అడిగారట. రెమ్యునరేషన్ ఎక్కువ డిమాండ్ చేయడంతో వద్దనుకున్నారని వార్తలు వచ్చాయి. స్టార్ హీరోయిన్ చేస్తే ఆ కిక్కే వేరుగా ఉంటుందని తర్వాత సమంతను తీసుకున్నాడు సుకుమార్. ఇప్పుడు నితిన్ సినిమాలో ఊర్వశి నటించడం నిజమా కాదా అనేది కూడా అఫీషియల్ కన్ఫర్మేషన్ వస్తే కానీ చెప్పలేం.        

ప్రస్తుతానికైతే ఆమె ఓ తమిళ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉంది. మొన్నటి వరకు ఉక్రెయిన్‌లో షూటింగ్ జరిగింది. ఆ దేశంపై రష్యా దాడి చేయడానికి సరిగ్గా రెండు రోజుల ముందే ఇండియాకి తిరిగొచ్చింది ఊర్వశి. ఆ దేశానికి చెందిన మ్యుజీషియన్‌ మొనాటిక్‌తో కలిసి ఓ మ్యూజిక్ వీడియో కూడా చేయబోతోంది. మరి తెలుగు సినిమా సంగతి త్వరలోనే రివీల్ చేస్తుందేమో చూడాలి. 

This post was last modified on March 7, 2022 9:52 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఫ్లో లో క‌థేంటో చెప్పేసిన హీరో

కొంద‌రు ఫిలిం మేక‌ర్స్ త‌మ సినిమా క‌థేంటో చివ‌రి వ‌ర‌కు దాచి పెట్టాల‌ని ప్ర‌య‌త్నిస్తారు. నేరుగా థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కుల‌ను ఆశ్చ‌ర్య‌ప‌ర‌చాల‌నుకుంటారు.…

38 minutes ago

విదేశీ యూనివ‌ర్సిటీల డాక్టరేట్లు వదులుకున్న చంద్రబాబు

ఏపీ సీఎం చంద్ర‌బాబుకు ప్ర‌ముఖ దిన‌ప‌త్రిక `ఎక‌న‌మిక్ టైమ్స్‌`.. ప్ర‌తిష్టాత్మ‌క వ్యాపార సంస్క‌ర్త‌-2025 పుర‌స్కారానికి ఎంపిక చేసిన విష‌యం తెలిసిందే.…

2 hours ago

బంగ్లా విషయంలో భారత్ భద్రంగా ఉండాల్సిందేనా?

బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్‌కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…

3 hours ago

ఆమెకు ‘ఏఐ’ మొగుడు

ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…

3 hours ago

ఖర్చు పెట్టే ప్రతి రూపాయి లెక్క తెలియాలి

ప్ర‌భుత్వం త‌ర‌ఫున ఖ‌ర్చుచేసేది ప్ర‌జాధ‌న‌మ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. అందుకే ఖ‌ర్చు చేసే ప్ర‌తి రూపాయికీ ఫ‌లితాన్ని ఆశిస్తాన‌ని చెప్పారు.…

5 hours ago

వాళ్ళిద్దరినీ కాదని చంద్రబాబుకే ఎందుకు?

`వ్యాపార సంస్క‌ర్త‌-2025` అవార్డును ఏపీ సీఎం చంద్ర‌బాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశ‌వ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్య‌మంత్రులు…

6 hours ago