ఎవరెన్ని చెప్పినా సినిమాల ప్రభావం జనాల మీద చాలా ఉంటుంది. సినిమాల్లో నటించే వాళ్లు, సినిమాలు తీసేవాళ్లను చూసి కూడా జనాలు ఎంతగానో ఇన్స్పైర్ అవుతారు. వాళ్ల మీద అభిమానాన్ని కేవలం సినిమాలకు పరిమితం చేయరు. వ్యక్తిగతంగానూ వారిని అభిమానిస్తారు. అనుసరిస్తారు. ఆరాధిస్తారు. వాళ్లు రాజకీయాల్లో నిలబడితే ఓటు వేస్తారు. ఫలానా వారికి ఓటు వేయమన్నా కూడా వేస్తారు. కాబట్టే సినిమా వాళ్లు ముఖ్యమంత్రులు కాగలిగారు.
సినిమా వాళ్ల మద్దతుతో ముఖ్యమంత్రులు అయిన వాళ్లూ ఉన్నారు. ఇంతగా జనాలను ప్రభావితం చేసేవాళ్లు.. తమ చర్యల పట్ల ఎప్పుడూ జాగ్రత్తగానే ఉండాలి. కానీ రాజమౌళి ఈ విషయాన్ని మరిచిపోయి ఒక సినిమా ముహూర్త కార్యక్రమానికి హాజరవడం ద్వారా విమర్శలు ఎదుర్కొంటున్నారు సోషల్ మీడియాలో. తెలుగువాడైన కర్ణాటక వ్యాపారవేత్త, రాజకీయ నేత, మాజీ మంత్రి గాలి జనార్దనరెడ్డి తన కొడుకు కిరీటిని హీరోగా పరిచయం చేస్తున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమా శుక్రవారమే ప్రారంభోత్సవం జరుపుకుంది. ఈ వేడుకకు రాజమౌళి ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. గాలి జనార్దనరెడ్డితో కలిసి వేదికను పంచుకున్నాడు. ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నది రాజమౌళి మిత్రుడైన సాయి కొర్రపాటి కావడం వల్లే జక్కన్న ఈ వేడుకకు వచ్చినట్లున్నాడు. కానీ గాలి జనార్దనరెడ్డితో రాజమౌళి చూసి నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. గాలి అవినీతి చరిత్ర గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ హయాంలో ఓబులాపురం గనుల్లో అక్రమ మైనింగ్కు సంబంధించి ఆయన తీవ్ర నేరారోపణలు ఎదుర్కొన్నారు.
కేసులు నమోదై జైలు పాలయ్యారు. బెయిల్ కోసం జడ్జికి భారీగా లంచం ఇచ్చినట్లు కూడా ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఇప్పటికీ ఆ కేసులు కొనసాగుతున్నాయి. ఆయన బెయిల్ మీద ఉన్నారు. ఐతే ఒకప్పుడు అవినీతి వ్యతిరేక పోరాటంలో భాగంగా లోక్ సత్తాకు మద్దతు ఇచ్చి, ఆ పార్టీకి ప్రచారం కూడా చేసిన రాజమౌళి.. ఇప్పుడు దేశంలోనే అతి పెద్ద అవినీతి పరుల్లో ఒకడిగా పేరున్న గాలి జనార్దనరెడ్డి కుటుంబ సినిమా వేడుకకు ముఖ్య అతిథిగా హాజరై ఆయనతో సన్నిహితంగా కనిపించడాన్ని నెటిజన్లు తప్పుబడుతున్నారు. రాజమౌళి అనుకుంటే.. దీన్ని అవాయిడ్ చేయగలిగేవాడు కాదా అని ప్రశ్నిస్తున్నారు.
This post was last modified on March 5, 2022 2:56 pm
త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల విషయంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు కీలక కసరత్తు చేస్తోంది. ఆయా రాష్ట్రాల…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో దురంధర్ 2కి విపరీతమైన మద్దతు ఇస్తూ తెగ హల్చల్ చేస్తున్నారు. అటెన్షన్…
ఈ మధ్య వెబ్ సిరీస్ లకు పెద్దగా ఆదరణ ఉండటం లేదు. ఏదైనా యునానిమస్ టాక్ వస్తే తప్ప ఆడియన్స్…
న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో అతి పెద్ద బడ్జెట్ తో రూపొందుతున్న ది ప్యారడైజ్ మొదటి ఆడియో సింగల్…
తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని ఏపీ సీఎం చంద్రబాబు కొద్ది నెలల క్రితం చేసిన ప్రకటన సంచలనం రేపిన…
చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి.. ఆ తర్వాత హీరోగా మారి ఇప్పుడు యూత్లో మంచి క్రేజ్తో సాగుతున్నాడు శ్రీ విష్ణు.…