సల్మాన్ ఖాన్.. బాలీవుడ్ బాక్సాఫీస్ కింగ్. అతనో సినిమా చేస్తున్నాడంటే అంచనాలు ఓ రేంజ్లో ఉంటాయి. మార్కెట్లోనూ సందడి మామూలుగా ఉండదు. ఎప్పుడు విడుదలవుతుంది, ఎన్ని కోట్లు రాబడుతుంది, ఎన్ని రికార్డులు బద్దలు కొడుతుంది అంటూ ఒకటే చర్చలు. ‘టైగర్ 3’ విషయంలోనూ అదే జరుగుతోంది. ఈ ఫ్రాంచైజీలో వచ్చిన రెండు సినిమాలూ బ్లాక్ బస్టర్స్ కావడంతో మూడో పార్ట్ అంతకు మించి ఉంటుందని ఊహిస్తున్నారంతా.
మనీష్ శర్మ డైరెక్షన్లో ఆదిత్య చోప్రా నిర్మిస్తున్న ఈ సినిమాకి సంబంధించిన ముఖ్యమైన అనౌన్స్మెంట్ ఒకటి వచ్చింది. వచ్చే యేడు రంజాన్ సందర్భంగా ఏప్రిల్ 21న ‘టైగర్ 3’ని రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. ఈ సందర్భంగా ఓ టీజర్ని కూడా విడుదల చేశారు. విచిత్రం ఏమిటంటే.. ఈ వీడియోని చూసినవాళ్లెవరూ సల్మాన్ గురించి మాట్లాడటం లేదు.. కత్రినా గురించి తప్ప.
వీడియో ఓపెన్ కాగానే కత్రినా పులిపిల్లలా దూసుకొచ్చింది. ఓ కత్తి పట్టుకుని శత్రువు మీదికి దాడి చేసింది. చేతిని గిరగిరా తిప్పుతూ, ఒంటిని స్ప్రింగ్లా వంచుతూ ఆమె ఫైట్ చేసిన విధానం అదిరిపోయింది. ఆ తర్వాత ఆమె వెళ్లి పక్కనే ముసుగేసుకుని పడుకుని ఉన్న సల్మాన్ని లేపి ఇక నీ టర్న్ అంది. రెడీనా అడిగితే అతను ‘టైగర్ ఈజ్ ఆల్వేజ్ రెడీ’ అంటూ యుద్ధానికి సిద్ధమయ్యాడు.
అయితే ఎప్పుడూ సల్మాన్ని చూసి విజిల్స్ వేసే జనం ఈ వీడియో విషయంలో మాత్రం కత్రినా కేక అంటూ కాంప్లిమెంట్స్ కురిపిస్తున్నారు. టైగ్రస్ ఈజ్ బ్యాక్ అంటూ సోషల్ మీడియాను కామెంట్లతో నింపేస్తున్నారు. గత చిత్రాల్లోనూ యాక్షన్ సీన్స్ని అద్భుతంగా పండించింది క్యాట్. అయితే ఈసారి అంతకు మించిన ఎనర్జీతో కనిపిస్తోందామె. దాంతో అందరి కళ్లూ కత్రినా మీదే ఉన్నాయి.
This post was last modified on March 4, 2022 8:47 pm
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…