samantha
పెళ్లి తర్వాత హీరోయిన్ల కెరీర్ డల్ అయిపోవడం చాలాసార్లు చూశాం. కానీ పెళ్లి చేసుకున్న తర్వాత కూడా స్టార్ హీరోయిన్గా వెలుగుతున్నవాళ్లని ఇప్పుడు చూస్తున్నాం. నిజానికి ఇది బాలీవుడ్లోనే ఎక్కువ జరుగుతుంది. కానీ సౌత్ హీరోయిన్లు కూడా అందుకు తక్కువేం కాదని సమంత ప్రూవ్ చేసింది. పెళ్లి తర్వాత కూడా ఆమె బిజీ హీరోయిన్గానే కొనసాగింది. విడాకుల తర్వాత కూడా అదే హవాని కంటిన్యూ చేస్తోంది.
ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో చాలా ప్రాజెక్టులు సమంత కోసం క్యూలో నిలబడ్డాయి. మరోవైపు హిందీ సీమ కూడా ఆమెకి సాదరంగా ఆహ్వానం పలుకుతోంది. త్వరలో అక్కడ కూడా ఓ లేడీ ఓరియెంటెడ్ మూవీ చేయబోతోంది సామ్. అయితే సినీ లవర్స్కి వీటిలో ఏదీ ఇవ్వని కిక్.. రీసెంట్గా బైటికొచ్చిన ఓ వార్త ఇస్తోంది. విజయ్ దేవరకొండ సరసన సమంత కనిపించబోతోందనేదే ఆ న్యూస్.
ప్రస్తుతం ‘లైగర్’ మూవీతో బిజీగా ఉన్న విజయ్.. ఆ తర్వాత శివ నిర్వాణ డైరెక్షన్లో ఓ మూవీ చేయనున్న సంగతి తెలిసిందే. అయితే పూరి జగన్నాథ్తో ‘జన గణ మన’ కూడా చేయబోతున్నాడు విజయ్. నిర్మాతల్లో ఒకరైనా చార్మి ఆల్రెడీ లొకేషన్ల వేటలో ఉంది. వీటిలో ముందుగా శివ సినిమా సెట్స్కి వెళ్తుంది. ఆ తర్వాత పూరి సినిమా మొదలవుతుంది. అయితే ఈ రెండింటి మధ్యన విజయ్ మరో మూవీకి కూడా కమిటయ్యాడని, అందులోనే సమంత హీరోయిన్గా చేయబోతోందని టాక్.
నిజానికి శివ, పూరి కాకుండా విజయ్తో టై అప్ అయ్యింది దర్శకుడు సుకుమార్. ఆల్రెడీ అతను తీసిన ‘రంగస్థలం’లో సామ్ యాక్ట్ చేసింది. ఆ పాత్రని ఆమె పండించిన విధానానికి సుకుమార్ ఫ్లాటైపోయాడు కూడా. సమంతని పొగడ్తలతో ముంచెత్తిన సుకు, ఆమెతో మళ్లీ వర్క్ చేయాలనుందని కూడా అప్పట్లో అన్నాడు. అందుకే విజయ్ సినిమాలో సామ్నే ఫిక్స్ చేసి ఉండొచ్చు. విజయ్, సామ్లు కూడా ఇంతకుముందు ‘మహానటి’ కోసం జోడీ కట్టారు. అయితే అందులో వాళ్ల పాత్రలు పరిమితంగానే ఉంటాయి. ఈసారి ఫుల్ లెంగ్త్ జంటగా కనిపిస్తారు కాబట్టి ప్రేక్షకులకి కన్నుల పండగే.
This post was last modified on March 4, 2022 5:52 pm
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…