పెళ్లి తర్వాత హీరోయిన్ల కెరీర్ డల్ అయిపోవడం చాలాసార్లు చూశాం. కానీ పెళ్లి చేసుకున్న తర్వాత కూడా స్టార్ హీరోయిన్గా వెలుగుతున్నవాళ్లని ఇప్పుడు చూస్తున్నాం. నిజానికి ఇది బాలీవుడ్లోనే ఎక్కువ జరుగుతుంది. కానీ సౌత్ హీరోయిన్లు కూడా అందుకు తక్కువేం కాదని సమంత ప్రూవ్ చేసింది. పెళ్లి తర్వాత కూడా ఆమె బిజీ హీరోయిన్గానే కొనసాగింది. విడాకుల తర్వాత కూడా అదే హవాని కంటిన్యూ చేస్తోంది.
ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో చాలా ప్రాజెక్టులు సమంత కోసం క్యూలో నిలబడ్డాయి. మరోవైపు హిందీ సీమ కూడా ఆమెకి సాదరంగా ఆహ్వానం పలుకుతోంది. త్వరలో అక్కడ కూడా ఓ లేడీ ఓరియెంటెడ్ మూవీ చేయబోతోంది సామ్. అయితే సినీ లవర్స్కి వీటిలో ఏదీ ఇవ్వని కిక్.. రీసెంట్గా బైటికొచ్చిన ఓ వార్త ఇస్తోంది. విజయ్ దేవరకొండ సరసన సమంత కనిపించబోతోందనేదే ఆ న్యూస్.
ప్రస్తుతం ‘లైగర్’ మూవీతో బిజీగా ఉన్న విజయ్.. ఆ తర్వాత శివ నిర్వాణ డైరెక్షన్లో ఓ మూవీ చేయనున్న సంగతి తెలిసిందే. అయితే పూరి జగన్నాథ్తో ‘జన గణ మన’ కూడా చేయబోతున్నాడు విజయ్. నిర్మాతల్లో ఒకరైనా చార్మి ఆల్రెడీ లొకేషన్ల వేటలో ఉంది. వీటిలో ముందుగా శివ సినిమా సెట్స్కి వెళ్తుంది. ఆ తర్వాత పూరి సినిమా మొదలవుతుంది. అయితే ఈ రెండింటి మధ్యన విజయ్ మరో మూవీకి కూడా కమిటయ్యాడని, అందులోనే సమంత హీరోయిన్గా చేయబోతోందని టాక్.
నిజానికి శివ, పూరి కాకుండా విజయ్తో టై అప్ అయ్యింది దర్శకుడు సుకుమార్. ఆల్రెడీ అతను తీసిన ‘రంగస్థలం’లో సామ్ యాక్ట్ చేసింది. ఆ పాత్రని ఆమె పండించిన విధానానికి సుకుమార్ ఫ్లాటైపోయాడు కూడా. సమంతని పొగడ్తలతో ముంచెత్తిన సుకు, ఆమెతో మళ్లీ వర్క్ చేయాలనుందని కూడా అప్పట్లో అన్నాడు. అందుకే విజయ్ సినిమాలో సామ్నే ఫిక్స్ చేసి ఉండొచ్చు. విజయ్, సామ్లు కూడా ఇంతకుముందు ‘మహానటి’ కోసం జోడీ కట్టారు. అయితే అందులో వాళ్ల పాత్రలు పరిమితంగానే ఉంటాయి. ఈసారి ఫుల్ లెంగ్త్ జంటగా కనిపిస్తారు కాబట్టి ప్రేక్షకులకి కన్నుల పండగే.
This post was last modified on March 4, 2022 5:52 pm
స్టార్ హీరోలు నటించిన ప్యాన్ ఇండియా సినిమాలకు శాటిలైట్ ప్రీమియర్లు భారీ స్థాయిలో స్పందన తెచ్చుకుంటాయి. కానీ కొన్నిసార్లు మాత్రం…
గ్యారెంటీ కామెడీ ఉంటుందని అల్లరి నరేష్ సినిమాలకు పేరు. కానీ గత కొన్నేళ్లుగా ఈ జానర్ కు ఆదరణ తగ్గడం,…
లోకనాయకుడు కమల్ హాసన్, దర్శకుడు శంకర్ కలయికలో తెరకెక్కిన భారతీయుడు 2 విడుదల జూన్ 13 ఉంటుందని మీడియా మొత్తం…
ఏపీ సీఎం జగన్ చిన్నాన్న వివేకానందరెడ్డికేసులో తాజాగా సంచలనం చోటు చేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏ-8గా ఉన్న…
లోక్ సభ ఎన్నికలలో ఖచ్చితంగా ఎంపీగా గెలిచి పార్లమెంటులో అడుగుపెట్టాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీ సేఫ్ గేమ్ ఆడుతున్నాడు. 2019…
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం కష్టం. ఇప్పుడు ఇలాంటి పరిస్తితే.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్న…