Movie News

సూర్య వెనుక చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి నటుడిగానే కాక వ్యక్తిగా కూడా ఎంతోమందికి స్ఫూర్తి. మెగాస్టార్‌గా ఎదిగాక ఆయన 90వ దశకంలోనే బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ మొదలుపెట్టి లక్షల మందికి సాయపడ్డారు. చిరంజీవికి పద్మభూషణ్ పురస్కారం రావడానికి ఈ సేవ కూడా ఓ ముఖ్య కారణం. రాజకీయాల్లోకి వెళ్లడం వల్ల ఆయన ఇమేజ్ కొంత దెబ్బ తింది కానీ.. అంతకుముందు చిరు బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్‌ల విషయంలో అందుకున్న ప్రశంసలు అన్నీ ఇన్నీ కావు.

ఇది చూసి లక్షల మంది స్ఫూర్తి పొందారు. అందులో తాను కూడా ఒకడినని అంటున్నాడు తమిళ స్టార్ హీరో సూర్య. తమిళనాట సూర్య చేసే సేవా కార్యక్రమాల గురించి చెప్పడానికి చాలానే ఉంది. అగరం పేరుతో ఫౌండేషన్ పెట్టి వేల మందికి ఉచిత విద్య, వసతి అందిస్తోంది సూర్య కుటుంబం. ఈ ఫౌండేషన్ కోసం తమ సొంత ఇంటినే విరాళంగా ఇచ్చేసిన గొప్పదనం వారిది. కొన్నేళ్లుగా చాలా సిన్సియర్‌గా ఈ ఫౌండేషన్ ద్వారా గొప్ప సేవ చేస్తోంది సూర్య ఫ్యామిలీ.

ఐతే ఈ ఫౌండేషన్ మొదలుపెట్టడానికి స్ఫూర్తి మరెవరో కాదు మెగాస్టార్ చిరంజీవి అంటున్నాడు సూర్య. తన కొత్త చిత్రం ‘ఈటి’ ప్రమోషన్ల కోసం హైదరాబాద్ వచ్చిన అతను.. ప్రి రిలీజ్ ఈవెంట్లో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించాడు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ ద్వారా లక్షల మందికి సేవ చేస్తూ ఎంతోమందిని ఇన్‌స్పైర్ చేయడం చూశానని.. అది చూసే తాము కూడా సమాజానికి ఎంతో కొంత చేయాలన్న సంకల్పంతో ఫౌండేషన్ మొదలుపెట్టామని చెప్పాడు.

చిరు చేసిందాట్లో 1-2 శాతం చేయగలిగినా చాలు అని తాము అనుకున్నామని.. కానీ ఇప్పుడు ఆ సంస్థ ద్వారా ఐదువేల మందికి పూర్తి విద్యను ఉచితంగా అందించామని తెలిపాడు సూర్య. ఈ మాట చెప్పినపుడు సభా ప్రాంగణం చప్పట్లతో మార్మోగిపోయింది. సూర్య లాంటి పెద్ద హీరోకు చిరు ఇంతగా స్ఫూర్తినిచ్చాడా అంటూ చిరును ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు నెటిజన్లు.

This post was last modified on March 4, 2022 4:37 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఐపీఎస్ సునీల్.. అలా రిటైర్ కావాల్సిందేనా?

వైసీపీ హయాంలో అప్పటి సీఎం జగన్ కనుసన్నల్లో పనిచేసిన అధికారులు రూల్స్‌ను పక్కన పెట్టి ఇష్టానుసారంగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి.…

6 hours ago

అమరావతిలో కొత్త నిర్ణయం: పేదలకు నష్టం లేకుండా మార్పు

జగన్ హయాంలో తీసుకున్న పలువురు నిర్ణయాలు రాష్ట్రాన్ని వెనక్కి నెట్టాయని, ముఖ్యంగా ఆర్థికంగానే కాకుండా రాజధాని పరంగా కూడా రాష్ట్రానికి…

7 hours ago

మరి కొద్ది గంటల్లో పెళ్లి.. అక్కచెల్లెళ్లు మృతి?

రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్‌పూర్ జిల్లా మనాయ్ గ్రామంలో శనివారం జరగాల్సిన వివాహ కార్యక్రమాలకు కొద్దిగంటల ముందు ఇద్దరు అక్కచెల్లెళ్లు అనుమానాస్పద…

7 hours ago

ప‌వ‌న్‌కు షారుఖ్ రేంజిలో ఇస్తామ‌న్నా..

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌క‌ట‌న‌లు చేస్తానంటే ఆయ‌న‌కు భారీ పారితోష‌కం ఇవ్వ‌డానికి బోలెడ‌న్ని కంపెనీలు ముందుకు వ‌స్తాయి. కానీ…

7 hours ago

కోర్టు హీరోయిన్ నెమ్మదిగా నడవాలంట

గత ఏడాది నాని నిర్మించిన కోర్టుతో పరిచయమైన హీరోయిన్ శ్రీదేవి అప్పల అందులో టీనేజ్ కొచ్చిన కాలేజీ అమ్మాయిగా నటనతో…

7 hours ago

సూపర్ 8లో టీమిండియాకు సఫారీ షాక్

టీ20 వరల్డ్ కప్ గ్రూప్ స్టేజ్ లో వరుస విజయాలతో దూసుకువచ్చిన టీమిండియాకు సూపర్ 8 ఆరంభంలోనే ఊహించని ఎదురుదెబ్బ…

8 hours ago