మెగాస్టార్ చిరంజీవి నటుడిగానే కాక వ్యక్తిగా కూడా ఎంతోమందికి స్ఫూర్తి. మెగాస్టార్గా ఎదిగాక ఆయన 90వ దశకంలోనే బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ మొదలుపెట్టి లక్షల మందికి సాయపడ్డారు. చిరంజీవికి పద్మభూషణ్ పురస్కారం రావడానికి ఈ సేవ కూడా ఓ ముఖ్య కారణం. రాజకీయాల్లోకి వెళ్లడం వల్ల ఆయన ఇమేజ్ కొంత దెబ్బ తింది కానీ.. అంతకుముందు చిరు బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ల విషయంలో అందుకున్న ప్రశంసలు అన్నీ ఇన్నీ కావు.
ఇది చూసి లక్షల మంది స్ఫూర్తి పొందారు. అందులో తాను కూడా ఒకడినని అంటున్నాడు తమిళ స్టార్ హీరో సూర్య. తమిళనాట సూర్య చేసే సేవా కార్యక్రమాల గురించి చెప్పడానికి చాలానే ఉంది. అగరం పేరుతో ఫౌండేషన్ పెట్టి వేల మందికి ఉచిత విద్య, వసతి అందిస్తోంది సూర్య కుటుంబం. ఈ ఫౌండేషన్ కోసం తమ సొంత ఇంటినే విరాళంగా ఇచ్చేసిన గొప్పదనం వారిది. కొన్నేళ్లుగా చాలా సిన్సియర్గా ఈ ఫౌండేషన్ ద్వారా గొప్ప సేవ చేస్తోంది సూర్య ఫ్యామిలీ.
ఐతే ఈ ఫౌండేషన్ మొదలుపెట్టడానికి స్ఫూర్తి మరెవరో కాదు మెగాస్టార్ చిరంజీవి అంటున్నాడు సూర్య. తన కొత్త చిత్రం ‘ఈటి’ ప్రమోషన్ల కోసం హైదరాబాద్ వచ్చిన అతను.. ప్రి రిలీజ్ ఈవెంట్లో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించాడు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ ద్వారా లక్షల మందికి సేవ చేస్తూ ఎంతోమందిని ఇన్స్పైర్ చేయడం చూశానని.. అది చూసే తాము కూడా సమాజానికి ఎంతో కొంత చేయాలన్న సంకల్పంతో ఫౌండేషన్ మొదలుపెట్టామని చెప్పాడు.
చిరు చేసిందాట్లో 1-2 శాతం చేయగలిగినా చాలు అని తాము అనుకున్నామని.. కానీ ఇప్పుడు ఆ సంస్థ ద్వారా ఐదువేల మందికి పూర్తి విద్యను ఉచితంగా అందించామని తెలిపాడు సూర్య. ఈ మాట చెప్పినపుడు సభా ప్రాంగణం చప్పట్లతో మార్మోగిపోయింది. సూర్య లాంటి పెద్ద హీరోకు చిరు ఇంతగా స్ఫూర్తినిచ్చాడా అంటూ చిరును ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు నెటిజన్లు.
This post was last modified on March 4, 2022 4:37 pm
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…