మెగాస్టార్ చిరంజీవి నటుడిగానే కాక వ్యక్తిగా కూడా ఎంతోమందికి స్ఫూర్తి. మెగాస్టార్గా ఎదిగాక ఆయన 90వ దశకంలోనే బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ మొదలుపెట్టి లక్షల మందికి సాయపడ్డారు. చిరంజీవికి పద్మభూషణ్ పురస్కారం రావడానికి ఈ సేవ కూడా ఓ ముఖ్య కారణం. రాజకీయాల్లోకి వెళ్లడం వల్ల ఆయన ఇమేజ్ కొంత దెబ్బ తింది కానీ.. అంతకుముందు చిరు బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ల విషయంలో అందుకున్న ప్రశంసలు అన్నీ ఇన్నీ కావు.
ఇది చూసి లక్షల మంది స్ఫూర్తి పొందారు. అందులో తాను కూడా ఒకడినని అంటున్నాడు తమిళ స్టార్ హీరో సూర్య. తమిళనాట సూర్య చేసే సేవా కార్యక్రమాల గురించి చెప్పడానికి చాలానే ఉంది. అగరం పేరుతో ఫౌండేషన్ పెట్టి వేల మందికి ఉచిత విద్య, వసతి అందిస్తోంది సూర్య కుటుంబం. ఈ ఫౌండేషన్ కోసం తమ సొంత ఇంటినే విరాళంగా ఇచ్చేసిన గొప్పదనం వారిది. కొన్నేళ్లుగా చాలా సిన్సియర్గా ఈ ఫౌండేషన్ ద్వారా గొప్ప సేవ చేస్తోంది సూర్య ఫ్యామిలీ.
ఐతే ఈ ఫౌండేషన్ మొదలుపెట్టడానికి స్ఫూర్తి మరెవరో కాదు మెగాస్టార్ చిరంజీవి అంటున్నాడు సూర్య. తన కొత్త చిత్రం ‘ఈటి’ ప్రమోషన్ల కోసం హైదరాబాద్ వచ్చిన అతను.. ప్రి రిలీజ్ ఈవెంట్లో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించాడు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ ద్వారా లక్షల మందికి సేవ చేస్తూ ఎంతోమందిని ఇన్స్పైర్ చేయడం చూశానని.. అది చూసే తాము కూడా సమాజానికి ఎంతో కొంత చేయాలన్న సంకల్పంతో ఫౌండేషన్ మొదలుపెట్టామని చెప్పాడు.
చిరు చేసిందాట్లో 1-2 శాతం చేయగలిగినా చాలు అని తాము అనుకున్నామని.. కానీ ఇప్పుడు ఆ సంస్థ ద్వారా ఐదువేల మందికి పూర్తి విద్యను ఉచితంగా అందించామని తెలిపాడు సూర్య. ఈ మాట చెప్పినపుడు సభా ప్రాంగణం చప్పట్లతో మార్మోగిపోయింది. సూర్య లాంటి పెద్ద హీరోకు చిరు ఇంతగా స్ఫూర్తినిచ్చాడా అంటూ చిరును ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు నెటిజన్లు.
This post was last modified on March 4, 2022 4:37 pm
సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్పలేమని సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పష్టం చేశారు. ఇటీవల…
బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…
తన సొంత నియోజకవర్గం కుప్పాన్ని ప్రయోగశాలగా మార్చనున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. తాజాగా శుక్రవారం రాత్రి తన నియోజకవర్గానికి వచ్చిన…
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ విషయంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పంతం నెగ్గలేదు. తనను ఎర్రవెల్లిలోని తన ఫామ్…
రామ్ చరణ్ కొత్త సినిమా ‘పెద్ది’కి సెట్స్ మీదికి వెళ్లే సమయంలో రిలీజ్ డేట్ ఖరారు చేశారు. ఈ ఏడాది…
వీణవంకలో సమ్మక్క-సారలమ్మ జాతరలో మొక్కులు చెల్లించుకునేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన కుటుంబ సభ్యులు, మహిళా సర్పంచ్…