హిట్ కాంబినేషన్లు రిపీట్ కావడం ప్రతి ఇండస్ట్రీలోనూ జరిగేదే. ఒక హీరోతో ఒక దర్శకుడు హిట్ కొడితే.. మళ్లీ కొంత కాలానికి ఇద్దరూ కలిసి సినిమా చేస్తుంటారు. ఐతే తమిళంలో అజిత్ రూటే వేరు. అతడికి ఓ దర్శకుడిపై గురి కుదిరితే.. గ్యాప్ లేకుండా వరుసబెట్టి సినిమాలు చేసేస్తుంటాడు. మధ్యలో ఏదైనా సినిమా తేడా కొట్టినా కూడా అతడి ఆలోచన మారదు. ఇంతకుముందు విష్ణువర్ధన్ (తెలుగులో పవన్ కళ్యాణ్తో పంజా తీశాడు) అనే దర్శకుడితో తొలిసారి బిల్లా మూవీకి జట్టు కట్టాడు అజిత్.
ఆ సినిమా హిట్టవడంతో వెంటనే ఆరంభం అని మరో సినిమా చేశాడు. వీరి కలయికలో బిల్లా-2 కూడా రావాల్సింది. కానీ విష్ణు వేరే సినిమాతో బిజీగా ఉండటంతో ఆ చిత్రాన్ని మరో దర్శకుడితో చేశాడు. ఇక తెలుగులో శౌర్యం అనే సినిమాతో దర్శకుడిగా మారిన శివతో అజిత్ అనుకోకుండా కనెక్టయ్యాడు. వీరి కలయికలో మొదట వీరం అనే సినిమా వచ్చింది. అది హిట్టయింది. ఇక అంతే.. వరుసబెట్టి అతడితో సినిమాలు చేసుకుంటూ పోయాడు. వీరి కలయికలో వరుసగా వేదాళం, వివేకం, విశ్వాసం సినిమాలు వచ్చాయి.
మధ్యలో వివేకం సినిమా డిజాస్టర్ అయి.. అభిమానులు ఈ దర్శకుడితో ఇంకో సినిమా వద్దు, ఆపేయ్ అన్నా అజిత్ ఆగలేదు. మళ్లీ అతడితో విశ్వాసం సినిమా చేశాడు. అది బ్లాక్బస్టర్ అయింది. అంతటితో అజిత్, శివ బంధానికి తెరపడింది. ఆ తర్వాత హెచ్.వినోద్తో జట్టు కట్టాడు అజిత్. వీరి కలయికలో వచ్చిన తొలి సినిమా నీర్కొండపార్వై ఓ మోస్తరుగా ఆడింది.
అది పింక్ మూవీకి రీమేక్. దీని తర్వాత అజిత్.. వినోద్కు స్ట్రెయిట్ సినిమా చేసే ఛాన్సిచ్చాడు. అదే.. వలిమై. ఈ సినిమా ఇటీవలే విడుదలై మిశ్రమ స్పందన తెచ్చుకుంది. అజిత్ అభిమానులు నిరాశ చెందారు. కానీ వాళ్లు వద్దంటున్నా వినోద్తో ఇంకో సినిమాను పట్టాలెక్కించేస్తున్నాడు అజిత్. ఆల్రెడీ ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ ఈ సినిమాకు రెడీ అయిపోయాడు. ఇందుకోసం కొత్త లుక్లోకి కూడా మారాడు. ఇంకొన్ని రోజుల్లోనే ఈ సినిమా మొదలు కాబోతోంది. ఈ రోజుల్లో ఇలా ఒక దర్శకుడిపై గురి కుదిరితే గ్యాప్ లేకుండా వరుసగా సినిమాలు చేసే హీరో అజిత్ మాత్రమే అని చెప్పాలి.
ఏపీ సీఎం చంద్రబాబు.. పాలన, ఆయన తీసుకున్న నిర్ణయాలు.. వేస్తున్న అడుగులు, భవిష్యత్తు ఆంధ్ర ప్రదేశ్ నిర్మాణం.. వంటి పలు…
2024 సార్వత్రిక ఎన్నికల్లో ఏపీతో పాటు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక…
తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) పార్టీ అధ్యక్షురాలు కవిత ఏం మాట్లాడినా.. ఆలోచించే మాట్లాడతారన్న పేరుంది. పైగా మాటల విషయంలో ఆమె…
ఏపీ హోం మంత్రి వంగలపూడి అనితపై వైసీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై…
జనసేన అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రేపు వరంగల్లో పర్యటించనున్నారు. ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్న చిన్నారి నిరంజన్…
ఏపీలో సుస్థిర ప్రభుత్వం కొనసాగుతుందని.. మళ్లీ మళ్లీ ప్రభుత్వం మారే పరిస్థితి కూడా ఉండదని సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు. ఆ…