ఇషా కొప్పికర్ గుర్తుందా? 90వ దశకం చివర్లో తెలుగులో అక్కినేని నాగార్జున లాంటి స్టార్ హీరో సరసన ‘చంద్రలేఖ’ సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిందామె. ఆ తర్వాత ‘ప్రేమతో రా’, ‘కేశవ’ లాంటి చిత్రాల్లోనూ మెరిసింది ఇషా. హిందీలో ఆమె తొలి చిత్రం ‘ఏక్ థా దిల్ ఏక్ థా దడ్కన్’ మంచి విజయమే సాధించింది. ఐతే ఆమె కెరీర్ ఏ దశలోనూ అనుకున్నంతగా ఊపందుకోలేదు.
కథానాయికగా ఆమె కెరీర్ తక్కువ కాలమే సాగింది. అవకాశాలు లేక కొన్నేళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉన్న ఇషా.. ప్రస్తుతం వెబ్ సిరీస్ల్లో నటిస్తోంది. ఈ సందర్భంగా ఓ ఇంగ్లీష్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇషా షాకింగ్ కామెంట్స్ చేసింది.
తన కెరీర్ ఆరంభంలో తాను ఒక సినిమాకు సంతకం చేశానని.. కానీ ఆ చిత్ర హీరో తనను ఒంటరిగా కలవాలని చెప్పాడని.. అందుకు అంగీకరించనందుకు తనను ఆ చిత్రం నుంచి తప్పించారని ఆమె వెల్లడించింది.
తన కుటుంబంలో ఎక్కువగా డాక్టర్లే ఉన్నారని.. తాను అనుకోకుండా యాక్టర్ అయ్యానని.. కాలేజీ రోజుల్లో పాకెట్ మనీ కోసం మోడలింగ్ చేసిన తనకు అనుకోకుండా మంచి పేరొచ్చిందని, దాంతో పాటే సినిమా అవకాశాలు వచ్చాయని.. అలా కెరీర్ ఆరంభించిన తనకు ఒక నిర్మాత నుంచి కాల్ వచ్చిందని.. తాము నిర్మిస్తున్న సినిమాలో కథానాయికగా తీసుకుంటున్నట్లు చెప్పారని.. హీరోకు తాను తెగ నచ్చేశానని తెలిపారని ఇషా వెల్లడించింది.
ఐతే సదరు హీరోను ఏకాంతంగా కలవాలని ఆ నిర్మాత చెప్పారని.. అప్పటికి ఆయన మాటలు తనకు అర్థం కాలేదని.. తర్వాత హీరోకు కాల్ చేస్తే.. ‘‘ఒంటరిగా మీరొక్కరే నా దగ్గరకి రండి. మీ స్టాఫ్ను వెంట తీసుకురావద్దు’’ అని చెప్పారని.. అప్పుడు ఆయన ఉద్దేశం తనకు అర్థమైందని ఇషా చెప్పింది. వెంటనే నిర్మాతకు ఫోన్ చేసి తన టాలెంట్ ఆధారంగా ఆఫర్ వస్తేనే సినిమా చేస్తానని తేల్చి చెప్పేశానని.. తాను హీరోను కలవనందుకు ఆ ప్రాజెక్టు నుంచి తనను తీసేశారని ఆమె తెలిపింది.
This post was last modified on March 3, 2022 10:53 pm
ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నుంచి వచ్చిన ‘మన శంకర వరప్రసాద్’ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్బస్టర్ అయ్యే దిశగా దూసుకెళ్తోంది.…
మన శంకరవరప్రసాద్ గారు రిలీజయ్యాక చాలా మందికి కలిగిన సందేహం ఒకటుంది. చిరంజీవి, నయనతార లవ్ ఎపిసోడ్స్ లో బ్యాక్…
తమిళ దిగ్గజ నటుడు, తమిళగ వెట్రి కగళం(టీవీకే) అధ్యక్షుడు విజయ్ వ్యవహారం.. మరింత ముదురుతోంది. గత ఏడాది సెప్టెంబరు 27న…
రికార్డులు బద్దలు కొట్టేస్తుందని అభిమానులు గంపెడాశలు పెట్టుకున్న ది రాజా సాబ్ ఫలితం చూస్తున్నాం. ఆడియన్స్ ని పూర్తి స్థాయిలో…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత గ్రామం.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నారావారి పల్లెలో ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.…
గత కొన్నేళ్లుగా మినిమమ్ హిట్ లేకుండా అభిమానులను హర్ట్ చేస్తున్న మాస్ మహారాజా రవితేజ ఈసారి పూర్తిగా రూటు మార్చి…