ఈ ఏడాది ఇండియన్ సినిమాలో మోస్ట్ అవైటెడ్ ఫిలిమ్స్లో అగ్ర స్థానం రాజమౌళి నుంచి రానున్న‘ఆర్ఆర్ఆర్’దైతే.. రెండో స్థానం యశ్-ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కిన ‘కేజీఎఫ్: చాప్టర్-2’ అనడంలో సందేహం లేదు. రెండేళ్ల కిందట వచ్చిన ‘కేజీఎఫ్: చాప్టర్-1’ వివిధ భాషల్లో ఎంత సంచలనం రేపిందో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఆ సినిమా రిలీజైన దగ్గర్నుంచి ‘చాప్టర్-2’ కోసం ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు దాని అభిమానులు. ఐతే కరోనా, ఇతర కారణాల వల్ల ఈ సినిమా అనుకున్న దాని కంటే చాలా ఆలస్యం అయింది.
2020లోనే రావాల్సి సినిమా 2022 వేసవికి వాయిదా పడిపోయింది. వేసవి కానుకగా ఏప్రిల్ 14న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఇంకో నెలన్నర లోపే సినిమా విడుదల కానుండటంతో చిత్ర బృందం ప్రమోషన్ల హడావుడి మొదలుపెట్టేసింది. ఇందులో భాగంగా త్వరలోనే ట్రైలర్ లాంచ్ చేయబోతున్నారు. ‘కేజీఎఫ్-2’ ట్రైలర్ లాంచ్కు ముహూర్తం కూడా ఖరారైంది.
మార్చి 27న సాయంత్రం 6.40 గంటలకు ‘కేజీఎఫ్-2’ ట్రైలర్ను వివిధ భాషల్లో ఒకేసారి లాంచ్ చేయబోతున్నారు. గత ఏడాది జనవరిలో యశ్ పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ చేసిన ‘కేజీఎఫ్-2’ టీజర్ ఎంతటి ప్రకంపనలు రేపిందో తెలిసిందే. మాస్కు పూనకాలు తెప్పించే షాట్లతో వారెవా అనిపించింది టీజర్. ముఖ్యంగా మెషీన్ గన్నుతో వాహనాల్ని పేల్చేసి.. ఆ గన్ను మీద ఉన్న వేడితో యశ్ సిగరెట్ అంటించుకునే షాట్ అయితే మతులు పోగొట్టేసింది.
ఆ టీజర్ చూసినప్పటి నుంచి సినిమా కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు అభిమానులు. టీజరే అలా ఉంటే ఇప్పుడిక ట్రైలర్ ఏ రేంజిలో ఉంటుందో.. ఇందులో ఇంకేం మెరుపులుంటాయో అని ఉత్కంఠ రేగుతోంది. మాస్ పల్స్ బాగా తెలిసిన ప్రశాంత్ నీల్.. ట్రైలర్తోనూ పూనకాలు తెప్పించడం ఖాయమనే భావించవచ్చు. హోంబలె ఫిలిమ్స్ నిర్మించిన ఈ చిత్రంలో విలన్ సంజయ్ దత్ నటించడం తెలిసిందే.
This post was last modified on March 3, 2022 2:00 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…