పశ్చిమ బెంగాల్లో మమతాబెనర్జీ హవా ఏమాత్రం తగ్గలేదు. తాజాగా జరిగిన స్ధానిక సంస్ధల ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ కమలం పార్టీకి పెద్ద షాకే ఇచ్చింది. ఎన్నికలు జరిగిన 108 మున్సిపాలిటిల్లో తృణమూల్ ఏకంగా 102 మున్సిపాలిటిల్లో అఖండ విజయం సాధించింది. 108 మున్సిపాలిటీల్లో తృణమూల్ 102 మున్సిపాలిటీలను గెలుచుకోవటమంటే మామూలు విషయం కాదు.
తాజా ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోయినట్లే అనుకోవాలి. సీపీఎంకు ఒక మున్సిపాలిటిలో విజయం సిద్ధించింది. కాకపోతే ఉప ప్రాంతీయ పార్టీ ఒక మున్సిపాలిటీలో విజయం సాధించటం అందరినీ ఆశ్చర్యంలోకి నెట్టేసింది. డార్జిలింగ్ మున్సిపాలిటీలో గూర్ఖా నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ (జీఎన్ఎల్ఎఫ్) ఒక మున్సిపాలిటిలో ఘన విజయం సాధించింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే జీఎన్ఎల్ఎఫ్ అభ్యర్ధులు తృణమూల్, బీజేపీ, కాంగ్రెస్, వామపక్షాల అభ్యర్థులను ఓడించి మరీ ఘన విజయం సాధించటం.
సీపీఎం ఆధ్వర్యంలోని తహెర్ పూర్ మున్సిపాలిటిలో వామపక్షాల కూటమి గెలిచింది. మిగిలిన నాలుగు మున్సిపాలిటీల్లో హంగ్ ఏర్పడినట్లు ఎన్నికల కమీషన్ ప్రకటించింది. అందరికన్నా ఎక్కువ స్థానాలు తృణమూలే గెలుచుకున్నా అధికారాన్ని అందుకునేందుకు అవపరమైన సంఖ్యాబలం మాత్రం దక్కించుకోలేకపోయింది. ఈ నాలుగు మున్సిపాలిటీల్లో ఇండిపెండెంట్ అభ్యర్ధులు ఎవరికి మద్దతిస్తే వాళ్ళదే మున్సిపాలిటి.
అసెంబ్లీలో బీజేపీ శాసనసభాపక్ష నేత సువేందు అధికారి నియోజకవర్గం నందిగ్రామ్ మున్సిపాలిటిలో కూడా తృణమూలే గెలిచింది. ఇక్కడ బీజేపీని గెలిపించేందుకు సువేందు ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదు. ఇక్కడ గమనించాల్సిందేమంటే నాలుగు దశాబ్దాలుగా ఈ మున్సిపాలిటీపై సువేందు అధికారి కుటుంబమే జెండా ఎగరేస్తోంది. మొదటిసారి జెండా సువేందు అధికారి కుటుంబంలో నుండి చేజారిపోవటం పెద్ద దెబ్బనే చెప్పాలి.
హోలు మొత్తం మీద ఎవరికీ అర్ధం కానిదేమంటే అసలు బీజేపీ నేతలకు ఏమైందనేది. ఎందుకంటే మమతను దెబ్బకొట్టాలని బీజేపీ నేతలు శతవిధాల ప్రయత్నించారు. 108 మున్సిపాలిటిల్లో బీజేపీ ఒక్కటంటే ఒక్కచోట కూడా గెలవకపోవటమే ఆశ్చర్యంగా ఉంది. కాంగ్రెస్ అంటే పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిన పార్టీ కాబట్టి ఎక్కడా గెలవలేదంటే అర్ధముంది. మరి బీజేపీ నేతలకు ఏమైందో అర్థం కావటం లేదు. మొత్తం మీద మమతా బెనర్జీ ఫుల్లు హ్యాపీ అనే చెప్పాలి
This post was last modified on March 3, 2022 11:42 am
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…