పశ్చిమ బెంగాల్లో మమతాబెనర్జీ హవా ఏమాత్రం తగ్గలేదు. తాజాగా జరిగిన స్ధానిక సంస్ధల ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ కమలం పార్టీకి పెద్ద షాకే ఇచ్చింది. ఎన్నికలు జరిగిన 108 మున్సిపాలిటిల్లో తృణమూల్ ఏకంగా 102 మున్సిపాలిటిల్లో అఖండ విజయం సాధించింది. 108 మున్సిపాలిటీల్లో తృణమూల్ 102 మున్సిపాలిటీలను గెలుచుకోవటమంటే మామూలు విషయం కాదు.
తాజా ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోయినట్లే అనుకోవాలి. సీపీఎంకు ఒక మున్సిపాలిటిలో విజయం సిద్ధించింది. కాకపోతే ఉప ప్రాంతీయ పార్టీ ఒక మున్సిపాలిటీలో విజయం సాధించటం అందరినీ ఆశ్చర్యంలోకి నెట్టేసింది. డార్జిలింగ్ మున్సిపాలిటీలో గూర్ఖా నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ (జీఎన్ఎల్ఎఫ్) ఒక మున్సిపాలిటిలో ఘన విజయం సాధించింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే జీఎన్ఎల్ఎఫ్ అభ్యర్ధులు తృణమూల్, బీజేపీ, కాంగ్రెస్, వామపక్షాల అభ్యర్థులను ఓడించి మరీ ఘన విజయం సాధించటం.
సీపీఎం ఆధ్వర్యంలోని తహెర్ పూర్ మున్సిపాలిటిలో వామపక్షాల కూటమి గెలిచింది. మిగిలిన నాలుగు మున్సిపాలిటీల్లో హంగ్ ఏర్పడినట్లు ఎన్నికల కమీషన్ ప్రకటించింది. అందరికన్నా ఎక్కువ స్థానాలు తృణమూలే గెలుచుకున్నా అధికారాన్ని అందుకునేందుకు అవపరమైన సంఖ్యాబలం మాత్రం దక్కించుకోలేకపోయింది. ఈ నాలుగు మున్సిపాలిటీల్లో ఇండిపెండెంట్ అభ్యర్ధులు ఎవరికి మద్దతిస్తే వాళ్ళదే మున్సిపాలిటి.
అసెంబ్లీలో బీజేపీ శాసనసభాపక్ష నేత సువేందు అధికారి నియోజకవర్గం నందిగ్రామ్ మున్సిపాలిటిలో కూడా తృణమూలే గెలిచింది. ఇక్కడ బీజేపీని గెలిపించేందుకు సువేందు ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదు. ఇక్కడ గమనించాల్సిందేమంటే నాలుగు దశాబ్దాలుగా ఈ మున్సిపాలిటీపై సువేందు అధికారి కుటుంబమే జెండా ఎగరేస్తోంది. మొదటిసారి జెండా సువేందు అధికారి కుటుంబంలో నుండి చేజారిపోవటం పెద్ద దెబ్బనే చెప్పాలి.
హోలు మొత్తం మీద ఎవరికీ అర్ధం కానిదేమంటే అసలు బీజేపీ నేతలకు ఏమైందనేది. ఎందుకంటే మమతను దెబ్బకొట్టాలని బీజేపీ నేతలు శతవిధాల ప్రయత్నించారు. 108 మున్సిపాలిటిల్లో బీజేపీ ఒక్కటంటే ఒక్కచోట కూడా గెలవకపోవటమే ఆశ్చర్యంగా ఉంది. కాంగ్రెస్ అంటే పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిన పార్టీ కాబట్టి ఎక్కడా గెలవలేదంటే అర్ధముంది. మరి బీజేపీ నేతలకు ఏమైందో అర్థం కావటం లేదు. మొత్తం మీద మమతా బెనర్జీ ఫుల్లు హ్యాపీ అనే చెప్పాలి
This post was last modified on March 3, 2022 11:42 am
త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల విషయంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు కీలక కసరత్తు చేస్తోంది. ఆయా రాష్ట్రాల…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో దురంధర్ 2కి విపరీతమైన మద్దతు ఇస్తూ తెగ హల్చల్ చేస్తున్నారు. అటెన్షన్…
ఈ మధ్య వెబ్ సిరీస్ లకు పెద్దగా ఆదరణ ఉండటం లేదు. ఏదైనా యునానిమస్ టాక్ వస్తే తప్ప ఆడియన్స్…
న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో అతి పెద్ద బడ్జెట్ తో రూపొందుతున్న ది ప్యారడైజ్ మొదటి ఆడియో సింగల్…
తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని ఏపీ సీఎం చంద్రబాబు కొద్ది నెలల క్రితం చేసిన ప్రకటన సంచలనం రేపిన…
చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి.. ఆ తర్వాత హీరోగా మారి ఇప్పుడు యూత్లో మంచి క్రేజ్తో సాగుతున్నాడు శ్రీ విష్ణు.…