Movie News

హర్టయ్యా.. కానీ అందుకు కాదు

కొత్త సినిమా రిలీజ్ టైంలో టీంలోని కీలక వ్యక్తులు మీడియాలో కనిపించకపోతే రకరకాల అనుమానాలు వచ్చేస్తాయి. టీంలోని ఇతర వ్యక్తులతో అభిప్రాయ భేదాలు.. లేదంటే సినిమాలో తమకు దక్కాల్సిన ప్రాధాన్యం దక్కకపోవడం లాంటి కారణాలతో అలకలు చోటు చేసుకుంటూ ఉంటాయి. టాలీవుడ్ కొత్త రిలీజ్ ‘భీమ్లా నాయక్’ విషయంలోనూ ఇలాంటి విషయాలు చర్చకు వచ్చాయి. దర్శకుడు సాగర్ చంద్రను పక్కకు నెట్టి త్రివిక్రమ్ శ్రీనివాస్ అన్నీ తానై వ్యవహరిస్తున్నాడంటూ మీడియాలో జోరుగా ప్రచారం జరగడంతో త్రివిక్రమ్ కొంత హర్టయ్యాడని, ప్రి రిలీజ్ ఈవెంట్లో అందుకే బ్యాక్ సీట్ తీసుకున్నారని వార్తలొచ్చాయి.

దానికి తర్వాత త్రివిక్రమ్ వివరణ ఇచ్చుకుని వ్యవహారం సద్దుమణిగేలా చేశాడు. ఇక ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ భార్యగా కీలక పాత్ర పోషించిన నిత్యా మీనన్.. తన క్యారెక్టర్‌కు తాను కోరుకున్నంత ప్రాధాన్యం దక్కకపోవడంతో హర్టయి ప్రమోషన్లకు దూరంగా ఉన్నట్లుగా గుసగుసలు వినిపించాయి. దీనిపై ఎవరూ ఏమీ స్పందించలేదు. మరోవైపు రానా దగ్గుబాటికి జోడీగా నటించిన సంయుక్త మీనన్ గురించి ఇప్పుడు కొత్త ప్రచారం మొదలైంది.

ఆమె కూడా తన పాత్ర విషయంలో అన్యాయం జరిగిందని ఫీలవుతోందని, షూట్ చేసిన చాలా సన్నివేశాలను ఫైనల్ కట్ సందర్భంగా పక్కన పెట్టేశారని హర్టయిందని మీడియాలో కొంతమేర ప్రచారం జరుగుతోంది. ఐతే ఈ ప్రచారానికి సంయుక్త వెంటనే ఫుల్ స్టాప్ పెట్టేసింది. తాను హర్టయ్యానంటూ సోషల్ మీడియాలో కనిపించిన ఒక వార్త లింక్‌కు ఆమె తనదైన శైలిలో జవాబు చెప్పింది.

తాను ‘భీమ్లా నాయక్’ విషయంలో హర్టయిన మాట వాస్తవమని.. అది పాత్ర ప్రాధాన్యం దక్కినందుకు కాదని, ఈ సినిమాను రెండోసారి చూద్దామని ప్రయత్నిస్తే టికెట్లు దొరకనందుకని ఆమె పేర్కొంది. దీంతో ఈ ప్రచారానికి తెరపడిపోయింది. నిజానికి మలయాళంతో పోలిస్తే ఈ పాత్రకు తెలుగులో నిడివి, ప్రాధాన్యం పెంచారు. అదనపు సన్నివేశాలు జోడించారు. చివర్లో ఈ పాత్రతో ముడిపెట్టి ఒక కొత్త ట్విస్టు సినిమాకు మంచి ముగింపునిచ్చింది కూడా. కాబట్టి ఈ క్యారెక్టర్ విషయంలో సంయుక్త హర్టవడానికి ఆస్కారమే లేదు.

This post was last modified on March 3, 2022 9:27 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

మూడున్నర గంటల దురంధర్ మెప్పించాడా

ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…

10 minutes ago

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

50 minutes ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

3 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

6 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

9 hours ago

జగన్ ఇలానే ఉండాలంటూ టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

12 hours ago