యువ కథానాయకుడు నితిన్కు కొన్నేళ్లుగా కాలం కలిసి రావట్లేదు. ‘భీష్మ’ మినహాయిస్తే గత ఐదేళ్లలో అతడికి సరైన విజయం లేదు. ఈ చిత్రం కూడా అన్ సీజన్ అయిన ఫిబ్రవరిలో రిలీజవడం వల్ల టాక్కు తగ్గ వసూళ్లేమీ రాబట్టలేదు. దాని తర్వాత చెక్, రంగ్ దె నిరాశ పరిచాయి. ‘మ్యాస్ట్రో’ ఓటీటీలో రిలీజవడం వల్ల అది హిట్టా ఫెయిల్యూరా అని చెప్పలేం. దీని తర్వాత నితిన్ ఆచితూచి సినిమాలు చేస్తున్నాడు.
ముందు అనుకున్న వేరే చిత్రాలను పక్కన పెట్టి అతను ఎడిటర్ శేఖర్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ‘మాచర్ల నియోజకవర్గం’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. దాని చిత్రీకరణ సగంలో ఉండగా ఈ యంగ్ హీరో మరో కొత్త సినిమాను పట్టాలెక్కించడానికి రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఎప్పట్నుంచో చర్చల్లో ఉన్న వక్కంతం వంశీ సినిమాను ఎట్టకేలకు నితిన్ ఓకే చేశాడు.
సీనియర్ నిర్మాత ఠాగూర్ మధు నిర్మించనున్న ఈ సినిమాకు ‘జూనియర్’ అనే టైటిల్ ఖరారు చేసినట్లు తాజా సమాచారం. ఇది ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్టైనర్ అంటున్నారు. తన రచనలో వచ్చిన ‘కిక్’ తరహాలో ఆద్యంతం వినోదాత్మకంగా ఉండేలా స్క్రిప్టు రెడీ చేశాడట వంశీ. ‘కిక్’ అనే కాదు.. వంశీ రచయితగా పని చేసిన చాలా సినిమాలు వినోదాత్మకంగానే సాగుతాయి.
కానీ అతను దర్శకుడిగా పరిచయం అయిన ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ మాత్రం చాలా సీరియస్గా నడుస్తుంది. అది పెద్ద డిజాస్టర్ కావడంతో వంశీ దర్శకత్వ ప్రయాణానికి గట్టి దెబ్బ తగిలింది. దీంతో కొన్నేళ్లు లైమ్ లైట్లో లేకుండా పోయాడు. ఎట్టకేలకు నితిన్ అతడి కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి సినిమాను పట్టాలెక్కిస్తున్నాడు. వంశీ.. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ హీరోగా తెరకెక్కుతున్న ‘ఏజెంట్’కు రచన చేసిన సంగతి తెలిసిందే.
This post was last modified on March 2, 2022 9:34 am
ఒక పెద్ద సినిమాలో రాముడి పాత్రను పోషించడం ఏ నటుడికైనా అరుదైన అవకాశమే. దాన్ని లైఫ్ టైం ఛాన్స్లాగే ఫీలవుతారు ఎవ్వరైనా. ‘ఆదిపురుష్’ ఫలితం…
వైసీపీ అధినేత, తన బ్రదర్ జగన్పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్…
ఒక్కడు, చూడాలని ఉంది లాంటి అద్భుతమైన బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు గుణశేఖర్ కొత్త మూవీ యుఫొరియా ఫిబ్రవరిలో విడుదలైన…
ఏప్రిల్ 30 పెద్ది రావడం లేదని లోకం కోడై కూస్తోంది. నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించకపోయినా ఇతర నిర్మాతలు ఆ…
ఏప్రిల్ 30 'పెద్ది' తప్పుకున్నాక అందరి దృష్టి ఆ స్లాట్ మీద పడింది. ఇది ముందే ఊహించిన 'గాయపడ్డ సింహం'…
మలయాళ స్టార్ హీరో టొవినో థామస్.. తాను జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న డ్రాగన్ (వర్కింగ్ టైటిల్)…