ఓ యాక్టర్ టాలెంట్ని ఎలా వాడుకోవాలనేది దర్శకులు పసిగడితే చాలు.. అతని నుంచి బెస్ట్ రాబట్టుకోవచ్చు. కానీ ఆది పినిశెట్టి విషయంలో ఇలా జరగడం లేదేమో అనిపిస్తుంది అతని కెరీర్ గ్రాఫ్ చూస్తే. ఫేమస్ డైరెక్టర్కి కొడుకే అయినా నటుడిగా తన ముద్ర వేయాలని ఇండస్ట్రీకి వచ్చాడు ఆది. వైశాలి, మలుపు, గుండెల్లో గోదారి, యూటర్న్ లాంటి డిఫరెంట్ జానర్ చిత్రాలతో ఆకట్టుకున్నాడు. కానీ ఇప్పటికీ అతనిని ఇండస్ట్రీ సరిగ్గా వాడుకోవడం లేదనేది చాలామంది ఫీలింగ్. దానికి కారణం.. సరైనోడు సినిమా.
ఆదిలోని వెర్సటాలిటీని ఎవరైనా కరెక్ట్గా కనిపెట్టారు అంటే అది బోయపాటి శ్రీను అనే చెప్పాలి. ‘సరైనోడు’లో వైరం ధనుష్ పాత్రకి ఆదిని సెలెక్ట్ చేసుకోవడం ఓ గ్రేట్ మూవ్. కూల్, ఎమోషనల్, సిన్సియర్ రోల్స్ చేసిన హీరోని తీసుకొచ్చి.. పవర్ని అడ్డుపెట్టుకుని ఎంతకైనా తెగించే క్రూరమైన విలన్గా చూపించాడు బోయపాటి. పైగా క్లాస్ లుక్. చూడటానికి హీరోతో సమానంగా హ్యాండ్సమ్గా ఉంటాడు.
అదే సమయంలో హీరోకి దీటుగా పవర్ఫుల్గా కనిపిస్తాడు. ఇలాంటి పాత్రలో చూసిన తర్వాత కూడా ఆదిని విలన్గా వాడుకోవాలనే ఆలోచన మన మేకర్స్కి రాకపోవడం ఆశ్చర్యమే. త్రివిక్రమ్ ‘అజ్ఞాతవాసి’లో అలాంటి మరో పాత్రని ఇచ్చాడు కానీ దాన్ని సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయలేదు. ఇతర పాత్రలతో మిక్స్ అయిపోయి తేలిపోవడంతో ఆ సినిమాలోని ఆది పాత్ర ప్రేక్షకుల మైండ్స్లో సరిగ్గా రిజిస్టర్ కాలేదు. కానీ ఇప్పుడు మరోసారి సరైనోడు రేంజ్ విలనీని పండించే అవకాశం ఆదికి వచ్చింది.. రామ్ సినిమా రూపంలో.
రామ్ హీరోగా లింగుస్వామి డైరెక్షన్లో ‘ద వారియర్’ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇందులో విలన్గా నటిస్తున్నాడు ఆది. శివరాత్రి సందర్భంగా అతని లుక్ని రిలీజ్ చేశారు. ఈ పోస్టర్లో టెరిఫిక్గా ఉన్నాడు అది. కళ్లలోనే కసి.. నిలబడిన విధానంలోనే యారొగెన్స్.. చాలా వయొలెంట్ విలన్లా కనిపిస్తున్నాడు. రామ్ చేస్తున్న పవర్ఫుల్ పోలీసు పాత్రకి గట్టి పోటీనే ఇస్తాడనిపిస్తోంది. తనని మరోసారి మంచి నెగిటివ్ రోల్లో చూడొచ్చనే ఫీల్ కలుగుతోంది.
This post was last modified on March 2, 2022 8:57 am
సౌత్ ఇండియన్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకడైన దేవిశ్రీ ప్రసాద్ వయసు ప్రస్తుతం 46 ఏళ్లు. కానీ ఇంతలోనే అతను 27 ఏళ్ల…
ఎట్టకేలకు ప్రశాంత్ కిషోర్ ఎన్నికల్లో గెలిచాడు. జులై 30 వ తేదీన బీహార్ ఉప ఎన్నికల్లో బంకీపూర్ నుంచి ఎన్నికల…
ఒకపెద్ద సినీ కుటుంబం నుంచి పరిచయం అయ్యే కొత్త హీరో మాస్ ఇమేజ్ కోసమే తపన పడతాడు. కానీ వరుణ్ తేజ్ మాత్రం…
భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఓ సంచలన తీర్పును వెలువరించింది. మారుతున్నకాలానికి అనుగుణంగా మనిషి జీవనయానంలోనూ మార్పులు చోటుచేసుకుంటూ వస్తోంటే... ఆ…
అదేంటో స్పైడర్ మ్యాన్ జ్వరం మనోళ్లకు ఓ రేంజ్ లో పట్టేసింది. భాషతో సంబంధం లేకుండా ముంబై నుంచి మచిలీపట్నం…
వైసీపీ అధినేత జగన్ పలువురు కీలక రాజకీయ వ్యూహకర్తలతో భేటీ అయ్యారా? వచ్చే ఎన్నికలు.. దీనికి ముందు ఆయన చేయనున్న…