ఓ యాక్టర్ టాలెంట్ని ఎలా వాడుకోవాలనేది దర్శకులు పసిగడితే చాలు.. అతని నుంచి బెస్ట్ రాబట్టుకోవచ్చు. కానీ ఆది పినిశెట్టి విషయంలో ఇలా జరగడం లేదేమో అనిపిస్తుంది అతని కెరీర్ గ్రాఫ్ చూస్తే. ఫేమస్ డైరెక్టర్కి కొడుకే అయినా నటుడిగా తన ముద్ర వేయాలని ఇండస్ట్రీకి వచ్చాడు ఆది. వైశాలి, మలుపు, గుండెల్లో గోదారి, యూటర్న్ లాంటి డిఫరెంట్ జానర్ చిత్రాలతో ఆకట్టుకున్నాడు. కానీ ఇప్పటికీ అతనిని ఇండస్ట్రీ సరిగ్గా వాడుకోవడం లేదనేది చాలామంది ఫీలింగ్. దానికి కారణం.. సరైనోడు సినిమా.
ఆదిలోని వెర్సటాలిటీని ఎవరైనా కరెక్ట్గా కనిపెట్టారు అంటే అది బోయపాటి శ్రీను అనే చెప్పాలి. ‘సరైనోడు’లో వైరం ధనుష్ పాత్రకి ఆదిని సెలెక్ట్ చేసుకోవడం ఓ గ్రేట్ మూవ్. కూల్, ఎమోషనల్, సిన్సియర్ రోల్స్ చేసిన హీరోని తీసుకొచ్చి.. పవర్ని అడ్డుపెట్టుకుని ఎంతకైనా తెగించే క్రూరమైన విలన్గా చూపించాడు బోయపాటి. పైగా క్లాస్ లుక్. చూడటానికి హీరోతో సమానంగా హ్యాండ్సమ్గా ఉంటాడు.
అదే సమయంలో హీరోకి దీటుగా పవర్ఫుల్గా కనిపిస్తాడు. ఇలాంటి పాత్రలో చూసిన తర్వాత కూడా ఆదిని విలన్గా వాడుకోవాలనే ఆలోచన మన మేకర్స్కి రాకపోవడం ఆశ్చర్యమే. త్రివిక్రమ్ ‘అజ్ఞాతవాసి’లో అలాంటి మరో పాత్రని ఇచ్చాడు కానీ దాన్ని సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయలేదు. ఇతర పాత్రలతో మిక్స్ అయిపోయి తేలిపోవడంతో ఆ సినిమాలోని ఆది పాత్ర ప్రేక్షకుల మైండ్స్లో సరిగ్గా రిజిస్టర్ కాలేదు. కానీ ఇప్పుడు మరోసారి సరైనోడు రేంజ్ విలనీని పండించే అవకాశం ఆదికి వచ్చింది.. రామ్ సినిమా రూపంలో.
రామ్ హీరోగా లింగుస్వామి డైరెక్షన్లో ‘ద వారియర్’ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇందులో విలన్గా నటిస్తున్నాడు ఆది. శివరాత్రి సందర్భంగా అతని లుక్ని రిలీజ్ చేశారు. ఈ పోస్టర్లో టెరిఫిక్గా ఉన్నాడు అది. కళ్లలోనే కసి.. నిలబడిన విధానంలోనే యారొగెన్స్.. చాలా వయొలెంట్ విలన్లా కనిపిస్తున్నాడు. రామ్ చేస్తున్న పవర్ఫుల్ పోలీసు పాత్రకి గట్టి పోటీనే ఇస్తాడనిపిస్తోంది. తనని మరోసారి మంచి నెగిటివ్ రోల్లో చూడొచ్చనే ఫీల్ కలుగుతోంది.
This post was last modified on March 2, 2022 8:57 am
బాలీవుడ్ లోనే కాదు భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదయిన సినిమాగా తెరకెక్కుతున్న రామాయణ పార్ట్ 1 టీజర్ ఇవాళ…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే లక్ష్యంతో గత నెల 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా భేటీ అయి.. దీనిపై…
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…