టాలీవుడ్ హీరో రవితేజ వరుస సినిమాల్లో నటిస్తూ చాలా బిజీగా గడుపుతున్నారు. హిట్టు, ప్లాప్ తో సంబంధం లేకుండా ఆయన సినిమాలు చేస్తున్నారు. అలానే సినిమా, సినిమాకి రెమ్యునరేషన్ పెంచుకుంటూపోతున్నారు. టాలీవుడ్ లో రిజల్ట్ తో సంబంధం లేకుండా పారితోషికం పెంచుతున్న హీరో రవితేజ అనే చెప్పాలి. గత నాలుగేళ్లలో ఆయన నుంచి వచ్చిన సినిమాల్లో ‘క్రాక్’ తప్ప మరో హిట్టు లేదు. రీసెంట్ గా విడుదలైన ‘ఖిలాడి’ సినిమా కూడా ఆకట్టుకోలేకపోయింది.
భారీ బడ్జెట్ తో నిర్మించిన సినిమా ఆశించిన స్థాయిలో వసూళ్లను రాబట్టలేకపోయింది. ప్రస్తుతం రవితేజ చేతిలో మూడు, నాలుగు సినిమాలు ఉన్నాయి. ‘ఖిలాడి’ సినిమాకి ఆయన దాదాపు రూ.15 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నారని టాక్. ఇటీవల ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమాను పూర్తి చేశారు రవితేజ. ‘ఖిలాడి’ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు ఈ సినిమాను కూడా పట్టాలెక్కించాడు.
‘ఖిలాడి’ షెడ్యూల్స్ మధ్యలో ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమా షూటింగ్ లో పాల్గొన్నారు. ఈ సినిమా కోసం రవితేజ రోజువారీ రెమ్యునరేషన్ తీసుకున్నారట. ఒక్కో రోజుకి రూ.50 లక్షల చొప్పున రెమ్యునరేషన్ ఇస్తామని రవితేజతో డీల్ మాట్లాడుకున్నారట. సినిమాను ఇరవై, పాతిక రోజుల్లో పూర్తి చేయాలని ప్లాన్ వేసుకొని రెమ్యునరేషన్ రోజువారీ చొప్పున మాట్లాడుకున్నారు.
కానీ తీరా సినిమా సెట్స్ పైకి వెళ్లాక షూటింగ్ రోజులు పెరిగిపోయాయి. ఇప్పటివరకు 33 రోజుల పాటు షూటింగ్ జరిగిందట. మరో రెండు, మూడు రోజుల ప్యాచ్ వర్క్ బాకీ ఉందట. ఎలా లేదన్నా ఈ సినిమాతో రవితేజకి రూ.17 నుంచి రూ.18 కోట్ల రెమ్యునరేషన్ అందుతుందని చెబుతున్నారు. పాపం రెమ్యునరేషన్ తగ్గించుకుందామని నిర్మాతలు ప్లాన్ చేస్తే.. ఇప్పుడు అంతా రివర్స్ అయింది.
This post was last modified on March 1, 2022 9:27 am
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…