టాలీవుడ్ హీరో రవితేజ వరుస సినిమాల్లో నటిస్తూ చాలా బిజీగా గడుపుతున్నారు. హిట్టు, ప్లాప్ తో సంబంధం లేకుండా ఆయన సినిమాలు చేస్తున్నారు. అలానే సినిమా, సినిమాకి రెమ్యునరేషన్ పెంచుకుంటూపోతున్నారు. టాలీవుడ్ లో రిజల్ట్ తో సంబంధం లేకుండా పారితోషికం పెంచుతున్న హీరో రవితేజ అనే చెప్పాలి. గత నాలుగేళ్లలో ఆయన నుంచి వచ్చిన సినిమాల్లో ‘క్రాక్’ తప్ప మరో హిట్టు లేదు. రీసెంట్ గా విడుదలైన ‘ఖిలాడి’ సినిమా కూడా ఆకట్టుకోలేకపోయింది.
భారీ బడ్జెట్ తో నిర్మించిన సినిమా ఆశించిన స్థాయిలో వసూళ్లను రాబట్టలేకపోయింది. ప్రస్తుతం రవితేజ చేతిలో మూడు, నాలుగు సినిమాలు ఉన్నాయి. ‘ఖిలాడి’ సినిమాకి ఆయన దాదాపు రూ.15 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నారని టాక్. ఇటీవల ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమాను పూర్తి చేశారు రవితేజ. ‘ఖిలాడి’ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు ఈ సినిమాను కూడా పట్టాలెక్కించాడు.
‘ఖిలాడి’ షెడ్యూల్స్ మధ్యలో ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమా షూటింగ్ లో పాల్గొన్నారు. ఈ సినిమా కోసం రవితేజ రోజువారీ రెమ్యునరేషన్ తీసుకున్నారట. ఒక్కో రోజుకి రూ.50 లక్షల చొప్పున రెమ్యునరేషన్ ఇస్తామని రవితేజతో డీల్ మాట్లాడుకున్నారట. సినిమాను ఇరవై, పాతిక రోజుల్లో పూర్తి చేయాలని ప్లాన్ వేసుకొని రెమ్యునరేషన్ రోజువారీ చొప్పున మాట్లాడుకున్నారు.
కానీ తీరా సినిమా సెట్స్ పైకి వెళ్లాక షూటింగ్ రోజులు పెరిగిపోయాయి. ఇప్పటివరకు 33 రోజుల పాటు షూటింగ్ జరిగిందట. మరో రెండు, మూడు రోజుల ప్యాచ్ వర్క్ బాకీ ఉందట. ఎలా లేదన్నా ఈ సినిమాతో రవితేజకి రూ.17 నుంచి రూ.18 కోట్ల రెమ్యునరేషన్ అందుతుందని చెబుతున్నారు. పాపం రెమ్యునరేషన్ తగ్గించుకుందామని నిర్మాతలు ప్లాన్ చేస్తే.. ఇప్పుడు అంతా రివర్స్ అయింది.
This post was last modified on March 1, 2022 9:27 am
సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్పలేమని సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పష్టం చేశారు. ఇటీవల…
బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…
తన సొంత నియోజకవర్గం కుప్పాన్ని ప్రయోగశాలగా మార్చనున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. తాజాగా శుక్రవారం రాత్రి తన నియోజకవర్గానికి వచ్చిన…
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ విషయంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పంతం నెగ్గలేదు. తనను ఎర్రవెల్లిలోని తన ఫామ్…
రామ్ చరణ్ కొత్త సినిమా ‘పెద్ది’కి సెట్స్ మీదికి వెళ్లే సమయంలో రిలీజ్ డేట్ ఖరారు చేశారు. ఈ ఏడాది…
వీణవంకలో సమ్మక్క-సారలమ్మ జాతరలో మొక్కులు చెల్లించుకునేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన కుటుంబ సభ్యులు, మహిళా సర్పంచ్…