టాలీవుడ్ హీరో రవితేజ వరుస సినిమాల్లో నటిస్తూ చాలా బిజీగా గడుపుతున్నారు. హిట్టు, ప్లాప్ తో సంబంధం లేకుండా ఆయన సినిమాలు చేస్తున్నారు. అలానే సినిమా, సినిమాకి రెమ్యునరేషన్ పెంచుకుంటూపోతున్నారు. టాలీవుడ్ లో రిజల్ట్ తో సంబంధం లేకుండా పారితోషికం పెంచుతున్న హీరో రవితేజ అనే చెప్పాలి. గత నాలుగేళ్లలో ఆయన నుంచి వచ్చిన సినిమాల్లో ‘క్రాక్’ తప్ప మరో హిట్టు లేదు. రీసెంట్ గా విడుదలైన ‘ఖిలాడి’ సినిమా కూడా ఆకట్టుకోలేకపోయింది.
భారీ బడ్జెట్ తో నిర్మించిన సినిమా ఆశించిన స్థాయిలో వసూళ్లను రాబట్టలేకపోయింది. ప్రస్తుతం రవితేజ చేతిలో మూడు, నాలుగు సినిమాలు ఉన్నాయి. ‘ఖిలాడి’ సినిమాకి ఆయన దాదాపు రూ.15 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నారని టాక్. ఇటీవల ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమాను పూర్తి చేశారు రవితేజ. ‘ఖిలాడి’ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు ఈ సినిమాను కూడా పట్టాలెక్కించాడు.
‘ఖిలాడి’ షెడ్యూల్స్ మధ్యలో ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమా షూటింగ్ లో పాల్గొన్నారు. ఈ సినిమా కోసం రవితేజ రోజువారీ రెమ్యునరేషన్ తీసుకున్నారట. ఒక్కో రోజుకి రూ.50 లక్షల చొప్పున రెమ్యునరేషన్ ఇస్తామని రవితేజతో డీల్ మాట్లాడుకున్నారట. సినిమాను ఇరవై, పాతిక రోజుల్లో పూర్తి చేయాలని ప్లాన్ వేసుకొని రెమ్యునరేషన్ రోజువారీ చొప్పున మాట్లాడుకున్నారు.
కానీ తీరా సినిమా సెట్స్ పైకి వెళ్లాక షూటింగ్ రోజులు పెరిగిపోయాయి. ఇప్పటివరకు 33 రోజుల పాటు షూటింగ్ జరిగిందట. మరో రెండు, మూడు రోజుల ప్యాచ్ వర్క్ బాకీ ఉందట. ఎలా లేదన్నా ఈ సినిమాతో రవితేజకి రూ.17 నుంచి రూ.18 కోట్ల రెమ్యునరేషన్ అందుతుందని చెబుతున్నారు. పాపం రెమ్యునరేషన్ తగ్గించుకుందామని నిర్మాతలు ప్లాన్ చేస్తే.. ఇప్పుడు అంతా రివర్స్ అయింది.
ఈ మధ్య తమన్ సౌండ్ కొంచెం తగ్గిపోయింది. తన నుంచి సాలిడ్ బ్లాక్ బస్టర్ పడక అభిమానులు ఎదురు చూస్తున్నారు.…
తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కారు ఏర్పడి అప్పుడే రెండున్నరేళ్లు అవుతోంది. ఇంకో రెండున్నరేళ్లలో ఎన్నికలు రానున్నాయి. ఆ ఎన్నికల్లో ఎలాగైనా…
సీనియర్ స్టార్ హీరోలు మరోసారి బాక్సాఫీస్ క్లాష్ కు రెడీ అయ్యేలా ఉన్నారు. వెంకటేష్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో…
తన కెరీర్లో ఇంకే చిత్రానికీ పడనంత కష్టాన్ని ‘పెద్ది’ సినిమా కోసం పడ్డాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.…
జాతీయ రాజకీయాలకు సంబంధించి సోమవారం దేశ రాజధాని ఢిల్లీలో ఓ కీలక సమావేశం జరుగుతోంది. విపక్ష ఇండియా కూటమి ఏర్పాటు…
వైసీపీ హయాంలో చెలరేగిపోయిన భూ మాఫియా కోరలు పీకామని.. ఇప్పుడు ప్రజలు ప్రశాంతంగా ఉన్నారని సీఎం చంద్రబాబు తెలిపారు. ఉమ్మడి…