ఒకప్పుడు హిందీ చిత్రాల మార్కెట్ ముందు తెలుగు చిత్రాలు చాలా చిన్నవిగా కనిపించేవి. ఎందుకంటే హిందీ సినిమాలకు దేశవ్యాప్త మార్కెట్ ఉంటే.. తెలుగు చిత్రాల పరిధి ఒక రాష్ట్రం వరకే ఉండేది. అందుకే హిందీ చిత్రాల వసూళ్ల ముందు మన సినిమాల కలెక్షన్లు చాలా తక్కువగా కనిపించేవి. కానీ గత కొన్నేళ్లలో మన సినిమాల మార్కెట్ పరిధి బాగా విస్తరించింది.
తెలుగు రాష్ట్రాల్లో వసూళ్లు పెరగడమే కాక.. వేరే రాష్ట్రాలు, దేశాల్లో కూడా మన చిత్రాల హవా మామూలుగా ఉండట్లేదు. పాన్ ఇండియా స్థాయిలో మన చిత్రాలకు భారీ వసూళ్లు వస్తుండటంతో ఇప్పుడు టాలీవుడ్ ముందు బాలీవుడ్ నిలవలేకపోతోంది. ఈ వీకెండ్లో ‘గంగూబాయి కతియవాడీ’ అనే పెద్ద హిందీ సినిమా రిలీజైంది. ఆలియా భట్, సంజయ్ లీలా బన్సాలీల క్రేజీ కాంబినేషన్లో, మంచి అంచనాల మధ్య వచ్చిన చిత్రమిది.
‘గంగూబాయి’కి మంచి టాక్ కూడా వచ్చింది. అయినా సరే.. వసూళ్ల విషయంలో ప్రాంతీయ చిత్రమైన ‘భీమ్లా నాయక్’ ముందు ఆ సినిమా ఏమాత్రం నిలవలేకపోయింది. ఒక్క నైజాం ఏరియాలో ‘భీమ్లా నాయక్’ తొలి రోజు 11.8 కోట్ల షేర్ సాధించడం విశేషం. ఐతే ‘గంగూబాయి’ ఇండియా మొత్తంలో సాధించిన నెట్ వసూళ్లు 10.5 కోట్లు మాత్రమే కావడం విశేషం. ‘భీమ్లా నాయక్’ ఓవరాల్ షేర్ రూ.22 కోట్లకు అటుగా ఉంది.
ఏపీలో టికెట్ల రేట్లు మరీ తక్కువ ఉండటం వల్ల ‘భీమ్లా నాయక్’ డే-1 వరల్డ్ వైడ్ షేర్ తగ్గింది కానీ.. లేదంటే 30 కోట్ల మార్కుకు చేరువగా ఉండేది. అప్పుడు ఈ సినిమా ముందు ‘గంగూబాయి’ మరింత వెలవెలబోయేది. అయినా కూడా ఒక్క తెలంగాణలో ‘భీమ్లా నాయక్’ సాధించిన వసూళ్ల కంటే ‘గంగూబాయి’ ఇండియా మొత్తంలో రాబట్టిన కలెక్షన్లు తక్కువగా ఉండటం మన సినిమా హవాకు నిదర్శనం. గత కొన్నేళ్లలో తెలుగు సినిమాల ముందు హిందీ చిత్రాలు చాలానే వెలవెలబోయాయి. ముఖ్యంగా కొవిడ్ మొదలైనప్పటి నుంచి హిందీ చిత్రాల వసూళ్లు మరింతగా పడిపోయాయి.
This post was last modified on February 27, 2022 6:14 pm
గత ఏడాది డిసెంబర్ దురంధర్ విడుదలతో మొదలుపెట్టి మార్చిలో రిలీజైన దురంధర్ ది రివెంజ్ దాకా పాకిస్థాన్ జనాలు, మీడియా…
జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది కోసం ఎదురు చూపులు మాములుగా లేవు. రెండు నెలలుగా డ్రైగా ఉన్న బాక్సాఫీస్…
గత పది రోజులుగా తమిళనాడు రాజకీయాలు దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశం అవుతున్నాయో తెలిసిందే. ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా టీవీకే…
ఇవాళ జరిగిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ల సమావేశంలో నిర్మాత నాగవంశీ ఒక మాటన్నారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుండా పెద్దిని…
నైజామ్ సింగల్ స్క్రీన్ పర్సెంటేజ్ వివాదం ముదిరిపోతోంది. నిన్న శిరీష్, సునీల్ నారంగ్ తదితరులు నిర్వహించిన ఎగ్జిబిటర్ల ప్రెస్ మీట్…
కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు.. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీలకు కేరళలో తీవ్రనిరసన సెగ తగులుతోంది. రాహుల్-ప్రియాంక.. కేరళ మిమ్మల్ని క్షమించదు.…