ఒకప్పుడు హిందీ చిత్రాల మార్కెట్ ముందు తెలుగు చిత్రాలు చాలా చిన్నవిగా కనిపించేవి. ఎందుకంటే హిందీ సినిమాలకు దేశవ్యాప్త మార్కెట్ ఉంటే.. తెలుగు చిత్రాల పరిధి ఒక రాష్ట్రం వరకే ఉండేది. అందుకే హిందీ చిత్రాల వసూళ్ల ముందు మన సినిమాల కలెక్షన్లు చాలా తక్కువగా కనిపించేవి. కానీ గత కొన్నేళ్లలో మన సినిమాల మార్కెట్ పరిధి బాగా విస్తరించింది.
తెలుగు రాష్ట్రాల్లో వసూళ్లు పెరగడమే కాక.. వేరే రాష్ట్రాలు, దేశాల్లో కూడా మన చిత్రాల హవా మామూలుగా ఉండట్లేదు. పాన్ ఇండియా స్థాయిలో మన చిత్రాలకు భారీ వసూళ్లు వస్తుండటంతో ఇప్పుడు టాలీవుడ్ ముందు బాలీవుడ్ నిలవలేకపోతోంది. ఈ వీకెండ్లో ‘గంగూబాయి కతియవాడీ’ అనే పెద్ద హిందీ సినిమా రిలీజైంది. ఆలియా భట్, సంజయ్ లీలా బన్సాలీల క్రేజీ కాంబినేషన్లో, మంచి అంచనాల మధ్య వచ్చిన చిత్రమిది.
‘గంగూబాయి’కి మంచి టాక్ కూడా వచ్చింది. అయినా సరే.. వసూళ్ల విషయంలో ప్రాంతీయ చిత్రమైన ‘భీమ్లా నాయక్’ ముందు ఆ సినిమా ఏమాత్రం నిలవలేకపోయింది. ఒక్క నైజాం ఏరియాలో ‘భీమ్లా నాయక్’ తొలి రోజు 11.8 కోట్ల షేర్ సాధించడం విశేషం. ఐతే ‘గంగూబాయి’ ఇండియా మొత్తంలో సాధించిన నెట్ వసూళ్లు 10.5 కోట్లు మాత్రమే కావడం విశేషం. ‘భీమ్లా నాయక్’ ఓవరాల్ షేర్ రూ.22 కోట్లకు అటుగా ఉంది.
ఏపీలో టికెట్ల రేట్లు మరీ తక్కువ ఉండటం వల్ల ‘భీమ్లా నాయక్’ డే-1 వరల్డ్ వైడ్ షేర్ తగ్గింది కానీ.. లేదంటే 30 కోట్ల మార్కుకు చేరువగా ఉండేది. అప్పుడు ఈ సినిమా ముందు ‘గంగూబాయి’ మరింత వెలవెలబోయేది. అయినా కూడా ఒక్క తెలంగాణలో ‘భీమ్లా నాయక్’ సాధించిన వసూళ్ల కంటే ‘గంగూబాయి’ ఇండియా మొత్తంలో రాబట్టిన కలెక్షన్లు తక్కువగా ఉండటం మన సినిమా హవాకు నిదర్శనం. గత కొన్నేళ్లలో తెలుగు సినిమాల ముందు హిందీ చిత్రాలు చాలానే వెలవెలబోయాయి. ముఖ్యంగా కొవిడ్ మొదలైనప్పటి నుంచి హిందీ చిత్రాల వసూళ్లు మరింతగా పడిపోయాయి.
కొందరు స్టార్ హీరోయిన్లు కెరీర్ మంచి ఊపులో కొనసాగుతున్న టైంలోనే వ్యక్తిగత జీవితంలో సెటిల్ అవ్వాలని చూస్తుంటారు. ఈ క్రమంలో…
మొన్నామధ్య విడుదలైన యాక్షన్ కింగ్ అర్జున్ డబ్బింగ్ సినిమా 'బ్లాస్ట్ జోన్' తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఆడింది. ప్రమోషన్లు పెద్దగా…
పవన్ కళ్యాణ్ స్వయంగా ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్తో పాటు కనిపిస్తున్నది…
సోషల్ మీడియాలో ఇప్పుడో టాపిక్ హాట్ డిస్కషన్ గా మారింది. హైదరాబాద్ కు చెందిన ఒక ప్రేక్షకుడు బుక్ మై…
ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రెడ్డి ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్నారు.…