ఈ గురువారం తమిళంలో భారీ అంచనాల మధ్య విడుదలైంది అక్కడి టాప్ స్టార్ అజిత్ సినిమా ‘వలిమై’. తెలుులో కూడా ఈ చిత్రాన్ని తొలి రోజు వరకు భారీగానే రిలీజ్ చేశారు. ఐతే తెలుగులో ఈ చిత్రానికి నెగెటివ్ టాక్ వచ్చింది. పైగా శుక్రవారం ‘భీమ్లా నాయక్’ రిలీజవడంతో దీన్ని పట్టించుకునే వారు లేకపోయారు.
కానీ తమిళనాట మాత్రం ‘వలిమై’ భారీ వసూళ్లతో దూసుకెళ్తోంది. అక్కడి ప్రేక్షకుల నుంచి సినిమా పట్ల సానుకూల స్పందనే వస్తోంది. రివ్యూలన్నీ కూడా పాజిటివ్గానే ఉన్నాయి. ఈ చిత్రంలో ప్రధానంగా యాక్షన్ ఘట్టాల గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు.
అలాగే విలన్ పాత్ర, నేపథ్యం కొత్తగా ఉందని అంటున్నారు. అంతకుమించి సినిమాలో పెద్దగా విషయం ఏమీ లేదు. ఐతే దర్శకుడు హెచ్.వినోద్ ఈ సినిమా కాన్సెప్ట్ను జాకీ చాన్ నటించిన హాంకాంగ్ మూవీ నుంచి ఎత్తుకొచ్చేశాడనే ఆరోపణలు వస్తున్నాయిప్పుడు.
ది న్యూ పోలీస్ స్టోరీ.. 2004లో విడుదలైన జాకీ చాన్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఇది. ఈ చిత్రాన్ని స్వయంగా జాకీ చానే ప్రొడ్యూస్ చేశాడు. ఈ సినిమా ట్రైలర్ యూట్యూబ్లో అందుబాటులో ఉంది. అది చూస్తే ‘వలిమై’కి అది స్ఫూర్తిగా నిలిచిందనే విషయం ఈజీగా అర్థమైపోతుంది. ముఖాలకు మాస్కులు వేసుకుని.. బైకుల మీద తిరుగుతూ దారుణాలకు పాల్పడే విలన్ బ్యాచ్ను ఇందులో చూడొచ్చు. అందులోనూ హీరో పోలీసే.
తన టీంతో కలిసి ఈ బైక్ బ్యాచ్ మీద ఎటాక్ చేయడానికి ప్రయత్నించడం కనిపిస్తుంది. ఆ సన్నివేశాలు ‘వలిమై’కు దగ్గరగా ఉన్నాయి. ఇక వలిమై పతాక సన్నివేశాల్లో హీరో కుటుంబ సభ్యులందరినీ తాళ్లతో పైన వేలాడదీసే సన్నివేశముంటుంది. అది జాకీ చాన్ సినిమా ట్రైలర్లోనూ ఉంది. రేసింగ్ బైకులతో విన్యాసాలు చేసే సన్నివేశాలు కూడా దగ్గరగా ఉన్నాయి. మొత్తానికి ఈ ట్రైలర్ చూస్తే వినోద్.. ‘న్యూ పోలీస్ స్టోరీ’ సినిమా చూసి బాగానే ఇన్స్పైర్ అయి ‘వలిమై’ తీశాడని అర్థమైపోతుంది.
This post was last modified on February 26, 2022 3:25 pm
ఏపీలో డబుల్ ఇంజన్ సర్కారు రానుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమే కేంద్రంలోనూ…
ఆంధ్రప్రదేశ్లో కొన్ని వారాల నుంచి ఎన్నికల కమిషన్ కొరఢా ఝళిపిస్తూ ఉంది. ఎన్నికల సమయంలో తమ పరిధి దాటి వ్యవహరిస్తున్న…
కుర్ర హీరోల్లో వేగంగా మార్కెట్ పడిపోయిన వాళ్ళలో రాజ్ తరుణ్ పేరు మొదటగా చెప్పుకోవాలి. కెరీర్ ప్రారంభంలో కుమారి 21…
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. గత ఏడాది ఏపీలో జగన్ సర్కారు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి చట్టం. ఇప్పుడీ చట్టం ఎన్నికల ముంగిట…
ఆంధ్రప్రదేశ్లో ఇంకో వారం రోజుల్లో ఎన్నికలు జరగబోతుండగా.. మంత్రి అంబటి రాంబాబుపై ఆయన అల్లుడు డాక్టర్ గౌతమ్ రిలీజ్ చేసిన…
ఎడిటర్ మోహన్ నిర్మాణ సంస్థ ఎంఎస్ ఆర్ట్స్ లో అసిస్టెంట్ డైరెక్టర్ గా సుకుమార్ పని చేస్తున్న రోజులవి. ముప్పై…