టికెట్ల రేట్లు సహా ఇండస్ట్రీ సమస్యల గురించి మాట్లాడటానికి ఇటీవల చిరంజీవి నేతృత్వంలో సినీ ప్రతినిధుల బృందం అమరావతికి వెళ్లి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలవడం తెలిసిన సంగతి తెలిసిందే. తర్వాత ఓ సందర్భంలో ఈ మీటింగ్ గురించి ప్రస్తావిస్తూ.. మిమ్మల్ని ఆహ్వానించారా అని నందమూరి బాలకృష్ణను అడిగితే.. తనను పిలిచారని, కానీ వెళ్లలేదని చెప్పారు.
తాను ఏపీ సీఎంను కలవనని తెగేసి చెప్పారు కూడా. అఖండ సినిమా తక్కువ బడ్జెట్లో తెరకెక్కిందని, కాబట్టి ఏపీలో టికెట్ల రేట్లు తన సినిమాకు సరిపోయాయని.. రేట్ల పెంపు అవసరం కూడా లేదన్నట్లుగా ఆయన మాట్లాడారు. ఇది చూసి బాలయ్య రూటే వేరని.. ఆయన ఎవరి ముందూ తలవంచరని సోషల్ మీడియాలో ఎలివేషన్లు ఇచ్చారు ఆయన అభిమానులు, టీడీపీ సపోర్టర్స్.
కానీ ఇప్పుడు ఏపీ మంత్రి పేర్ని నాని చెప్పిన మాటలు విని విస్తుపోతున్నారు అందరూ. ‘అఖండ’ విడుదలకు ముందు బాలయ్య ఏపీ సీఎం అపాయింట్మెంట్ అడిగినట్లు నాని వెల్లడించడం గమనార్హం. నూజివీడు ఎమ్మెల్యే ద్వారా అఖండ నిర్మాతలు తనను కలిసే ప్రయత్నం చేశారని.. వాళ్లకు అపాయింట్మెంట్ ఇవ్వగా.. బాలయ్యతో ఫోన్లో మాట్లాడించారని నాని తెలిపారు.
ఆ సందర్భంగా బాలయ్య సీఎం అపాయింట్మెంట్ కోరారని.. తర్వాత జగన్కు తాను ఈ విషయం చెప్పానని నాని అన్నారు. అపాయింట్మెంట్ ఎందుకని సీఎం అడిగితే.. అఖండ సినిమా టికెట్ల రేట్ల గురించి అయ్యుండొచ్చని తాను చెప్పగా.. బాలయ్య వచ్చి తనను కలిస్తే ఆయన ఇమేజ్ దెబ్బ తింటుందని, ఆయనకు ఏం కావాలో అడిగి చేసేయాలని తనకు సీఎం సూచించారని వెల్లడించారు నాని. ఇది నిజం కాదేమో బాలయ్యను, అఖండ నిర్మాతలను అడగాలని.. తాము అఖండ సినిమాను ఏ రకంగా అయినా ఇబ్బంది పెట్టామో చెప్పమనండని విలేకరులు వ్యాఖ్యానించారు నాని.
This post was last modified on February 26, 2022 3:24 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…