ఆర్ఎక్స్ 100 సినిమాతో రాత్రికి రాత్రి స్టార్ అయిపోయాడు కార్తికేయ. ఆ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాతో అత్యధిక ప్రయోజనం పొంది, ఎక్కువ అవకాశాలు అందుకున్నది అతనే. ఆ సినిమా 2018లో రిలీజైతే.. మూడేళ్లు తిరక్కుండానే అరడజను సినిమాలు లాగించేశాడతను. కానీ ఏదీ కూడా అతడికి ఆశించిన ఫలితాన్నివ్వలేదు. అతను బాగానే కష్టపడుతున్నా.. తన పెర్ఫామెన్స్కు మంచి మార్కులే పడుతున్నా సినిమాలు మాత్రం విజయవంతం కావడం లేదు.
విలన్ పాత్రలో మెరిసిన గ్యాంగ్ లీడర్ సైతం నిరాశకే గురి చేసింది. ఐతే ఇప్పుడు తమిళంలో చాలా పెద్ద స్టార్ అయిన అజిత్ నటించిన వలిమై చిత్రంలో అతను ప్రధాన విలన్ పాత్ర పోషించాడు. దీనిపై అతను చాలా ఆశలే పెట్టుకున్నాడు. ఈ సినిమా గురించి, తన పాత్ర గురించి ముందు నుంచి గొప్పగా చెబుతూ వచ్చాడు కార్తికేయ.
కానీ చివరికి సినిమా చూసిన తెలుగు ప్రేక్షకులంతా నిట్టూరుస్తున్నారు. ఈ సినిమా గురించా కార్తికేయ ఇంత ఎగ్జైట్ అయ్యాడు అంటున్నారు. మన తెలుగులో ఇలాంటి సినిమాలు, అలాంటి పాత్రలు చాలానే చూశాం. మన వాళ్లకు ఏమంత ఎగ్జైట్మెంట్ ఇవ్వట్లేదీ సినిమా. ఐతే ఈ చిత్రంలో కార్తికేయ తన వంతుగా బాగా కష్టపడ్డాడన్నది మాత్రం వాస్తవం. అతడికి మామూలుగానే తన బాడీ పెద్ద ప్లస్. ఈ చిత్రం కోసం మరింతగా ఫిజిక్ పెంచాడు.
ప్రతి సన్నివేశంలోనూ తన ఫిజిక్తో, స్క్రీన్ ప్రెజెన్స్తో ఆకట్టుకున్నాడు. పాత్ర వీక్ అయినప్పటికీ.. దాన్ని నిలబెట్టడానికి కార్తికేయ బాగానే కష్టపడ్డాడు. తమిళ ప్రేక్షకులు ఒప్పుకోరు కానీ.. చాలా చోట్ల కార్తికేయ ముందు అజిత్ తేలిపోయాడు. ఫిజిక్, స్క్రీన్ ప్రెజెన్స్ పరంగా కార్తికేయదే డామినేషన్. కానీ ఇంత కష్టపడ్డప్పటికీ.. అతడి పాత్ర అనుకున్నంత ఇంపాక్ట్ మాత్రం వేయలేకపోయింది. ఇందులో తప్పంతా దర్శకుడితే అనడంలో సందేహం లేదు.
This post was last modified on February 25, 2022 7:13 am
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…