ఒక హీరో సినిమాలో మరో హీరో విలన్గా నటిస్తే వచ్చే కిక్కే వేరు. అందులోనూ వాళ్లిద్దరూ స్టార్స్ అయితే ఇక అంచనాలు ఓ రేంజ్లో ఉంటాయి. ‘బాహుబలి’లో ప్రభాస్కి ప్రత్యర్థిగా రానాని చూసి విజిల్స్ వేయని వాళ్లెవరైనా ఉంటారా! ఇప్పుడు అలాంటి మ్యాజిక్ ఒకటి మళ్లీ జరగబోతోంది అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. అది కూడా మహేష్ బాబు సినిమా విషయంలో.
త్వరలో ‘సర్కారు వారి పాట’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు మహేష్. ఆ తర్వాత త్రివిక్రమ్తో, దాని తర్వాత రాజమౌళితో సినిమాలు చేయాల్సి ఉంది. త్రివిక్రమ్తో సినిమా వచ్చే నెల మొదటి వారంలో సెట్స్కి వెళ్లబోతోంది. పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రాన్ని హారిక హాసిని క్రియేషన్స్ నిర్మిస్తోంది. శోభన ఓ కీలక పాత్రలో నటించనున్నట్టు తెలుస్తోంది.
ఇక పోతే ఈ మూవీ విలన్ విషయంలో ఓ ఇంటరెస్టింగ్ బజ్ నడుస్తోంది. ఇందులో మహేష్తో తలపడే విలన్ చాలా స్పెషల్గా ఉంటాడట. హీరోకి దీటుగా కనిపిస్తాడట. హోరాహోరీగా పోరాడాల్సి కూడా ఉంటుందట. మరోవైపు ఇంటెలిజెంట్ ప్లేని కూడా పర్ఫార్మ్ చేయాలట. అందుకే అతను కూడా ఓ హీరోనే అయ్యుండాలని, అందులోనూ ఓ వెర్సటైల్ యాక్టర్ అయ్యుండాలని త్రివిక్రమ్ ఫిక్సయ్యాడట. ఆల్రెడీ తమిళ స్టార్ విక్రమ్ని అప్రోచ్ అయ్యాడని, ఆయన కూడా ఓకే అన్నాడని వార్తలు వస్తున్నాయి.
నిజానికి ఈ న్యూస్ కొద్ది నెలల క్రితం కూడా వినిపించింది. అయితే అప్పుడు రాజమౌళి సినిమా కోసం విక్రమ్ని సంప్రదించారంటూ గుసగుసలు వినిపించాయి. అది ఫారెస్ట్ బ్యాక్డ్రాప్లో నడిచే అడ్వెంచరస్ మూవీ కనుక విక్రమ్ లాంటి ఫిజిక్ ఉన్న విలన్ కోసం అడిగి ఉంటారు అనుకున్నారంతా. కానీ ఇప్పుడు అదే విక్రమ్ పేరు త్రివిక్రమ్ ప్రాజెక్ట్ విషయంలో తెరపైకి రావడంతో కన్ఫ్యూజన్ మొదలైంది. మరి ఈ వార్తలో ఎంత నిజముంది? ఒకవేళ ఇది నిజమే అయితే తను నటించేది రాజమౌళి సినిమాలోనా లేక త్రివిక్రమ్ సినిమాలోనా? ఎవరో ఒకరు క్లారిటీ ఇవ్వాల్సిందే.
This post was last modified on February 23, 2022 10:04 pm
హీరోల కోసం థియేటర్లకు వచ్చే ప్రేక్షకులు చాలామందే ఉంటారు. హీరోయిన్ల గ్లామర్ కోసం కూడా కొంతమంది సినిమాలకు వస్తారు. కానీ…
“పవన్ కళ్యాణ్ హఠావో..పాలిటిక్స్ బచావో“ పుస్తక రచయిత, యూట్యూబర్ బొగ్గుల శ్రీనివాస్ అనుమానాస్పద మృతి వ్యవహారం తెలంగాణతో పాటు ఏపీ…
గత నెల రోజులుగా టాలీవుడ్ బాక్సాఫీస్ చాలా డ్రైగా ఉంది. కపుల్ ఫ్రెండ్లీ లాంటివి కాసింత పాజిటివ్ టాక్ తో…
జై హనుమాన్.. ఈ సినిమా కోసం రెండేళ్ల కిందట్నుంచి దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 2024 సంక్రాంతికి…
సూపర్ స్టార్ రజినీకాంత్, లోక నాయకుడు కమల్ హాసన్ల కలయికలో 46 ఏళ్ల తర్వాత సినిమా రాబోతుండడం వాళ్లిద్దరి అభిమానులనే…
వివాహ నమోదు నిబంధనల్లో మార్పులు చేస్తూ గుజరాత్ ప్రభుత్వం కీలక ప్రతిపాదనను ముందుకు తెచ్చింది. పెళ్లి నమోదు చేసుకునే జంటలు…