Movie News

మహేష్ సినిమా.. విక్రమ్‌ పేరు మళ్లీ తెరపైకి!

ఒక హీరో సినిమాలో మరో హీరో విలన్‌గా నటిస్తే వచ్చే కిక్కే వేరు. అందులోనూ వాళ్లిద్దరూ స్టార్స్‌ అయితే ఇక అంచనాలు ఓ రేంజ్‌లో ఉంటాయి. ‘బాహుబలి’లో ప్రభాస్‌కి ప్రత్యర్థిగా రానాని చూసి విజిల్స్ వేయని వాళ్లెవరైనా ఉంటారా! ఇప్పుడు అలాంటి మ్యాజిక్‌ ఒకటి మళ్లీ జరగబోతోంది అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. అది కూడా మహేష్‌ బాబు సినిమా విషయంలో.       

త్వరలో ‘సర్కారు వారి పాట’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు మహేష్. ఆ తర్వాత త్రివిక్రమ్‌తో, దాని తర్వాత రాజమౌళితో సినిమాలు చేయాల్సి ఉంది. త్రివిక్రమ్‌తో సినిమా వచ్చే నెల మొదటి వారంలో సెట్స్‌కి వెళ్లబోతోంది. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని హారిక హాసిని క్రియేషన్స్ నిర్మిస్తోంది. శోభన ఓ కీలక పాత్రలో నటించనున్నట్టు తెలుస్తోంది.     

ఇక పోతే ఈ మూవీ విలన్ విషయంలో ఓ ఇంటరెస్టింగ్ బజ్ నడుస్తోంది. ఇందులో మహేష్‌తో తలపడే విలన్‌ చాలా స్పెషల్‌గా ఉంటాడట. హీరోకి దీటుగా కనిపిస్తాడట. హోరాహోరీగా పోరాడాల్సి కూడా ఉంటుందట. మరోవైపు ఇంటెలిజెంట్ ప్లేని కూడా పర్‌‌ఫార్మ్ చేయాలట. అందుకే అతను కూడా ఓ హీరోనే అయ్యుండాలని, అందులోనూ ఓ వెర్సటైల్ యాక్టర్ అయ్యుండాలని త్రివిక్రమ్ ఫిక్సయ్యాడట. ఆల్రెడీ తమిళ స్టార్ విక్రమ్‌ని అప్రోచ్ అయ్యాడని, ఆయన కూడా ఓకే అన్నాడని వార్తలు వస్తున్నాయి.       

నిజానికి ఈ న్యూస్ కొద్ది నెలల క్రితం కూడా వినిపించింది. అయితే అప్పుడు రాజమౌళి సినిమా కోసం విక్రమ్‌ని సంప్రదించారంటూ గుసగుసలు వినిపించాయి. అది ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో నడిచే అడ్వెంచరస్‌ మూవీ కనుక విక్రమ్‌ లాంటి ఫిజిక్‌ ఉన్న విలన్‌ కోసం అడిగి ఉంటారు అనుకున్నారంతా. కానీ ఇప్పుడు అదే విక్రమ్ పేరు త్రివిక్రమ్ ప్రాజెక్ట్ విషయంలో తెరపైకి రావడంతో కన్‌ఫ్యూజన్ మొదలైంది. మరి ఈ వార్తలో ఎంత నిజముంది? ఒకవేళ ఇది నిజమే అయితే తను నటించేది రాజమౌళి సినిమాలోనా లేక త్రివిక్రమ్ సినిమాలోనా? ఎవరో ఒకరు క్లారిటీ ఇవ్వాల్సిందే. 

This post was last modified on February 23, 2022 10:04 pm

Share

Recent Posts

సూపర్ స్టార్ కూతురు ఎలా చేసింది

మలయాళం సూపర్ స్టార్ గా పేరొందిన మోహన్ లాల్ కూతురు విస్మయ ఈ శుక్రవారం విడుదల కాబోతున్న తుదక్కంతో తెరంగేట్రం…

1 minute ago

పీకే విక్టరీ బీజేపీకి డేంజర్ బెల్స్ మోగించినట్టేనా?

బీహార్.. జాతీయ రాజకీయాల్లో మరోమారు పతాక శీర్షికలకు ఎక్కేసింది. నిన్నటిదాకా బీజేపీ, జేడీయూ మైత్రి... జేడియూ చీఫ్ నితీశ్ కుమార్ నుంచి పాలనా…

3 hours ago

40 నిముషాల్లోనే శ్రీవారి దర్శనం… కేవలం వారికే!

నమ్మలేక పోతున్నారా… అయినా ఇది నిజం. తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలంటే గంటల తరబడి వేచి చూడాల్సి వస్తుందన్న సంగతి అందరికీ…

7 hours ago

జంతర్ మంతర్ కు చెక్ ?

దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ కు ఇటీవల ఎక్కడ లేని ప్రాచుర్యం లభించింది. నీట్ పేపర్ లీకేజి కి…

11 hours ago

సత్య హాస్యం చాలా ప్లస్ అవుతోంది

గతంలో బ్రహ్మానందం, బాబు మోహన్ లాంటి కమెడియన్స్ ఉన్నప్పుడు వాళ్ళ కోసమే విడిగా కామెడీ ఎపిసోడ్స్ రాసేవాళ్ళు. మెయిన్ రైటర్స్…

11 hours ago

వెంక‌ట‌ప్ప ఫెయిల్… ఇక మాలిక్ ఏం చేస్తాడో?

తెలుగు సినిమా చ‌రిత్ర‌లోనే అత్యంత గొప్ప న‌టుల జాబితా తీస్తే.. అందులో పైవ‌రుస‌లో ఉండే ఆర్టిస్టుల్లో మోహన్ బాబు ఒక‌రు.…

12 hours ago