ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ బావమరిది, నార్నే శ్రీనివాసరావు కుమారుడు.. నితిన్ చంద్ర ఇప్పుడు హీరోగా సినిమా ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారు. నిజానికి దర్శకుడు తేజ సినిమాతో నితిన్ చంద్ర నటుడిగా ఎంట్రీ ఇవ్వాల్సింది కానీ ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయింది. ఆ తరువాత దర్శకుడు సతీష్ వేగ్నేశను రంగంలోకి దించారు. కుటుంబ కథా చిత్రాలను తెరకెక్కించడంలో దర్శకుడు సతీష్ వేగ్నేశకి మంచి అనుభవం ఉంది.
ఇప్పుడు నితిన్ చంద్ర హీరోగా ఆయన తెరకెక్కిస్తోన్న సినిమా కూడా ఓ ఫ్యామిలీ డ్రామా అని తెలుస్తోంది. మలయాళంలో సక్సెస్ అందుకున్న ‘తీవండి’ అనే సినిమా ఆధారంగా దీన్ని తెరకెక్కిస్తున్నారు. టోవినో థామస్ నటించిన ఈ సినిమా అక్కడ భారీ విజయాన్ని అందుకుంది. హిట్ కథ కావడంతో నమ్మకంతో ఈ సినిమా చేస్తున్నారు.
ఇప్పుడు దీనికి ‘శ్రీ శ్రీ రాజావారు’ అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఈ టైటిల్ అయితే కథకు యాప్ట్ గా ఉంటుందని భావిస్తున్నారు దర్శకనిర్మాతలు. మలయాళం సినిమా ఆధారంగా తీస్తున్నప్పటికీ.. తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా కొన్ని మార్పులు చేశారట. ఇప్పటికే షూటింగ్ మొత్తం పూర్తయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.
ఈ ఏడాదిలోనే సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సినిమాను నితిన్ చంద్ర తండ్రి నార్నే శ్రీనివాసరావు స్వయంగా నిర్మించారు. దర్శకుడు సతీష్ వేగ్నేశ రూపొందించిన ‘శతమానం భవతి’ నేషనల్ అవార్డ్స్ సొంతం చేసుకుంది. అయినప్పటికీ ఆయనకు సరైన అవకాశాలు రాలేదు. నితిన్, కళ్యాణ్ రామ్ హీరోలుగా ఆయన చేసిన సినిమాలు పెద్దగా వర్కవుట్ అవ్వలేదు. ఈ సినిమాతో ఎలాగైనా సక్సెస్ అందుకోవాలని చూస్తున్నారు. మరేం జరుగుతుందో చూడాలి!
తమిళ సినిమాలో దశాబ్దాల పాటు ఆధిపత్యం చలాయించిన సూపర్ స్టార్లు రజినీకాంత్. కమల్ హాసన్ వ్యక్తిగతంగా మంచి మిత్రులన్న సంగతి…
ఏపీలో ఇప్పుడు కాపు సామాజిక వర్గం కేంద్రంగా రసవత్తర రాజకీయం నడుస్తోంది. నిన్నటికి నిన్న వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు…
మా ఇంటి బంగారం కథ ముందుగా సాయిపల్లవి దగ్గరికి వెళ్లిన సంగతి సమంత స్వయంగా ఇంటర్వ్యూలో చెప్పాక బయటికి వచ్చింది.…
స్టార్ అన్న గుర్తింపు తెచ్చుకోలేకపోయి ఉండొచ్చు కానీ.. తమిళ, తెలుగు భాషల్లో సీనియర్ నటుడు ఆనంద్కు మంచి గుర్తింపే ఉంది.…
ముంబైలో ఇటీవల జరిగిన ఇంటర్నేషనల్ యోగా డే వేడుకల్లో హీరోయిన్ శ్రీలీలకు అవమానం జరిగిందని సోషల్ మీడియాలో ఒక వీడియో…
తప్పు చేసింది కేంద్ర ప్రభుత్వం. తన తప్పును ఏమాత్రం పట్టించుకోని కేంద్రం… విద్యార్థులు చేసిన చిన్నపాటి తప్పులకూ పెద్ద శిక్షలేసింది.…