ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ బావమరిది, నార్నే శ్రీనివాసరావు కుమారుడు.. నితిన్ చంద్ర ఇప్పుడు హీరోగా సినిమా ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారు. నిజానికి దర్శకుడు తేజ సినిమాతో నితిన్ చంద్ర నటుడిగా ఎంట్రీ ఇవ్వాల్సింది కానీ ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయింది. ఆ తరువాత దర్శకుడు సతీష్ వేగ్నేశను రంగంలోకి దించారు. కుటుంబ కథా చిత్రాలను తెరకెక్కించడంలో దర్శకుడు సతీష్ వేగ్నేశకి మంచి అనుభవం ఉంది.
ఇప్పుడు నితిన్ చంద్ర హీరోగా ఆయన తెరకెక్కిస్తోన్న సినిమా కూడా ఓ ఫ్యామిలీ డ్రామా అని తెలుస్తోంది. మలయాళంలో సక్సెస్ అందుకున్న ‘తీవండి’ అనే సినిమా ఆధారంగా దీన్ని తెరకెక్కిస్తున్నారు. టోవినో థామస్ నటించిన ఈ సినిమా అక్కడ భారీ విజయాన్ని అందుకుంది. హిట్ కథ కావడంతో నమ్మకంతో ఈ సినిమా చేస్తున్నారు.
ఇప్పుడు దీనికి ‘శ్రీ శ్రీ రాజావారు’ అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఈ టైటిల్ అయితే కథకు యాప్ట్ గా ఉంటుందని భావిస్తున్నారు దర్శకనిర్మాతలు. మలయాళం సినిమా ఆధారంగా తీస్తున్నప్పటికీ.. తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా కొన్ని మార్పులు చేశారట. ఇప్పటికే షూటింగ్ మొత్తం పూర్తయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.
ఈ ఏడాదిలోనే సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సినిమాను నితిన్ చంద్ర తండ్రి నార్నే శ్రీనివాసరావు స్వయంగా నిర్మించారు. దర్శకుడు సతీష్ వేగ్నేశ రూపొందించిన ‘శతమానం భవతి’ నేషనల్ అవార్డ్స్ సొంతం చేసుకుంది. అయినప్పటికీ ఆయనకు సరైన అవకాశాలు రాలేదు. నితిన్, కళ్యాణ్ రామ్ హీరోలుగా ఆయన చేసిన సినిమాలు పెద్దగా వర్కవుట్ అవ్వలేదు. ఈ సినిమాతో ఎలాగైనా సక్సెస్ అందుకోవాలని చూస్తున్నారు. మరేం జరుగుతుందో చూడాలి!
This post was last modified on February 23, 2022 3:39 pm
రాజకీయాల్లో అవకాశాలు రావడమే అరుదు. వచ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవసరం.. వాటిని పట్టుకుని ఎదగాల్సిన అవసరం కూడా పార్టీలకు, నాయకులకు…
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…
పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…
తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత పరిస్థితి తొలిగిపోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన…
దేశ ప్రధాని నరేంద్ర మోడీ.. ఆదివారం హైదరాబాద్లో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ పర్యటనలో మరో…
‘కహోనా ప్యార్ హై’ చిత్రంతో హృతిక్ రోషన్ మాత్రమే కాదు.. ఆ చిత్ర కథానాయిక అమీషా పటేల్ సైతం ఓవర్…