రామాయణం మీద ఇప్పటికే ఇండియన్ స్క్రీన్ మీద చాలా సినిమాలొచ్చాయి. అయినా ఆ పురాణ గాథ మీద సినిమాలేమీ ఆగిపోలేదు. ఇప్పటిదాకా వచ్చిన అన్ని సినిమాలనూ తలదన్నేలా మన ప్రభాస్ ప్రధాన పాత్రలో బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ ఆదిపురుష్ పేరుతో రామాయణ గాథను కొత్త కోణంలో చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ సినిమా చిత్రీకరణ ఇప్పటికే పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ నడుస్తోంది. ఈ సందర్భంగా ఓం రౌత్ ఒక ఇంటర్వ్యూలో ఈ సినిమా గురించి ఆసక్తికర విశేషాలు పంచుకున్నాడు.
అసలీ సినిమా ఎలా మొదలైందో అతను వివరించాడు. జపనీస్ డైరెక్టర్ యుగో సాకో.. రామాయణం స్ఫూర్తితో తీసిన ఓ సినిమా చూస్తుండగా.. ఒక విదేశీయుడు మన పురాణ గాథ మీద ఇంత ఆసక్తికర చిత్రం తీసినపుడు, మనం అలాంటి ప్రయత్నం ఎందుకు చేయకూడదు అన్న ఆలోచనతో తాను.. రామాయణానికి కొత్త వెర్షన్ రాయడం మొదలు పెట్టినట్లు రౌత్ వెల్లడించాడు.
ఈ కథ రాస్తున్నపుడు రాముడిగా ప్రభాస్ తప్ప వేరొకరిని తాను ఊహించుకోలేదని.. స్క్రిప్టు పూర్తయ్యాక ప్రభాస్కు ఫోన్లో కథ చెప్పడం మొదలుపెట్టానని.. మూడు సీన్లు చెప్పగానే, నేరుగా వచ్చి కలిసి కథ వింటానని చెప్పాడని రౌత్ తెలిపాడు. కథ విన్న వెంటనే సినిమాకు ఓకే చెప్పాడని.. అతడిలా ఈ సినిమాను తన భుజస్కందాలపై ఇంకెవ్వరూ మోయలేరని కితాబిచ్చాడు రౌత్.
ఈ సినిమా బడ్జెట్ రూ.400 కోట్లని వెల్లడించిన రౌత్.. ఈ ఏడాది ద్వితీయార్ధంలో రిలీజ్ చేస్తామని.. బేసిగ్గా హిందీ, తెలుగు భాషల్లో ఈ సినిమా తెరకెక్కిందని.. తమిళం, మలయాళం, కన్నడ సహా పలు భాషల్లో అనువాదం చేస్తున్నామని.. ఇప్పటిదాకా ఏ ఇండియన్ సినిమాకూ లేని స్థాయిలో భారీగా ఈ చిత్రం విడుదలవుతుందని రౌత్ తెలిపాడు. ఈ చిత్రంలో ప్రభాస్ పేరు రామ్ కాదని.. రాఘవ్ అని, అది రాముడికున్న మరో పేరు కావడంతో అలా పెట్టామని రౌత్ వెల్లడించాడు.
తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు, యువ ఉద్యోగుల మరణ వార్తలు అమెరికా నుంచి వరుసగా వస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. రోడ్డు…
వైసీపీ ఆధ్వర్యంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని కోనసీమలో ఆదివారం నిర్వహించిన కాపుల సభలో మాజీ మంత్రి, ఉత్తరాంధ్రకు చెందిన బొత్స…
బిచ్చగాడు హీరోగా విజయ్ ఆంటోనీకి ఫ్లాపులతో సంబంధం లేకుండా తెలుగు ప్రేక్షకుల్లో గుర్తింపు ఉంది. అయితే వరస డిజాస్టర్లు తన…
అగ్రరాజ్యం అమెరికాలో చదువుకునేందుకు వెళ్లేవారు అప్రమత్తం కావాల్సిన అవసరం ఏర్పడింది. ఇప్పటి వరకు ఈ దేశంలో చదువుకునేందుకు వెళ్లేవారు.. ఎడ్యుకేషన్…
400 కోట్లకు పైగా వసూలు చేసినా గట్టిగా బ్లాక్ బస్టరని చెప్పుకోలేని విచిత్ర పరిస్థితి పెద్దిది. ఓవర్సీస్, ఉత్తరాది రాష్ట్రాలు,…
ఇవాళ హైదరాబాద్ ప్రసాద్ పీసీఎక్స్ లో హనుమాన్ 3డి రీ రిలీజ్ ట్రైలర్ లాంచ్ జరిగింది. మళ్ళీ విడుదల చేస్తున్న…