రామాయణం మీద ఇప్పటికే ఇండియన్ స్క్రీన్ మీద చాలా సినిమాలొచ్చాయి. అయినా ఆ పురాణ గాథ మీద సినిమాలేమీ ఆగిపోలేదు. ఇప్పటిదాకా వచ్చిన అన్ని సినిమాలనూ తలదన్నేలా మన ప్రభాస్ ప్రధాన పాత్రలో బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ ఆదిపురుష్ పేరుతో రామాయణ గాథను కొత్త కోణంలో చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ సినిమా చిత్రీకరణ ఇప్పటికే పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ నడుస్తోంది. ఈ సందర్భంగా ఓం రౌత్ ఒక ఇంటర్వ్యూలో ఈ సినిమా గురించి ఆసక్తికర విశేషాలు పంచుకున్నాడు.
అసలీ సినిమా ఎలా మొదలైందో అతను వివరించాడు. జపనీస్ డైరెక్టర్ యుగో సాకో.. రామాయణం స్ఫూర్తితో తీసిన ఓ సినిమా చూస్తుండగా.. ఒక విదేశీయుడు మన పురాణ గాథ మీద ఇంత ఆసక్తికర చిత్రం తీసినపుడు, మనం అలాంటి ప్రయత్నం ఎందుకు చేయకూడదు అన్న ఆలోచనతో తాను.. రామాయణానికి కొత్త వెర్షన్ రాయడం మొదలు పెట్టినట్లు రౌత్ వెల్లడించాడు.
ఈ కథ రాస్తున్నపుడు రాముడిగా ప్రభాస్ తప్ప వేరొకరిని తాను ఊహించుకోలేదని.. స్క్రిప్టు పూర్తయ్యాక ప్రభాస్కు ఫోన్లో కథ చెప్పడం మొదలుపెట్టానని.. మూడు సీన్లు చెప్పగానే, నేరుగా వచ్చి కలిసి కథ వింటానని చెప్పాడని రౌత్ తెలిపాడు. కథ విన్న వెంటనే సినిమాకు ఓకే చెప్పాడని.. అతడిలా ఈ సినిమాను తన భుజస్కందాలపై ఇంకెవ్వరూ మోయలేరని కితాబిచ్చాడు రౌత్.
ఈ సినిమా బడ్జెట్ రూ.400 కోట్లని వెల్లడించిన రౌత్.. ఈ ఏడాది ద్వితీయార్ధంలో రిలీజ్ చేస్తామని.. బేసిగ్గా హిందీ, తెలుగు భాషల్లో ఈ సినిమా తెరకెక్కిందని.. తమిళం, మలయాళం, కన్నడ సహా పలు భాషల్లో అనువాదం చేస్తున్నామని.. ఇప్పటిదాకా ఏ ఇండియన్ సినిమాకూ లేని స్థాయిలో భారీగా ఈ చిత్రం విడుదలవుతుందని రౌత్ తెలిపాడు. ఈ చిత్రంలో ప్రభాస్ పేరు రామ్ కాదని.. రాఘవ్ అని, అది రాముడికున్న మరో పేరు కావడంతో అలా పెట్టామని రౌత్ వెల్లడించాడు.
This post was last modified on February 23, 2022 8:04 am
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…