రామాయణం మీద ఇప్పటికే ఇండియన్ స్క్రీన్ మీద చాలా సినిమాలొచ్చాయి. అయినా ఆ పురాణ గాథ మీద సినిమాలేమీ ఆగిపోలేదు. ఇప్పటిదాకా వచ్చిన అన్ని సినిమాలనూ తలదన్నేలా మన ప్రభాస్ ప్రధాన పాత్రలో బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ ఆదిపురుష్ పేరుతో రామాయణ గాథను కొత్త కోణంలో చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ సినిమా చిత్రీకరణ ఇప్పటికే పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ నడుస్తోంది. ఈ సందర్భంగా ఓం రౌత్ ఒక ఇంటర్వ్యూలో ఈ సినిమా గురించి ఆసక్తికర విశేషాలు పంచుకున్నాడు.
అసలీ సినిమా ఎలా మొదలైందో అతను వివరించాడు. జపనీస్ డైరెక్టర్ యుగో సాకో.. రామాయణం స్ఫూర్తితో తీసిన ఓ సినిమా చూస్తుండగా.. ఒక విదేశీయుడు మన పురాణ గాథ మీద ఇంత ఆసక్తికర చిత్రం తీసినపుడు, మనం అలాంటి ప్రయత్నం ఎందుకు చేయకూడదు అన్న ఆలోచనతో తాను.. రామాయణానికి కొత్త వెర్షన్ రాయడం మొదలు పెట్టినట్లు రౌత్ వెల్లడించాడు.
ఈ కథ రాస్తున్నపుడు రాముడిగా ప్రభాస్ తప్ప వేరొకరిని తాను ఊహించుకోలేదని.. స్క్రిప్టు పూర్తయ్యాక ప్రభాస్కు ఫోన్లో కథ చెప్పడం మొదలుపెట్టానని.. మూడు సీన్లు చెప్పగానే, నేరుగా వచ్చి కలిసి కథ వింటానని చెప్పాడని రౌత్ తెలిపాడు. కథ విన్న వెంటనే సినిమాకు ఓకే చెప్పాడని.. అతడిలా ఈ సినిమాను తన భుజస్కందాలపై ఇంకెవ్వరూ మోయలేరని కితాబిచ్చాడు రౌత్.
ఈ సినిమా బడ్జెట్ రూ.400 కోట్లని వెల్లడించిన రౌత్.. ఈ ఏడాది ద్వితీయార్ధంలో రిలీజ్ చేస్తామని.. బేసిగ్గా హిందీ, తెలుగు భాషల్లో ఈ సినిమా తెరకెక్కిందని.. తమిళం, మలయాళం, కన్నడ సహా పలు భాషల్లో అనువాదం చేస్తున్నామని.. ఇప్పటిదాకా ఏ ఇండియన్ సినిమాకూ లేని స్థాయిలో భారీగా ఈ చిత్రం విడుదలవుతుందని రౌత్ తెలిపాడు. ఈ చిత్రంలో ప్రభాస్ పేరు రామ్ కాదని.. రాఘవ్ అని, అది రాముడికున్న మరో పేరు కావడంతో అలా పెట్టామని రౌత్ వెల్లడించాడు.
This post was last modified on February 23, 2022 8:04 am
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…