ఆలియా భట్ టైటిల్ రోల్లో తెరకెక్కిన చిత్రం ‘గంగూబాయ్ కథియావాడి’. సంజయ్ లీలా భన్సాలీ డైరెక్ట్ చేసిన ఈ మూవీ మరో మూడు రోజుల్లో రిలీజ్ కానుంది. దానికోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారో.. విడుదలను ఆపడానికి అంతమంది ప్రయత్నాలు చేస్తున్నారు. దానికి కారణం.. గంగూబాయ్ జీవితమే. గంగూబాయ్ ఒక సెక్స్ వర్కర్ అనేది ముంబైలోని ఏ మూలకి వెళ్లి అడిగినా చెబుతారని ఆమె గురించి ఆర్టికల్స్, బుక్స్ రాసినవాళ్లంతా చెబుతున్నారు. భన్సాలీ కూడా హుస్సేజ్ జైదీ రాసిన ‘మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబై’ అనే పుస్తకంలోని ఓ చాప్టర్ ఆధారంగానే ఈ సినిమా తీశాడు. అయితే అసలు గంగూబాయ్ సెక్స్ వర్కరే కాదంటూ వివాదం మొదలైంది.
తన తల్లి సెక్స్ వర్కర్ కాదని, ఆమె చరిత్రని వక్రీకరిస్తున్నారని గంగూబాయ్ కొడుకు చాన్నాళ్ల క్రితమే కేసు వేశాడు. స్టే ఇవ్వమని కోర్టును కోరాడు. కానీ అతని పిటిషన్ని కోర్టు కొట్టేసింది. దాంతో సినిమా పూర్తయ్యి విడుదలకు సిద్ధమయ్యింది. అయితే ట్రైలర్ రిలీజయ్యాక మరోసారి గంగూబాయ్ కొడుకు ఆవేదన చెందాడు. తన తల్లిని అలా చూపించడం తట్టుకోలేకపోతున్నానంటూ గొడవ చేస్తున్నాడు. కాకపోతే ఈసారి అతనితో పాటు కామాఠిపుర వాసులు కూడా తిరగబడటం ఎవరూ ఊహించనిది.
ట్రైలర్ వల్ల కామాఠిపుర ప్రతిష్ట దెబ్బ తిన్నదని, ఆ ప్రాంతం మొత్తాన్నీ జనం రెడ్లైట్ ఏరియాగా భావిస్తున్నారని, ఇది తమకు చాలా పెద్ద అవమానమని యాభైమందికి పైగా స్థానిక మహిళలు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వాళ్లందరి తరఫున ఒకామె కేసు కూడా రిజిస్టర్ చేసింది. సినిమాలో కామాఠిపుర అన్న పేరే వినిపించడానికి వీల్లేదని డిమాండ్ చేస్తోంది. మరోవైపు కాంగ్రెస్ ఎమ్మెల్యే అమీన్ పటేల్తో పాటు పునరుజ్జీవన్ సేవా మండల్, అఖిల పద్మశాలి సమాజ్, గుజరాతీ ట్రస్ట్, తిరంగ్ హౌసింగ్ సొసైటీ లాంటి పలు సామాజిక సేవా సంస్థలు కూడా గంగూబాయ్కి ఎదురు తిరిగాయి. ఆ సినిమాని వ్యతిరేకించడమే కాక రిలీజ్ ఆపి తీరాలని కోరుతున్నాయి. ప్రభుత్వానికి లేఖలు కూడా రాస్తున్నాయి.
సరిగ్గా విడుదలకు మూడు రోజుల ముందు ఈ రచ్చ మొదలవడం అందరినీ కంగారు పెడుతోంది. అయితే భన్సాలీకి ఇలాంటి వివాదాలు కొత్తేమీ కాదు. రియాలిటీకి దగ్గరగా తీయడం వల్ల అతని ప్రతి సినిమా కాంట్రవర్శీల్లో చిక్కుకుంటుంది. ఎన్నో అష్టకష్టాలు పడ్డాకే థియేటర్లకి వస్తుంది. ఇప్పుడూ అదే జరుగుతోంది. మరి ఈసారి కూడా అతడు గంగూబాయ్ని సేఫ్గా ఒడ్డున పడేస్తాడో లేదో చూడాలి.
This post was last modified on February 23, 2022 7:42 am
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…