నందమూరి బాలకృష్ణ మరోసారి మాస్కు పూనకాలు తెప్పించే పాత్రనే చేస్తున్నట్లున్నాడు. ఇటీవలే అఖండగా ప్రభంజనం సృష్టించిన ఆయన.. క్రాక్ మూవీతో బ్లాక్బస్టర్ కొట్టిన గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమాను మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ కలయికలో సినిమా అనగానే అంచనాలు పెరిగిపోయాయి. పైగా బాలయ్య కెరీర్లోనే మాసీయెస్ట్ క్యారెక్టర్లో చూడబోతున్నట్లు చెబుతుండటంతో అభిమానుల్లో ఎగ్జైట్మెంట్ ఇంకా పెరిగిపోయింది.
మొన్న షూటింగ్ మొదలైన తొలి రోజు లీకైన ఆన్ లొకేషన్ పిక్ అంచనాలను మరింత పెంచేసింది. ఇలా ఫొటో లీకయ్యేసరికి ఆలస్యం చేయకుండా డ్యామేజ్ కంట్రోల్కు దిగింది చిత్ర బృందం. లీక్డ్ ఫొటోను వైరల్ చేయడమెందుక ఒరిజినలే తీస్కోండి అన్నట్లు షూటింగ్ మొదలైన రెండు రోజులకే అఫీషియల్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసింది.
అభిమానులకు, మాస్కు పూనకాలు తెప్పించేలాగే ఉంది ఎన్బీకే 107 ఫస్ట్ లుక్. ఆ గడ్డం, నల్లచొక్కా- లుంగీ అన్నీ కూడా భలేగా కుదిరాయి బాలయ్యకు. ఇక పోస్టర్లో అందరినీ ఆకర్షించిన మరో విషయం.. బాలయ్య పక్కనున్న డిఫెండర్ కారు. దాని కింద నంబర్ ప్లేట్ మీద ఏపీ 39 వీఆర్ 6666.. ఇదీ ఆ కారు నంబరు. ఇందులో వీఆర్ అన్న అక్షరాలు చర్చనీయాంశంగా మారాయి.
ఈ చిత్రానికి వీర సింహారెడ్డి అనే మాస్ టైటిల్ పెట్టబోతున్నట్లు వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. ఆ పేరును షార్ట్ చేసి వీఆర్ అని కారు మీద వేసినట్లు కనిపిస్తోంది. కాబట్టి ఈ టైటిలే సినిమాకు ఫిక్స్ చేయడం లాంఛనమే కావచ్చు. కన్నడ నటుడు దునియా విజయ్ విలన్ పాత్ర చేయనున్న ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రలో కనిపించనుంది. హీరోయిన్ల విషయంలో ఇంకా అధికారిక ప్రకటన ఏమీ రాలేదు. అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. తమన్ సంగీత దర్శకుడు.
This post was last modified on February 22, 2022 7:43 pm
కంటి ముందు కెమెరా, యూట్యూబ్ ఫాలోయర్స్ ఉంటే చాలు కొందరు ఏం మాట్లాడినా చెల్లిపోతుందని అనుకుంటున్నారు. వీళ్ళ వల్ల సోషల్…
బీఆర్ ఎస్ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్రావు.. తన ఇంటిని తాకట్టు పెట్టారు. బ్యాంకు అధికారుల వద్దుకు…
పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ…
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…