నందమూరి బాలకృష్ణ మరోసారి మాస్కు పూనకాలు తెప్పించే పాత్రనే చేస్తున్నట్లున్నాడు. ఇటీవలే అఖండగా ప్రభంజనం సృష్టించిన ఆయన.. క్రాక్ మూవీతో బ్లాక్బస్టర్ కొట్టిన గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమాను మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ కలయికలో సినిమా అనగానే అంచనాలు పెరిగిపోయాయి. పైగా బాలయ్య కెరీర్లోనే మాసీయెస్ట్ క్యారెక్టర్లో చూడబోతున్నట్లు చెబుతుండటంతో అభిమానుల్లో ఎగ్జైట్మెంట్ ఇంకా పెరిగిపోయింది.
మొన్న షూటింగ్ మొదలైన తొలి రోజు లీకైన ఆన్ లొకేషన్ పిక్ అంచనాలను మరింత పెంచేసింది. ఇలా ఫొటో లీకయ్యేసరికి ఆలస్యం చేయకుండా డ్యామేజ్ కంట్రోల్కు దిగింది చిత్ర బృందం. లీక్డ్ ఫొటోను వైరల్ చేయడమెందుక ఒరిజినలే తీస్కోండి అన్నట్లు షూటింగ్ మొదలైన రెండు రోజులకే అఫీషియల్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసింది.
అభిమానులకు, మాస్కు పూనకాలు తెప్పించేలాగే ఉంది ఎన్బీకే 107 ఫస్ట్ లుక్. ఆ గడ్డం, నల్లచొక్కా- లుంగీ అన్నీ కూడా భలేగా కుదిరాయి బాలయ్యకు. ఇక పోస్టర్లో అందరినీ ఆకర్షించిన మరో విషయం.. బాలయ్య పక్కనున్న డిఫెండర్ కారు. దాని కింద నంబర్ ప్లేట్ మీద ఏపీ 39 వీఆర్ 6666.. ఇదీ ఆ కారు నంబరు. ఇందులో వీఆర్ అన్న అక్షరాలు చర్చనీయాంశంగా మారాయి.
ఈ చిత్రానికి వీర సింహారెడ్డి అనే మాస్ టైటిల్ పెట్టబోతున్నట్లు వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. ఆ పేరును షార్ట్ చేసి వీఆర్ అని కారు మీద వేసినట్లు కనిపిస్తోంది. కాబట్టి ఈ టైటిలే సినిమాకు ఫిక్స్ చేయడం లాంఛనమే కావచ్చు. కన్నడ నటుడు దునియా విజయ్ విలన్ పాత్ర చేయనున్న ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రలో కనిపించనుంది. హీరోయిన్ల విషయంలో ఇంకా అధికారిక ప్రకటన ఏమీ రాలేదు. అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. తమన్ సంగీత దర్శకుడు.
ఇటీవలే విడుదలైన బాలీవుడ్ మూవీ 'మై వాపస్ ఆవుంగా'కు తొలి రోజు రివ్యూలు ఏమంత ఆశాజనకంగా లేవు. పబ్లిక్ టాక్…
సాయిధరమ్ తేజ్ హీరోగా రెండేళ్ల ముందు మొదలైన సినిమా.. సంబరాల యేటిగట్టు. తన మార్కెట్ స్థాయికి మించి పెద్ద బడ్జెట్లో…
పెద్ది మొదటి రెండు వారాలు బాగా సందడి చేసి కలెక్షన్ల వర్షం కురిపించాక మళ్ళీ దాన్ని కొనసాగించే సినిమా ఏది…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లో ‘ఉస్తాద్ భగత్ సింగ్’యే చివరి చిత్రం అవుతుందనే అంచనాలు కలిగాయి ఒక దశలో.…
తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు, యువ ఉద్యోగుల మరణ వార్తలు అమెరికా నుంచి వరుసగా వస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. రోడ్డు…
వైసీపీ ఆధ్వర్యంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని కోనసీమలో ఆదివారం నిర్వహించిన కాపుల సభలో మాజీ మంత్రి, ఉత్తరాంధ్రకు చెందిన బొత్స…