Movie News

వివాదంలో సీనియర్ నరేష్

టాలీవుడ్ సీనియర్ నటుడు నరేష్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల సందర్భంగా ఆయన తీరు ఎంత వివాదాస్పదమైందో తెలిసిందే. ఇప్పుడు నరేష్ ప్రమేయం లేకుండా తన పేరు వివాదంలో చిక్కుకుంది. ఆయన మాజీ భార్య రమ్య రఘుపతిపై హైదరాబాద్‌లోని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఐదుగురు మహిళలు ఫిర్యాదు చేయడంతో చీటింగ్ కేసు నమోదైంది. నరేష్ పేరు చెప్పి ఆమె ఈ మహిళల దగ్గర భారీగా డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

హైదరాబాద్‌లోనే కాక అనంతపురం, హిందూపురంల్లో రమ్య భారీగా వసూళ్లకు పాల్పడినట్లు తెలుస్తోంది. రమ్య మాజీ మంత్రి రఘువీరారెడ్డి తమ్ముడి కుమార్తె. ఆమెకు, నరేష్‌కు ఎనిమిదేళ్ల కిందట హిందూపురంలో పెళ్లి జరిగింది. ఐతే కొన్నేళ్లు కలిసి ఉన్న ఈ జంట తర్వాత విడిపోయింది. ఇద్దరూ అధికారికంగా విడిపోయారా లేదా అన్నది తెలియదు. ఐతే నరేష్‌కు ఉన్న భారీ ఆస్తులను చూపించి, అవి తన సొంతమని చెబుతూ రమ్య చాలామంది దగ్గర డబ్బులు తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఇప్పుడు ఆమె మోసం గ్రహించి తనపై చాలామంది ఫిర్యాదు చేస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంతో తనకు ఏమాత్రం సంబంధం లేదని, రమ్య నుంచి తాను దూరంగా ఉంటున్నానని నరేష్ అంటున్నారు. నరేష్‌కు రమ్యతో జరిగింది రెండో పెళ్లి. మొదటి భార్య ద్వారా ఆయనకు నవీన్ అనే కొడుకు ఉన్నాడు. ఇప్పుడు ఆయన కన్నడ నటి పవిత్ర లోకేష్‌తో కలిసి ఉంటున్నారు.

ఆమెకు ఆల్రెడీ పెళ్లయింది. పిల్లలున్నారు. భర్త నుంచి పవిత్ర అధికారికంగా విడాకులేమీ తీసుకోలేదు. ఐతే ‘సమ్మోహనం’ సినిమాలో భార్యాభర్తలుగా నటించిన సమయంలో నరేష్‌కు, పవిత్రకు సాన్నిహిత్యం పెరిగి ఇద్దరూ కలిసి ఉంటున్నారు. కుటుంబ కార్యక్రమాలతో పాటు ఎక్కడికి వెళ్లినా పవిత్రను వెంట తీసుకెళ్తున్నారు నరేష్. ఇలాంటి టైంలో మాజీ భార్య రమ్య కారణంగా ఆయన వివాదంలో చిక్కుకున్నారు.

This post was last modified on February 22, 2022 7:20 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

తమిళంలో డెబ్యూ హీరో సంచలనం

ఒక పెద్ద సినీ కుటుంబానికి చెందిన కొత్త కుర్రాడు ఇండస్ట్రీలోకి అడుగు పెడుతుంటే.. డెబ్యూ మూవీ చేస్తుండగానే వేరే చిత్రాలు…

24 minutes ago

తెలంగాణ నాయకుల జాబితాకు తోడయ్యిన వైఎస్ షర్మిల

కోనసీమ కొబ్బరి తోటలకు తెలంగాణ నాయకుల దిష్టి తగిలిందంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ…

3 hours ago

అసెంబ్లీలో కండోమ్ లతో డెకరేషన్.. ఎప్పుడు..? ఎందుకు..?

ఒకప్పుడు ఏపీలో హెచ్ ఐవీ ఎక్కువగా ఉండేది. హైవేల పక్కన ఎక్కువ కండోమ్ లు కనపడేవి అని సీఎం చంద్రబాబు…

3 hours ago

వికలాంగులతో కేక్ కట్ చేయించిన పవన్

ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సీఎం చంద్రబాబు విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా…

4 hours ago

‘పవన్ పదవి వదిలి గుడులూ.. గోపురాల చుట్టూ తిరగొచ్చు’

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను ఆ ప‌ద‌వి నుంచి బ‌ర్త‌ర‌ఫ్ చేయాల‌ని సీపీఐ సీనియ‌ర్ నేత నారాయ‌ణ డిమాండ్…

4 hours ago

ప్రభుత్వ ఉద్యోగాల్లో తగ్గేదే లే అంటున్న సీఎం రేవంత్

తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. త్వ‌ర‌లోనే మ‌రో 40 వేల ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేయ‌నున్న‌ట్టు తెలిపారు.…

5 hours ago