‘బాహుబలి: ది కంక్లూజన్’ తర్వాత దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఆ స్థాయిలో అమితాసక్తితో ఎదురు చూస్తున్న సీక్వెల్ ‘కేజీఎఫ్: చాప్టర్-2’. రెండేళ్ల కిందట పెద్దగా అంచనాల్లేకుండా పాన్ ఇండియా స్థాయిలో విడుదలై ‘కేజీఎఫ్’ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. హీరోయిజాన్ని పీక్స్లో చూపిస్తూ.. ఎలివేషన్లు, మాస్ అనే పదాల్ని రీడిఫైన్ చేస్తూ ప్రశాంత్ నీల్-యశ్ కలిసి చేసిన ప్రయత్నానికి దేశవ్యాప్తంగా వివిధ భాషల ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.
ఈ సినిమా రిలీజైన దగ్గర్నుంచి ‘చాప్టర్-2’ కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు ప్రేక్షకులు. కానీ 2020లోనే రావాల్సిన ఈ చిత్రం కరోనా, ఇతర కారణాల వల్ల వాయిదాల మీద వాయిదాలు పట్టి 2022 వేసవికి షెడ్యూల్ అయింది. కానీ మేకర్స్ ప్రకటించిన ఏప్రిల్ 14న అయినా ఆ చిత్రం వస్తుందా రాదా అన్న సందేహాలు జనాల్లో ఉన్నాయి. పరిస్థితులు అనుకూలిస్తే ఏప్రిల్ 14న ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించినా.. అభిమానుల్లో పూర్తి నమ్మకం అయితే లేదు.ఐతే తాజాగా ‘కేజీఎఫ్-2’ నిర్మాతలు దీని రిలీజ్ డేట్ను ధ్రువీకరించారు.
తాజాగా ఒక ఆసక్తికర పోస్టర్ రిలీజ్ చేసిన మేకర్స్.. తమ చిత్రం చెప్పినట్లే ఏప్రిల్ 14న రాబోతోందని స్పష్టం చేశారు. కరోనా ప్రభావం తగ్గి పెద్ద సినిమాలు ఒక్కొక్కటిగా బయటికి వచ్చేస్తున్న నేపథ్యంలో ‘కేజీఎఫ్-2’ రిలీజ్ విషయంలో ఇక సందేహాలేమీ పెట్టుకోవాల్సిన పని లేదనే చెప్పొచ్చు. ఏప్రిల్ 14కు షెడ్యూల్ అయిన భారీ బాలీవుడ్ సినిమా ‘లాల్ సింగ్ చద్దా’ కూడా వాయిదా పడిపోవడంతో ‘కేజీఎఫ్-2’ పాన్ ఇండియా రిలీజ్కు లైన్ క్లియర్ అయినట్లే. కాకపోతే తమిళ చిత్రం ‘బీస్ట్’తోనే దానికి కొంచెం ఇబ్బంది ఉంది.
ఈ విజయ్ సినిమాపై తమిళంలో భారీ అంచనాలున్నాయి. దాన్ని కూడా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయాలనుకుంటున్నారు. కాబట్టి ఈ క్లాష్తో కొంచెం సమస్య ఉంది. ఐతే ‘కేజీఎఫ్-2’పై ఉన్న అంచనాల దృష్ట్యా ‘బీస్ట్’ మూవీనే రిలీజ్ డేట్ మార్చుకుంటే మంచిదేమో. దాని మేకర్స్ ఆ దిశగా ఆలోచిస్తారా.. లేక సై అంటే సై అంటారా అన్నదే చూడాలి.
This post was last modified on February 22, 2022 2:29 pm
తెలుగు సినిమా స్థాయి ఇంటర్నేషనల్ లెవెల్ కి చేరుకుందని ఒకవైపు మురిసిపోతూనే, ఇంకోవైపు చాలా విషయాల్లో ఆందోళన కలిగిస్తున్న పరిణామాలు…
శ్రీకాకుళం జిల్లా వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును జైల్లో పరామర్శించేందుకు వెళ్లిన వైసీపీ అధినేత జగన్.. అప్పలరాజును…
రాష్ట్రంలో ఎవరి దయాదాక్షిణ్యాలపైనా తాను ముఖ్యమంత్రిని కాలేదని.. 4 కోట్ల మంది ఓటర్లు ఓటేసి తనను గెలిపించుకున్నారని.. వారి ఆశీర్వాదం,…
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి... పాలిటిక్స్ తో పాటు ఇతరత్రా అంశాలపైనా ఓ రేంజి అవగాహన కలిగిన నేతగా…
మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు తనయుడు ఆరవ్ యాక్సిడెంట్ చేయడంతో దానయ్య అనే గొర్రెల కాపరి మృతి చెందిన సంగతి…
తెలుగులో గత కొన్నేళ్లలో వచ్చిన ఉత్తమ ప్రేమకథా చిత్రాల్లో ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’ ఒకటి. ఎక్కువగా అగ్రెసివ్ క్యారెక్టర్లు…