టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, లక్కీ బ్యూటీ రష్మిక మందన్నాలు ప్రేమలో ఉన్నారని ఎప్పటి నుంచి జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ `గీత గోవిందం` మూవీలో తొలిసారి జంటగా నటించారు. పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2018లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. అలాగే ఈ మూవీలో విజయ్, రష్మికల కెమెస్ట్రీ మరింత అద్భుతంగా పండింది.
రొమాంటిక్ సన్నివేశాల్లోనూ ఏమాత్రం మొహమాటం లేకుండా నటించి ఆన్ స్క్రీన్పై సూపర్ హిట్ జోడీగా గుర్తింపు పొందారు. ఆ తర్వాత వీరిద్దరూ `డియర్ కామ్రేడ్` చిత్రం చేశారు. అప్పటి నుంచీ విజయ్, రష్మికలు ప్రేమలో పడ్డారంటూ వార్తలు మొదలయ్యాయి. పైగా వీరిద్దరూ కలిసి తరచూ పార్టీలకు హాజరు అవ్వడం, డిన్నర్లకు వెళ్లడం ఆ వార్తలకు మరింత బలం చేకూర్చాయి.
దీంతో ఎక్కడికి వెళ్లినా మీ ఇద్దరి పెళ్లెప్పుడు..? అనే ప్రశ్న రష్మిక, విజయ్లకు ఎదురవుతూనే ఉంటుంది. కానీ, తాము ఫ్రెండ్స్ మాత్రమే అని.. ప్రేమ, పెళ్లి వంటి ఆలోచనలే మాలో లేవని వీరిద్దరూ ఎన్నో సార్లు కండబద్దలు కొట్టారు. అయినా వీరిపై రూమర్స్ ఆగడం లేదు. తాజాగా బాలీవుడ్ మీడియా ఈ ఏడాదే రష్మికను విజయ్ వివాహం చేసుకోబోతున్నాడని వార్తలు రాసేసింది.
అవి కాస్త నెట్టింట వైరల్గా మారగా.. విజయ్ ట్విట్టర్ వేదికగా మీడియాకు దిమ్మతిరిగే రిప్లై ఇచ్చాడు. ప్రతిసారి వార్తల్లో ఇదే చెత్తను చూడాల్సి వస్తోందని తీవ్ర అసహనం వ్యక్తం చేసిన విజయ్.. తన ట్వీట్లో బూతులను కూడా వాడేశాడు. దాంతో రష్మిక, విజయ్ల పెళ్లి వార్త ఫేక్ అని తేలిపోయింది. మరి ఇప్పటికైనా వీరిద్దరిపై అనవసరమైన రూమర్లు ఆగుతాయో లేదో చూడాలి.
This post was last modified on February 22, 2022 10:17 am
ఒకప్పుడు ఇంగ్లీష్ సినిమాలకు మన దేశంలో తెగ క్రేజ్ ఉండేది. జురాసిక్ పార్క్ నుంచి ఇది విపరీతంగా పెరిగిపోయింది. దానికి…
గత వారం విడుదలైన ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా ఫుల్ పాజిటివ్ టాకేమీ తెచ్చుకోలేదు. ప్రిమియర్స్ నుంచే డివైడ్ టాక్ మొదలైంది.…
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని విష్ణుమూర్తి అవతారంగా ప్రముఖ బాలివుడ్ నటుడు సుదేష్ బెర్రీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో…
బలమైన కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఆశలన్నీ కొరియన్ కనకరాజు మీదే ఉన్నాయి. ఆగస్ట్…
ఏపీ దశ దిశలను మార్చేసే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం శనివారం ఉదయం లాంఛనంగా ప్రారంబమైంది. దేశ ప్రధాని నరేంద్ర మోదీ అల్లూరి సీతారామరాజు…
జంతర్ మంతర్ ఆందోళనలో ప్రధాని మోదీపై విమర్శలు చేయడం కన్నీళ్లు తెప్పించిందని, పండ్లు కాసే చెట్టుపైకి రాళ్లేస్తారని, దేశం కోసం…