టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, లక్కీ బ్యూటీ రష్మిక మందన్నాలు ప్రేమలో ఉన్నారని ఎప్పటి నుంచి జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ `గీత గోవిందం` మూవీలో తొలిసారి జంటగా నటించారు. పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2018లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. అలాగే ఈ మూవీలో విజయ్, రష్మికల కెమెస్ట్రీ మరింత అద్భుతంగా పండింది.
రొమాంటిక్ సన్నివేశాల్లోనూ ఏమాత్రం మొహమాటం లేకుండా నటించి ఆన్ స్క్రీన్పై సూపర్ హిట్ జోడీగా గుర్తింపు పొందారు. ఆ తర్వాత వీరిద్దరూ `డియర్ కామ్రేడ్` చిత్రం చేశారు. అప్పటి నుంచీ విజయ్, రష్మికలు ప్రేమలో పడ్డారంటూ వార్తలు మొదలయ్యాయి. పైగా వీరిద్దరూ కలిసి తరచూ పార్టీలకు హాజరు అవ్వడం, డిన్నర్లకు వెళ్లడం ఆ వార్తలకు మరింత బలం చేకూర్చాయి.
దీంతో ఎక్కడికి వెళ్లినా మీ ఇద్దరి పెళ్లెప్పుడు..? అనే ప్రశ్న రష్మిక, విజయ్లకు ఎదురవుతూనే ఉంటుంది. కానీ, తాము ఫ్రెండ్స్ మాత్రమే అని.. ప్రేమ, పెళ్లి వంటి ఆలోచనలే మాలో లేవని వీరిద్దరూ ఎన్నో సార్లు కండబద్దలు కొట్టారు. అయినా వీరిపై రూమర్స్ ఆగడం లేదు. తాజాగా బాలీవుడ్ మీడియా ఈ ఏడాదే రష్మికను విజయ్ వివాహం చేసుకోబోతున్నాడని వార్తలు రాసేసింది.
అవి కాస్త నెట్టింట వైరల్గా మారగా.. విజయ్ ట్విట్టర్ వేదికగా మీడియాకు దిమ్మతిరిగే రిప్లై ఇచ్చాడు. ప్రతిసారి వార్తల్లో ఇదే చెత్తను చూడాల్సి వస్తోందని తీవ్ర అసహనం వ్యక్తం చేసిన విజయ్.. తన ట్వీట్లో బూతులను కూడా వాడేశాడు. దాంతో రష్మిక, విజయ్ల పెళ్లి వార్త ఫేక్ అని తేలిపోయింది. మరి ఇప్పటికైనా వీరిద్దరిపై అనవసరమైన రూమర్లు ఆగుతాయో లేదో చూడాలి.
This post was last modified on February 22, 2022 10:17 am
రాజకీయాల్లో అవకాశాలు రావడమే అరుదు. వచ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవసరం.. వాటిని పట్టుకుని ఎదగాల్సిన అవసరం కూడా పార్టీలకు, నాయకులకు…
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…
పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…
తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత పరిస్థితి తొలిగిపోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన…
దేశ ప్రధాని నరేంద్ర మోడీ.. ఆదివారం హైదరాబాద్లో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ పర్యటనలో మరో…
‘కహోనా ప్యార్ హై’ చిత్రంతో హృతిక్ రోషన్ మాత్రమే కాదు.. ఆ చిత్ర కథానాయిక అమీషా పటేల్ సైతం ఓవర్…