రీసెంట్గా గెహ్రాయియా చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చింది దీపికా పదుకొనె. ఓటీటీలో రిలీజైన ఈ సినిమా ఫస్టు లుక్ రిలీజైన నాటి నుంచి రిలీజ్ వరకు పెద్ద దుమారమే రేగింది. టూ పీస్ బికినీలో కనిపించడం దగ్గర్నుంచి ఇంటిమేట్ సీన్స్లో నటించడం వరకు దీపిక పాత్ర విషయంలో చాలా నెగిటివిటీ వచ్చింది. అయితే ఆమె మాత్రం ఎవరి కామెంట్స్నీ సీరియస్గా తీసుకోలేదు. అది తన పనిలో భాగమంటూ కొట్టిపారేసింది.
ఆరేళ్లుగా తనతో రిలేషన్లో ఉన్న వ్యక్తిని మోసగించి, తన కజిన్ ఫియాన్సీతో సంబంధం పెట్టుకునే అమ్మాయిగా ఇందులో నటించింది దీపిక. దాంతో రీసెంట్ ఇంటర్వ్యూలో దీనికి సంబంధించిన ప్రశ్నలు ఎదురయ్యాయి ఆమెకి. నిజ జీవితంలో ఇలాంటి వాటి విషయంలో మీరెలా రియాక్టవుతారు అని అడగడంతో కాస్త డీప్గానే వెళ్లి మాట్లాడింది దీపిక. ‘ఎదుటివాళ్ల రిలేషన్షిప్స్ గురించి మాట్లాడే హక్కు నాకు లేదు. చీటింగ్ జరిగితే వాళ్లు క్షమించి యాక్సెప్ట్ చేస్తారా చేయరా అనేది వాళ్ల ఇష్టం. కానీ నా విషయానికి వస్తే నేను మోసాన్ని సహించలేను. చీట్ చేస్తే తట్టుకోలేను. బంధం అనేది నమ్మకంపై ఆధారపడి ఉంటుంది.
అది లేకపోతే అసలు రిలేషన్కి అర్థమే లేదు’ అంటూ ఎమోషనల్గా మాట్లాడింది దీపిక. అంతేకాదు.. ఫిజికల్ అట్రాక్షన్ ఎక్కువకాలం ఉండదని, ఒకరిపై ఒకరికి ఉండే గౌరవం, నమ్మకమే రిలేషన్ని నిలబెడతాయని చెప్పింది. దీపిక ఇంత స్ట్రాంగ్గా మాట్లాడటానికి కారణం ఉంది.
గతంలో రిలేషన్స్ విషయంలో మోసపోయిందామె. ఆ విషయం తనే ఓపెన్గా చెప్పింది. ఆమె ప్రేమించినవాడు నమ్మకద్రోహం చేసినా క్షమించి మరో చాన్స్ ఇచ్చిందట. కానీ అతను మళ్లీ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోవడంతో ఆమె మనసు విరిగిపోయిందట. అందుకే రణ్వీర్ ప్రపోజ్ చేస్తే కూడా ఎస్ చెప్పడానికి భయపడ్డానని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. అలాంటి దీపిక ఇలా ఓ మోసకత్తె పాత్రలో నటించడం విచిత్రమే మరి.
ప్రపంచమంతా ఒక సినిమా కోసం ఎదురు చూడటం చాలా అరుదు. క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వం వహించిన ది ఒడిస్సీ ఈ…
ఊరు వాడ పేరుతో ఎన్టీఆర్ అభిమానులు చేపడుతున్న సేవా కార్యక్రమాల వ్యవహారం ఇటీవల ఆంధ్రప్రదేశ్లో హాట్ టాపిక్గా మారిన సంగతి…
న్యాయస్థానంలో సాక్ష్యాధారాలే కీలకం. మూఢనమ్మకాలతో చట్టాన్ని ప్రభావితం చేయలేరు... అయితే అమాయకత్వమో.. మరి ఏమో కానీ తీర్పు తనకు అనుకూలంగా…
సినీ రంగంలో గొప్ప స్థాయికి చేరుకున్న చాలామంది దర్శకులు ఒకప్పుడు అనామకులే. ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి అవకాశాల కోసం కాళ్లరిగేలా…
ఒకే రోజు ఏపీలో రెండు ఘటనలు.. ఒకటి ప్రకాశం జిల్లా సింగరాయకొండ. మరొకటి పల్నాడు జిల్లా వినుకొండ. రెండు ప్రాంతాలు…
రాయలసీమను కూటమి ప్రభుత్వం పెట్టుబడుల సీమగా మారుస్తోంది. పెద్ద ఎత్తున పెట్టుబడులు తరలి వస్తున్నాయి. తాజాగా దాల్మియా సిమెంట్ భారీ…