రీసెంట్గా గెహ్రాయియా చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చింది దీపికా పదుకొనె. ఓటీటీలో రిలీజైన ఈ సినిమా ఫస్టు లుక్ రిలీజైన నాటి నుంచి రిలీజ్ వరకు పెద్ద దుమారమే రేగింది. టూ పీస్ బికినీలో కనిపించడం దగ్గర్నుంచి ఇంటిమేట్ సీన్స్లో నటించడం వరకు దీపిక పాత్ర విషయంలో చాలా నెగిటివిటీ వచ్చింది. అయితే ఆమె మాత్రం ఎవరి కామెంట్స్నీ సీరియస్గా తీసుకోలేదు. అది తన పనిలో భాగమంటూ కొట్టిపారేసింది.
ఆరేళ్లుగా తనతో రిలేషన్లో ఉన్న వ్యక్తిని మోసగించి, తన కజిన్ ఫియాన్సీతో సంబంధం పెట్టుకునే అమ్మాయిగా ఇందులో నటించింది దీపిక. దాంతో రీసెంట్ ఇంటర్వ్యూలో దీనికి సంబంధించిన ప్రశ్నలు ఎదురయ్యాయి ఆమెకి. నిజ జీవితంలో ఇలాంటి వాటి విషయంలో మీరెలా రియాక్టవుతారు అని అడగడంతో కాస్త డీప్గానే వెళ్లి మాట్లాడింది దీపిక. ‘ఎదుటివాళ్ల రిలేషన్షిప్స్ గురించి మాట్లాడే హక్కు నాకు లేదు. చీటింగ్ జరిగితే వాళ్లు క్షమించి యాక్సెప్ట్ చేస్తారా చేయరా అనేది వాళ్ల ఇష్టం. కానీ నా విషయానికి వస్తే నేను మోసాన్ని సహించలేను. చీట్ చేస్తే తట్టుకోలేను. బంధం అనేది నమ్మకంపై ఆధారపడి ఉంటుంది.
అది లేకపోతే అసలు రిలేషన్కి అర్థమే లేదు’ అంటూ ఎమోషనల్గా మాట్లాడింది దీపిక. అంతేకాదు.. ఫిజికల్ అట్రాక్షన్ ఎక్కువకాలం ఉండదని, ఒకరిపై ఒకరికి ఉండే గౌరవం, నమ్మకమే రిలేషన్ని నిలబెడతాయని చెప్పింది. దీపిక ఇంత స్ట్రాంగ్గా మాట్లాడటానికి కారణం ఉంది.
గతంలో రిలేషన్స్ విషయంలో మోసపోయిందామె. ఆ విషయం తనే ఓపెన్గా చెప్పింది. ఆమె ప్రేమించినవాడు నమ్మకద్రోహం చేసినా క్షమించి మరో చాన్స్ ఇచ్చిందట. కానీ అతను మళ్లీ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోవడంతో ఆమె మనసు విరిగిపోయిందట. అందుకే రణ్వీర్ ప్రపోజ్ చేస్తే కూడా ఎస్ చెప్పడానికి భయపడ్డానని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. అలాంటి దీపిక ఇలా ఓ మోసకత్తె పాత్రలో నటించడం విచిత్రమే మరి.
This post was last modified on February 22, 2022 7:44 am
బాలీవుడ్ లోనే కాదు భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదయిన సినిమాగా తెరకెక్కుతున్న రామాయణ పార్ట్ 1 టీజర్ ఇవాళ…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే లక్ష్యంతో గత నెల 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా భేటీ అయి.. దీనిపై…
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…