రీసెంట్గా గెహ్రాయియా చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చింది దీపికా పదుకొనె. ఓటీటీలో రిలీజైన ఈ సినిమా ఫస్టు లుక్ రిలీజైన నాటి నుంచి రిలీజ్ వరకు పెద్ద దుమారమే రేగింది. టూ పీస్ బికినీలో కనిపించడం దగ్గర్నుంచి ఇంటిమేట్ సీన్స్లో నటించడం వరకు దీపిక పాత్ర విషయంలో చాలా నెగిటివిటీ వచ్చింది. అయితే ఆమె మాత్రం ఎవరి కామెంట్స్నీ సీరియస్గా తీసుకోలేదు. అది తన పనిలో భాగమంటూ కొట్టిపారేసింది.
ఆరేళ్లుగా తనతో రిలేషన్లో ఉన్న వ్యక్తిని మోసగించి, తన కజిన్ ఫియాన్సీతో సంబంధం పెట్టుకునే అమ్మాయిగా ఇందులో నటించింది దీపిక. దాంతో రీసెంట్ ఇంటర్వ్యూలో దీనికి సంబంధించిన ప్రశ్నలు ఎదురయ్యాయి ఆమెకి. నిజ జీవితంలో ఇలాంటి వాటి విషయంలో మీరెలా రియాక్టవుతారు అని అడగడంతో కాస్త డీప్గానే వెళ్లి మాట్లాడింది దీపిక. ‘ఎదుటివాళ్ల రిలేషన్షిప్స్ గురించి మాట్లాడే హక్కు నాకు లేదు. చీటింగ్ జరిగితే వాళ్లు క్షమించి యాక్సెప్ట్ చేస్తారా చేయరా అనేది వాళ్ల ఇష్టం. కానీ నా విషయానికి వస్తే నేను మోసాన్ని సహించలేను. చీట్ చేస్తే తట్టుకోలేను. బంధం అనేది నమ్మకంపై ఆధారపడి ఉంటుంది.
అది లేకపోతే అసలు రిలేషన్కి అర్థమే లేదు’ అంటూ ఎమోషనల్గా మాట్లాడింది దీపిక. అంతేకాదు.. ఫిజికల్ అట్రాక్షన్ ఎక్కువకాలం ఉండదని, ఒకరిపై ఒకరికి ఉండే గౌరవం, నమ్మకమే రిలేషన్ని నిలబెడతాయని చెప్పింది. దీపిక ఇంత స్ట్రాంగ్గా మాట్లాడటానికి కారణం ఉంది.
గతంలో రిలేషన్స్ విషయంలో మోసపోయిందామె. ఆ విషయం తనే ఓపెన్గా చెప్పింది. ఆమె ప్రేమించినవాడు నమ్మకద్రోహం చేసినా క్షమించి మరో చాన్స్ ఇచ్చిందట. కానీ అతను మళ్లీ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోవడంతో ఆమె మనసు విరిగిపోయిందట. అందుకే రణ్వీర్ ప్రపోజ్ చేస్తే కూడా ఎస్ చెప్పడానికి భయపడ్డానని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. అలాంటి దీపిక ఇలా ఓ మోసకత్తె పాత్రలో నటించడం విచిత్రమే మరి.
కొందరు స్టార్ హీరోయిన్లు కెరీర్ మంచి ఊపులో కొనసాగుతున్న టైంలోనే వ్యక్తిగత జీవితంలో సెటిల్ అవ్వాలని చూస్తుంటారు. ఈ క్రమంలో…
మొన్నామధ్య విడుదలైన యాక్షన్ కింగ్ అర్జున్ డబ్బింగ్ సినిమా 'బ్లాస్ట్ జోన్' తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఆడింది. ప్రమోషన్లు పెద్దగా…
పవన్ కళ్యాణ్ స్వయంగా ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్తో పాటు కనిపిస్తున్నది…
సోషల్ మీడియాలో ఇప్పుడో టాపిక్ హాట్ డిస్కషన్ గా మారింది. హైదరాబాద్ కు చెందిన ఒక ప్రేక్షకుడు బుక్ మై…
ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రెడ్డి ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్నారు.…