రీసెంట్గా గెహ్రాయియా చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చింది దీపికా పదుకొనె. ఓటీటీలో రిలీజైన ఈ సినిమా ఫస్టు లుక్ రిలీజైన నాటి నుంచి రిలీజ్ వరకు పెద్ద దుమారమే రేగింది. టూ పీస్ బికినీలో కనిపించడం దగ్గర్నుంచి ఇంటిమేట్ సీన్స్లో నటించడం వరకు దీపిక పాత్ర విషయంలో చాలా నెగిటివిటీ వచ్చింది. అయితే ఆమె మాత్రం ఎవరి కామెంట్స్నీ సీరియస్గా తీసుకోలేదు. అది తన పనిలో భాగమంటూ కొట్టిపారేసింది.
ఆరేళ్లుగా తనతో రిలేషన్లో ఉన్న వ్యక్తిని మోసగించి, తన కజిన్ ఫియాన్సీతో సంబంధం పెట్టుకునే అమ్మాయిగా ఇందులో నటించింది దీపిక. దాంతో రీసెంట్ ఇంటర్వ్యూలో దీనికి సంబంధించిన ప్రశ్నలు ఎదురయ్యాయి ఆమెకి. నిజ జీవితంలో ఇలాంటి వాటి విషయంలో మీరెలా రియాక్టవుతారు అని అడగడంతో కాస్త డీప్గానే వెళ్లి మాట్లాడింది దీపిక. ‘ఎదుటివాళ్ల రిలేషన్షిప్స్ గురించి మాట్లాడే హక్కు నాకు లేదు. చీటింగ్ జరిగితే వాళ్లు క్షమించి యాక్సెప్ట్ చేస్తారా చేయరా అనేది వాళ్ల ఇష్టం. కానీ నా విషయానికి వస్తే నేను మోసాన్ని సహించలేను. చీట్ చేస్తే తట్టుకోలేను. బంధం అనేది నమ్మకంపై ఆధారపడి ఉంటుంది.
అది లేకపోతే అసలు రిలేషన్కి అర్థమే లేదు’ అంటూ ఎమోషనల్గా మాట్లాడింది దీపిక. అంతేకాదు.. ఫిజికల్ అట్రాక్షన్ ఎక్కువకాలం ఉండదని, ఒకరిపై ఒకరికి ఉండే గౌరవం, నమ్మకమే రిలేషన్ని నిలబెడతాయని చెప్పింది. దీపిక ఇంత స్ట్రాంగ్గా మాట్లాడటానికి కారణం ఉంది.
గతంలో రిలేషన్స్ విషయంలో మోసపోయిందామె. ఆ విషయం తనే ఓపెన్గా చెప్పింది. ఆమె ప్రేమించినవాడు నమ్మకద్రోహం చేసినా క్షమించి మరో చాన్స్ ఇచ్చిందట. కానీ అతను మళ్లీ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోవడంతో ఆమె మనసు విరిగిపోయిందట. అందుకే రణ్వీర్ ప్రపోజ్ చేస్తే కూడా ఎస్ చెప్పడానికి భయపడ్డానని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. అలాంటి దీపిక ఇలా ఓ మోసకత్తె పాత్రలో నటించడం విచిత్రమే మరి.
This post was last modified on February 22, 2022 7:44 am
ఇటీవలే సన్నీ డియోల్ జాట్ తో బాలీవుడ్లో అడుగు పెట్టిన దర్శకుడు గోపీచంద్ మలినేని తర్వాతి సినిమా బాలకృష్ణతో ఉండబోతోంది.…
ఏపీకి చెందిన క్రైస్తవ మత బోధకుడు ప్రవీణ్ పగడాల మరణంపై నెలకొన్న అస్పష్టతకు తెర పడిపోయింది. ఈ మేరకు ఏలూరు రేంజి…
ముందు విడుదల తేదీని ప్రకటించుకుని, ఆ తర్వాత పోటీదారులు వస్తే తప్పని పరిస్థితుల్లో డేట్ మార్చుకునే పరిస్థితి చిన్న సినిమాలకే…
ఏపీలో రాముడి తరహా రామరాజ్యం తీసుకురావాలన్నదే తన లక్ష్యమని సీఎం చంద్రబాబు తెలిపారు. రామరాజ్యం అంటే.. ఏపీ సమగ్ర అభివృద్ధి…
తమిళనాడులో బీజేపీ-అన్నాడీఎంకే పొత్తు పెట్టుకోవడంపై ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు.…
హీరోలు మాత్రమేనా పాన్ ఇండియా రేంజికి వెళ్లేది.. నిర్మాతలు వెళ్లలేరా అన్నట్లు బహు భాషల్లో సినిమాలు తీస్తూ దూసుకెళ్తోంది టాలీవుడ్ అగ్ర…