నందమూరి బాలకృష్ణ సినిమాలకి మొట్టమొదట ప్లస్ అయ్యేది ఆయన టైటిల్స్ అని చెప్పొచ్చు. ఆయన ఇమేజ్కి తగ్గట్టుగా ఉండే టైటిల్స్ అంచనాలను పెంచేస్తుంటాయి. అందుకే కొత్త సినిమా అనౌన్స్ చేసిన ప్రతిసారీ ఏ టైటిల్ పెట్టబోతోన్నారోనని ఆసక్తిగా చూస్తుంటారు అభిమానులు. అందుకు తగ్గట్టే డైరెక్టర్లు కూడా పవర్ఫుల్ టైటిల్స్ని సెలెక్ట్ చేస్తుంటారు. గోపీచంద్ మలినేని కూడా ఓ మంచి టైటిల్ని ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.
రీసెంట్గా ‘అఖండ’తో బ్లాక్ బస్టర్ కొట్టిన బాలయ్య, ఆ వెంటనే గోపీచంద్ మూవీ షూటింగ్లో జాయినైపోయారు. ప్రస్తుతం సిరిసిల్లలోని ఓ క్వారీలో చిత్రీకరణ జరుగుతోంది. రామ్, లక్ష్మణ్లు కంపోజ్ చేసిన ఫైట్స్ని తెరకెక్కిస్తున్నారు. లొకేషన్ నుంచి కొన్ని ఫొటోలు లీక్ కావడంతో బాలయ్య లుక్ బైటికొచ్చేసింది. దాంతో ఇక సస్పెన్స్ మెయింటెయిన్ చేయడం అనవసరమని ఫీలైన మేకర్స్ ఫస్ట్ లుక్ని కూడా రిలీజ్ చేసేశారు.
అలాగే ఓ మంచి టైటిల్ని కూడా రెడీ చేసి పెట్టుకున్నారట. రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రానికి ‘వీర సింహారెడ్డి’ అనే పేరును ఖరారు చేశారని టాక్. ఇది వినగానే సమరసింహారెడ్డి పేరు గుర్తు రావడం ఖాయం. బాలయ్య స్టార్డమ్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లిన ఆ సినిమా టైటిల్ని పోలి ఉన్న ఈ టైటిల్ కూడా క్లిక్ అవుతుందనే అనిపిస్తోంది.
పైగా సినిమాలోని క్యారెక్టర్ని టైటిల్గా పెట్టిన ప్రతిసారీ బాలయ్యకి కలిసొస్తుంది. సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, సింహా, అఖండ అంటూ మంచి మంచి హిట్లు కొట్టారాయన. కాబట్టి ఈ రకంగానూ ఇది మంచి టైటిలేనని చెప్పొచ్చు. నిజానికి మొన్నటి వరకు ‘జై బాలయ్య’ అనే టైటిల్ పెడుతున్నట్లు ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు ఈ పేరు బైటికొచ్చింది. రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలకృష్ణ డ్యూయెల్ రోల్ చేస్తున్నారు. శ్రుతీహాసన్ హీరోయిన్. కన్నడ హీరో ‘దునియా’ విజయ్ విలన్ పాత్ర పోషిస్తున్నాడు వరలక్ష్మీ శరత్కుమార్ ఓ కీలక పాత్రలో నటిస్తోంది.
This post was last modified on February 21, 2022 11:37 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…