నందమూరి బాలకృష్ణ సినిమాలకి మొట్టమొదట ప్లస్ అయ్యేది ఆయన టైటిల్స్ అని చెప్పొచ్చు. ఆయన ఇమేజ్కి తగ్గట్టుగా ఉండే టైటిల్స్ అంచనాలను పెంచేస్తుంటాయి. అందుకే కొత్త సినిమా అనౌన్స్ చేసిన ప్రతిసారీ ఏ టైటిల్ పెట్టబోతోన్నారోనని ఆసక్తిగా చూస్తుంటారు అభిమానులు. అందుకు తగ్గట్టే డైరెక్టర్లు కూడా పవర్ఫుల్ టైటిల్స్ని సెలెక్ట్ చేస్తుంటారు. గోపీచంద్ మలినేని కూడా ఓ మంచి టైటిల్ని ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.
రీసెంట్గా ‘అఖండ’తో బ్లాక్ బస్టర్ కొట్టిన బాలయ్య, ఆ వెంటనే గోపీచంద్ మూవీ షూటింగ్లో జాయినైపోయారు. ప్రస్తుతం సిరిసిల్లలోని ఓ క్వారీలో చిత్రీకరణ జరుగుతోంది. రామ్, లక్ష్మణ్లు కంపోజ్ చేసిన ఫైట్స్ని తెరకెక్కిస్తున్నారు. లొకేషన్ నుంచి కొన్ని ఫొటోలు లీక్ కావడంతో బాలయ్య లుక్ బైటికొచ్చేసింది. దాంతో ఇక సస్పెన్స్ మెయింటెయిన్ చేయడం అనవసరమని ఫీలైన మేకర్స్ ఫస్ట్ లుక్ని కూడా రిలీజ్ చేసేశారు.
అలాగే ఓ మంచి టైటిల్ని కూడా రెడీ చేసి పెట్టుకున్నారట. రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రానికి ‘వీర సింహారెడ్డి’ అనే పేరును ఖరారు చేశారని టాక్. ఇది వినగానే సమరసింహారెడ్డి పేరు గుర్తు రావడం ఖాయం. బాలయ్య స్టార్డమ్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లిన ఆ సినిమా టైటిల్ని పోలి ఉన్న ఈ టైటిల్ కూడా క్లిక్ అవుతుందనే అనిపిస్తోంది.
పైగా సినిమాలోని క్యారెక్టర్ని టైటిల్గా పెట్టిన ప్రతిసారీ బాలయ్యకి కలిసొస్తుంది. సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, సింహా, అఖండ అంటూ మంచి మంచి హిట్లు కొట్టారాయన. కాబట్టి ఈ రకంగానూ ఇది మంచి టైటిలేనని చెప్పొచ్చు. నిజానికి మొన్నటి వరకు ‘జై బాలయ్య’ అనే టైటిల్ పెడుతున్నట్లు ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు ఈ పేరు బైటికొచ్చింది. రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలకృష్ణ డ్యూయెల్ రోల్ చేస్తున్నారు. శ్రుతీహాసన్ హీరోయిన్. కన్నడ హీరో ‘దునియా’ విజయ్ విలన్ పాత్ర పోషిస్తున్నాడు వరలక్ష్మీ శరత్కుమార్ ఓ కీలక పాత్రలో నటిస్తోంది.
This post was last modified on February 21, 2022 11:37 pm
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…
ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికాల యుద్ధం మన దేశంపై కూడా ప్రభావం చూపుతోంది. పెట్రోల్, డీజిల్ తో పోలిస్తే ఎల్పీజీ…
లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సాగుతోంది. ఇలా లోక్సభ స్పీకర్పై తమకు విశ్వాసం…