కథ, కథనం, డైలాగ్స్, టేకింగ్.. త్రివిక్రమ్ సినిమాల్లో ఇవన్నీ ఒకెత్తయితే.. క్యారెక్టరైజేషన్స్ మరొకెత్తు. హీరోతో పాటు సినిమాలో ప్రతి పాత్రనీ ప్రత్యేకంగా తీర్చిదిద్దడం త్రివిక్రమ్ స్టైల్. ముఖ్యంగా హీరోకి దీటుగా ఒక పాత్రను సృష్టిస్తాడు. అది చాలావరకు లేడీ క్యారెక్టరే కావడం విశేషం.
అత్తారింటికి దారేదిలో నదియా, అజ్ఞాతవాసిలో ఖుష్బూ, అల వైకుంఠపురములో మూవీలో టబు పాత్రలే అందుకు ఉదాహరణ. తన నెక్స్ట్ సినిమాకి కూడా అలాంటి ఓ క్యారెక్టర్ని క్రియేట్ చేశాడట త్రివిక్రమ్. దానికి తగిన నటి కోసం మొదలుపెట్టిన అతని వేట.. ఒక నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్ట్రెస్ దగ్గర ఆగినట్లు తెలుస్తోంది. తనెవరో కాదు.. శోభన.
త్రివిక్రమ్ సినిమా మహేష్బాబుతో అనే సంగతి తెలిసిందే. వచ్చే నెలలో మూవీ సెట్స్కి వెళ్లనుంది. పూజా హెగ్డే హీరోయిన్. హీరో హీరోయిన్లిద్దరి తర్వాత ఆ రేంజ్లో ఉండే ఓ ఇంపార్టెంట్ రోల్ కోసం శోభనను సంప్రదించాడట మాటల మాంత్రికుడు. ఆమె కూడా ఓకే చెప్పిందని టాక్. ఒకప్పుడు తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, తమిళ చిత్రాల్లో ఓ వెలుగు వెలిగింది శోభన. స్టార్ హీరోలందరితోనూ నటించింది.
ఆ తర్వాత నటనకు బ్రేక్ ఇచ్చి డ్యాన్స్పైనే దృష్టి పెట్టింది. ఎప్పడైనా ఓ స్పెషల్ క్యారెక్టర్ దొరికితే చేస్తోంది. రీసెంట్గా దుల్కర్ హీరోగా తెరకెక్కిన ‘పరిణయం’లో నటించింది. అయితే తెలుగులో నటించి మాత్రం చాలా కాలమే అయ్యింది. చిరంజీవి ‘గాడ్ఫాదర్’లో చెల్లెలి పాత్ర విషయంలో తన పేరు వినిపించింది కానీ ఆ చాన్స్ నయన్కి దక్కింది. మరి ఈ వార్తయినా నిజమైతే పదహారేళ్ల తర్వాత శోభన స్ట్రెయిట్ తెలుగు సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తుంది.
This post was last modified on February 21, 2022 10:12 pm
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…