బాలీవుడ్కి చెందిన ఓ స్టార్ హీరోయిన్తో లావ్ ట్రాక్ నడిపించేందుకు సిద్ధమయ్యాడు టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని. అయితే రియల్గా కాదండోయ్.. రీల్గానే. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. `ఇస్మార్ట్ శంకర్` తర్వాత ఫుల్ జోష్లో దూసుకుపోతున్న రామ్.. ఇటీవల తన 20వ చిత్రాన్ని మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఈ సినిమాను శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మింబోతున్నారు. తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో భారీ ఎత్తున ఈ సినిమా విడుదల చేయనున్నారు. అయితే ఈ మూవీలో రామ్కు జోడీగా బాలీవుడ్ హీరోయిన్ పరిణితి చోప్రాను తీసుకోబోతున్నారనే మ్యాటర్ తాజాగా లీకైంది.
ఇప్పటికే బోయపాటి పరిణితి చోప్పాను సంప్రదించారని.. ఆమెకు కథ నచ్చడంలో పాజిటివ్గా స్పందించిందని అంటున్నారు. అంతేకాదు, ఈ సినిమాలో రామ్కు పరిణితికి మధ్య అదిరిపోయే లవ్ ట్రాక్ను బోయపాటి డిజైన్ చేసినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. మరి ఇందులో ఎంత వరకు నిజమో త్వరలోనే తెలియనుంది.
కాగా, రామ్ ప్రస్తుతం కోలీవుడ్ డైరెక్టర్ లింగుసామితో `ది వారియర్` అనే సినిమా చేస్తున్నాడు. తెలుగుతో పాటు తమిళంలోనూ రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్గా, ఆది పినిశెట్టి విలన్గా నటిస్తున్నారు. అలాగే ఇందులో రామ్ తొలిసారి పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు. దీంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
This post was last modified on February 21, 2022 11:21 am
ఓ పాతిక సంవత్సరాలు వెనక్కు వెళ్తే హైదరాబాద్ లో అత్యధిక శాతం సింగల్ స్క్రీన్లు ఉండేవి. టోలి చౌకి నుంచి…
గత ఏడాది డిసెంబర్ దురంధర్ విడుదలతో మొదలుపెట్టి మార్చిలో రిలీజైన దురంధర్ ది రివెంజ్ దాకా పాకిస్థాన్ జనాలు, మీడియా…
జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది కోసం ఎదురు చూపులు మాములుగా లేవు. రెండు నెలలుగా డ్రైగా ఉన్న బాక్సాఫీస్…
గత పది రోజులుగా తమిళనాడు రాజకీయాలు దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశం అవుతున్నాయో తెలిసిందే. ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా టీవీకే…
ఇవాళ జరిగిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ల సమావేశంలో నిర్మాత నాగవంశీ ఒక మాటన్నారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుండా పెద్దిని…
నైజామ్ సింగల్ స్క్రీన్ పర్సెంటేజ్ వివాదం ముదిరిపోతోంది. నిన్న శిరీష్, సునీల్ నారంగ్ తదితరులు నిర్వహించిన ఎగ్జిబిటర్ల ప్రెస్ మీట్…