బాలీవుడ్కి చెందిన ఓ స్టార్ హీరోయిన్తో లావ్ ట్రాక్ నడిపించేందుకు సిద్ధమయ్యాడు టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని. అయితే రియల్గా కాదండోయ్.. రీల్గానే. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. `ఇస్మార్ట్ శంకర్` తర్వాత ఫుల్ జోష్లో దూసుకుపోతున్న రామ్.. ఇటీవల తన 20వ చిత్రాన్ని మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఈ సినిమాను శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మింబోతున్నారు. తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో భారీ ఎత్తున ఈ సినిమా విడుదల చేయనున్నారు. అయితే ఈ మూవీలో రామ్కు జోడీగా బాలీవుడ్ హీరోయిన్ పరిణితి చోప్రాను తీసుకోబోతున్నారనే మ్యాటర్ తాజాగా లీకైంది.
ఇప్పటికే బోయపాటి పరిణితి చోప్పాను సంప్రదించారని.. ఆమెకు కథ నచ్చడంలో పాజిటివ్గా స్పందించిందని అంటున్నారు. అంతేకాదు, ఈ సినిమాలో రామ్కు పరిణితికి మధ్య అదిరిపోయే లవ్ ట్రాక్ను బోయపాటి డిజైన్ చేసినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. మరి ఇందులో ఎంత వరకు నిజమో త్వరలోనే తెలియనుంది.
కాగా, రామ్ ప్రస్తుతం కోలీవుడ్ డైరెక్టర్ లింగుసామితో `ది వారియర్` అనే సినిమా చేస్తున్నాడు. తెలుగుతో పాటు తమిళంలోనూ రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్గా, ఆది పినిశెట్టి విలన్గా నటిస్తున్నారు. అలాగే ఇందులో రామ్ తొలిసారి పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు. దీంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
యూపీలోని మహారాజ్గంజ్ జిల్లా నేపాల్ సరిహద్దులో సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్బీ) బలగాలకు ఒక విదేశీయుడు పట్టుబడటం దేశవ్యాప్తంగా కలకలం…
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా సినిమా ఫలితాన్ని తేల్చి చెప్పేది బాక్సాఫీస్ వసూళ్లే. అవి ఎంత ఘనంగా వచ్చాయనే దాన్ని బట్టే…
రాజకీయ వ్యూహకర్త నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన ప్రశాంత్ కిషోర్ (పీకే) ఆస్తుల వివరాలు ఇప్పుడు పాలిటిక్స్ లో హాట్…
తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాల్లో అక్కినేని వారిది ఒకటి. తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది.…
టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…
ఏపీ సీఎం చంద్రబాబు కలల ప్రాజెక్టు.. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కేంద్ర ప్రభుత్వం `ప్రత్యేక`…