బాలీవుడ్కి చెందిన ఓ స్టార్ హీరోయిన్తో లావ్ ట్రాక్ నడిపించేందుకు సిద్ధమయ్యాడు టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని. అయితే రియల్గా కాదండోయ్.. రీల్గానే. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. `ఇస్మార్ట్ శంకర్` తర్వాత ఫుల్ జోష్లో దూసుకుపోతున్న రామ్.. ఇటీవల తన 20వ చిత్రాన్ని మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఈ సినిమాను శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మింబోతున్నారు. తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో భారీ ఎత్తున ఈ సినిమా విడుదల చేయనున్నారు. అయితే ఈ మూవీలో రామ్కు జోడీగా బాలీవుడ్ హీరోయిన్ పరిణితి చోప్రాను తీసుకోబోతున్నారనే మ్యాటర్ తాజాగా లీకైంది.
ఇప్పటికే బోయపాటి పరిణితి చోప్పాను సంప్రదించారని.. ఆమెకు కథ నచ్చడంలో పాజిటివ్గా స్పందించిందని అంటున్నారు. అంతేకాదు, ఈ సినిమాలో రామ్కు పరిణితికి మధ్య అదిరిపోయే లవ్ ట్రాక్ను బోయపాటి డిజైన్ చేసినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. మరి ఇందులో ఎంత వరకు నిజమో త్వరలోనే తెలియనుంది.
కాగా, రామ్ ప్రస్తుతం కోలీవుడ్ డైరెక్టర్ లింగుసామితో `ది వారియర్` అనే సినిమా చేస్తున్నాడు. తెలుగుతో పాటు తమిళంలోనూ రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్గా, ఆది పినిశెట్టి విలన్గా నటిస్తున్నారు. అలాగే ఇందులో రామ్ తొలిసారి పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు. దీంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
This post was last modified on February 21, 2022 11:21 am
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…