`ఆర్ఎక్స్ 100` సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన హీరో కార్తికేయ.. ఫస్ట్ మూవీతోనే సూపర్ క్రేజ్ సంపాదించుకున్నాడు. ఆ తర్వాత వరుస సినిమాలు చేశాడు కానీ.. `ఆర్ఎక్స్ 100` స్థాయి హిట్టు మాత్రం పడలేదు. ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం `వలిమై`లో కార్తికేయ విలన్గా చేశాడు.
ఇదే ఆయనకు తొలి తమిళ చిత్రం. హెచ్. వినోద్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను జీ స్టూడియోస్ సంస్థతో కలిసి బోనీ కపూర్ నిర్మించారు. ఇందులో సీబీసీఐడీ ఆఫీసర్గా అజిత్ నటించగా.. పోలీసులకు దొరకకుండా తప్పించుకుతిరిగే కిలాడిగా కార్తికేయ కనిపించబోతున్నాడు. ఫిబ్రవరి 24న తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో గ్రాండ్గా ఈ మూవీ రిలీజ్ కాబోతోంది.
ఈ నేపథ్యంలోనే మేకర్స్ జోరుగా ప్రమోషన్స్ నిర్వహిస్తూ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేస్తున్నారు. ఇందులో భాగంగా కార్తికేయ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఆయన సినిమా గురించి ఎన్నో విషయాలను పంచుకున్నాడు. అలాగే విలన్గా నటిస్తే ఎలాంటి బెనిఫిట్స్ను పొందొచ్చో కూడా వివరించారు. కార్తికేయ మాట్లాడుతూ.. `హీరో క్యారెక్టర్ చేస్తున్నప్పుడు కొన్ని పరిమితులు ఉంటాయి. కానీ విలన్ రోల్స్కు హద్దులు ఉండవు.
విలన్ రోల్స్ను ఎంజాయ్ చేస్తూ చేయవచ్చు. హీరోగా చేస్తున్నప్పుడు ప్రమోషన్స్, మూవీ అవుట్పుట్, మార్కెట్ ఇలా ఎన్నో టెన్షన్స్ ఉంటాయి. అదే విలన్కి అలాంటి టెన్షన్స్ ఏమీ ఉండవు` అంటూ సరదగా చెప్పుకొచ్చాడు. దీంతో ఆయన కామెంట్స్ నెట్టింట వైరల్గా మారాయి. కాగా, భారీ అంచనాలు ఉన్న వలిమై చిత్రం మంచి విజయం సాధిస్తే తమిళంలో కార్తికేయకు మరిన్ని అవకాశాలు దక్కడం ఖాయమంటున్నారు సినీ ప్రియులు.
This post was last modified on February 20, 2022 10:58 am
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…