`ఆర్ఎక్స్ 100` సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన హీరో కార్తికేయ.. ఫస్ట్ మూవీతోనే సూపర్ క్రేజ్ సంపాదించుకున్నాడు. ఆ తర్వాత వరుస సినిమాలు చేశాడు కానీ.. `ఆర్ఎక్స్ 100` స్థాయి హిట్టు మాత్రం పడలేదు. ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం `వలిమై`లో కార్తికేయ విలన్గా చేశాడు.
ఇదే ఆయనకు తొలి తమిళ చిత్రం. హెచ్. వినోద్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను జీ స్టూడియోస్ సంస్థతో కలిసి బోనీ కపూర్ నిర్మించారు. ఇందులో సీబీసీఐడీ ఆఫీసర్గా అజిత్ నటించగా.. పోలీసులకు దొరకకుండా తప్పించుకుతిరిగే కిలాడిగా కార్తికేయ కనిపించబోతున్నాడు. ఫిబ్రవరి 24న తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో గ్రాండ్గా ఈ మూవీ రిలీజ్ కాబోతోంది.
ఈ నేపథ్యంలోనే మేకర్స్ జోరుగా ప్రమోషన్స్ నిర్వహిస్తూ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేస్తున్నారు. ఇందులో భాగంగా కార్తికేయ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఆయన సినిమా గురించి ఎన్నో విషయాలను పంచుకున్నాడు. అలాగే విలన్గా నటిస్తే ఎలాంటి బెనిఫిట్స్ను పొందొచ్చో కూడా వివరించారు. కార్తికేయ మాట్లాడుతూ.. `హీరో క్యారెక్టర్ చేస్తున్నప్పుడు కొన్ని పరిమితులు ఉంటాయి. కానీ విలన్ రోల్స్కు హద్దులు ఉండవు.
విలన్ రోల్స్ను ఎంజాయ్ చేస్తూ చేయవచ్చు. హీరోగా చేస్తున్నప్పుడు ప్రమోషన్స్, మూవీ అవుట్పుట్, మార్కెట్ ఇలా ఎన్నో టెన్షన్స్ ఉంటాయి. అదే విలన్కి అలాంటి టెన్షన్స్ ఏమీ ఉండవు` అంటూ సరదగా చెప్పుకొచ్చాడు. దీంతో ఆయన కామెంట్స్ నెట్టింట వైరల్గా మారాయి. కాగా, భారీ అంచనాలు ఉన్న వలిమై చిత్రం మంచి విజయం సాధిస్తే తమిళంలో కార్తికేయకు మరిన్ని అవకాశాలు దక్కడం ఖాయమంటున్నారు సినీ ప్రియులు.
This post was last modified on February 20, 2022 10:58 am
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…