భీమవరం బుల్లోడు, గరం, జయ జానకి నాయకా లాంటి చిత్రాల్లో నటించిన ఎస్తేర్ గుర్తుందా? తక్కువ సినిమాల్లో నటించి త్వరగా కనుమరుగైపోయిన ఈ భామ.. ఇప్పుడు సంచలన ఆరోపణలతో వార్తల్లోకి వచ్చింది. ఆమె కాస్టింగ్ కౌచ్ అనుభవాల గురించి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడింది. ఛాన్సుల కోసం తాను లైంగిక వేధింపులు ఎదుర్కొన్నట్లు ఎస్తేర్ వెల్లడించింది. సినిమా ఛాన్సులు కావాలంటే కమిట్మెంట్ ఇస్తావా..? అని తనను చాలా మంది అడిగారని.. వాటికి ఒప్పుకోకపోతే కెరీర్ ఇక్కడితోనే ఆగిపోతుందని కూడా తనను బెదిరించారని ఎస్తేర్ తెలిపింది.
తమతో పడుకోవాలని వాళ్లు నేరుగా అడగకపోయినా.. వాళ్ల మాటల్ని బట్టి ఆ విషయం అర్థమయ్యేదని ఆమె వెల్లడించింది. ఐతే అవకాశాల కోసం దిగజారాల్సిన అవసరం తనకు లేదని .. అందుకే అలా అడిగిన వాళ్లందరికీ ‘నో’ చెప్పానని ఎస్తేర్ తెలిపింది. బహ్రెయిన్కు చెందిన ఎస్తేర్ హిందీ సినిమాలతో కెరీర్ను ఆరంభించింది. ఆ తర్వాత భీమవరం బుల్లోడుతో టాలీవుడ్లోకి అడుగు పెట్టింది.
ఆపై కన్నడలోనూ సినిమాలు చేసింది. తెలుగులో ఒక టైంలో ఆమె కెరీర్ కాస్త ఆశాజనకంగానే కనిపించింది. కానీ తర్వాత ఛాన్సులు తగ్గిపోయాయి. క్యారెక్టర్ ఆర్టిస్టుగా అయినా స్థిరపడదామని జయజానకి నాయకా సినిమాలో చేసింది కానీ.. అది ఆమె కెరీర్కు ఆశించినంత ఊపు తీసుకురాలేదు.
తర్వాత తెలుగులో ఆమె కెరీర్ దాదాపు ముగిసిపోయింది. కన్నడలో మాత్రం మరికొన్ని సినిమాల్లో నటించింది. ఈలోపు గాయనిగానూ తన ప్రతిభను చాటుకునే ప్రయత్నం చేసింది ఎస్తేర్. ఈ క్రమంలోనే సింగర్ నోయల్తో ఆమె ప్రేమలో పడింది. అతడిని పెళ్లి కూడా చేసుకుంది. కానీ వీరి వైవాహిక జీవితం సజావుగా సాగలేదు. పెళ్లయిన ఏడాదికే విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత ఎస్తేర్ పెద్దగా వార్తల్లో లేదు. ఇప్పుడిలా కాస్టింగ్ కౌచ్ ఆరోపణలతో ఆమె వార్తల్లోకి వచ్చింది.
This post was last modified on February 20, 2022 1:42 am
ప్రస్తుతం ఇండియాలో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్లలో లోకేష్ కనకరాజ్ ఒకడు. ఖైదీ, విక్రమ్ చిత్రాలతో అతను తెచ్చుకున్న క్రేజ్ అంతా…
రాష్ట్రంలో కీలకమైన నాలుగు రాజ్యసభ ఖాళీ అవుతున్నాయి. వీటిలో మూడు వైసీపీకి చెందిన నాయకులవి కాగా ఒకటి టిడిపికి చెందిన…
ఐపీఎల్-2026లో అత్యధిక క్రేజ్ దక్కించుకున్న మ్యాచ్లలో సన్రైజర్స్ హైదరాబాద్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పోరు ఒకటి. మే 22న ఉప్పల్లోని రాజీవ్…
జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది ప్రమోషన్లలో జాన్వీ కపూర్ కనిపించకపోవడం గురించి సోషల్ మీడియాలో రకరకాల అర్థాలు తీస్తున్నారు.…
తెలుగు దేశం పార్టీ వార్షిక పండుగ మహానాడు ఈ దఫా సరికొత్తగా జరగనుంది. ఏటా మే నెల 27,28 తేదీల్లో…
ఏపీలో టీడీపీ సారథ్యంలో కొనసాగుతున్న కూటమి సర్కారు దూకుడు ప్రదర్శిస్తోంది. రాష్ట్రాన్ని అభివృద్ది బాట పట్టించే విషయంలో ప్రత్యేకించి రాష్ట్రానికి…