భీమవరం బుల్లోడు, గరం, జయ జానకి నాయకా లాంటి చిత్రాల్లో నటించిన ఎస్తేర్ గుర్తుందా? తక్కువ సినిమాల్లో నటించి త్వరగా కనుమరుగైపోయిన ఈ భామ.. ఇప్పుడు సంచలన ఆరోపణలతో వార్తల్లోకి వచ్చింది. ఆమె కాస్టింగ్ కౌచ్ అనుభవాల గురించి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడింది. ఛాన్సుల కోసం తాను లైంగిక వేధింపులు ఎదుర్కొన్నట్లు ఎస్తేర్ వెల్లడించింది. సినిమా ఛాన్సులు కావాలంటే కమిట్మెంట్ ఇస్తావా..? అని తనను చాలా మంది అడిగారని.. వాటికి ఒప్పుకోకపోతే కెరీర్ ఇక్కడితోనే ఆగిపోతుందని కూడా తనను బెదిరించారని ఎస్తేర్ తెలిపింది.
తమతో పడుకోవాలని వాళ్లు నేరుగా అడగకపోయినా.. వాళ్ల మాటల్ని బట్టి ఆ విషయం అర్థమయ్యేదని ఆమె వెల్లడించింది. ఐతే అవకాశాల కోసం దిగజారాల్సిన అవసరం తనకు లేదని .. అందుకే అలా అడిగిన వాళ్లందరికీ ‘నో’ చెప్పానని ఎస్తేర్ తెలిపింది. బహ్రెయిన్కు చెందిన ఎస్తేర్ హిందీ సినిమాలతో కెరీర్ను ఆరంభించింది. ఆ తర్వాత భీమవరం బుల్లోడుతో టాలీవుడ్లోకి అడుగు పెట్టింది.
ఆపై కన్నడలోనూ సినిమాలు చేసింది. తెలుగులో ఒక టైంలో ఆమె కెరీర్ కాస్త ఆశాజనకంగానే కనిపించింది. కానీ తర్వాత ఛాన్సులు తగ్గిపోయాయి. క్యారెక్టర్ ఆర్టిస్టుగా అయినా స్థిరపడదామని జయజానకి నాయకా సినిమాలో చేసింది కానీ.. అది ఆమె కెరీర్కు ఆశించినంత ఊపు తీసుకురాలేదు.
తర్వాత తెలుగులో ఆమె కెరీర్ దాదాపు ముగిసిపోయింది. కన్నడలో మాత్రం మరికొన్ని సినిమాల్లో నటించింది. ఈలోపు గాయనిగానూ తన ప్రతిభను చాటుకునే ప్రయత్నం చేసింది ఎస్తేర్. ఈ క్రమంలోనే సింగర్ నోయల్తో ఆమె ప్రేమలో పడింది. అతడిని పెళ్లి కూడా చేసుకుంది. కానీ వీరి వైవాహిక జీవితం సజావుగా సాగలేదు. పెళ్లయిన ఏడాదికే విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత ఎస్తేర్ పెద్దగా వార్తల్లో లేదు. ఇప్పుడిలా కాస్టింగ్ కౌచ్ ఆరోపణలతో ఆమె వార్తల్లోకి వచ్చింది.
This post was last modified on February 20, 2022 1:42 am
మొన్నటిదాకా వరస ఫ్లాపులతో ఉక్కిరిబిక్కిరైన నాగార్జున ఈ సంవత్సరం నా సామిరంగతో ఊరట చెందారు. సోగ్గాడే చిన్ని నాయన రేంజ్…
నిన్న రామాయణం పిక్స్ లీకైనప్పటి నుంచి కొన్ని బాలీవుడ్ సోషల్ మీడియా ఫ్యాన్ హ్యాండిల్స్ సాయిపల్లవిని లక్ష్యంగా చేసుకోవడం స్పష్టంగా…
తెరమీద మళ్ళీ ఎప్పుడు కనిపిస్తుందాని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న సమంత కొత్త సినిమా తాలూకు ప్రకటన వచ్చేసింది. ఇన్స్ టాలో…
కమల్ హాసన్ అభిమానులతో పాటు రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న భారతీయుడు 2కి దారి సుగమం అవుతోంది. జూన్…
ఏపీ రాజధాని ఏది? అంటే.. ఇప్పుడు చెప్పుకొనే పరిస్థితి లేదు. 2019కి ముందు వరకు రాజధాని అమరావతి అని చెప్పుకొనే…
దేశంలో అధికారం దక్కించుకుని హ్యాట్రిక్ కొట్టేందుకు 2018 నుండి ఇప్పటి వరకు అధికార బీజేపీ పార్టీ కేవలం గూగుల్ ప్రకటనల కోసం గుమ్మరించిన…