హీరో రామ్ చరణ్ కు చెందిన విమానయాన సంస్థ ట్రూజెట్ పై సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే. ట్రూజెట్ మూతపడిందని, ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితికి చేరుకుందని మీడియాలోనూ కథనాలు వచ్చాయి.
అంతేకాదు, టాటాతో ఒప్పందం కుదుర్చుకునేందుకు ఆ సంస్థ ప్రయత్నిస్తోందని టాక్ వచ్చింది. ఈ క్రమంలోనే ఆ వార్తలపై రామ్ చరణ్ స్పందించారు. ఆ వార్తలు పూర్తి అవాస్తవమని, ఉద్యోగులందరికీ వేతనాలను చెల్లిస్తున్నట్టు చెప్పారు. ట్రూజెట్ విమాన సేవలు ఆపేస్తున్నట్టు వచ్చిన వార్తలు పూర్తిగా అబద్ధమని, తమ సంస్థపై బురద జల్లే ప్రయత్నంలో భాగంగానే ఈ ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.
ఇక, సంస్థలో కొందరు అధికారులు రాజీనామా చేశారని, కొత్త వారిని వారి స్థానంలో భర్తీ చేశామని ట్రూజెట్ ఎండీ ఉమేష్ చెప్పారు. త్వరలోనే ఓ ఇన్వెస్టర్ రానున్నారని, ఆ తర్వాత కొత్త సీఈవోను ప్రకటించే అవకాశాలున్నాయని పేర్కొన్నారు.
త్వరలోనే మళ్లీ సేవలు ప్రారంభమవుతాయని తెలిపారు. ఒక ఇన్వెస్టర్ నుంచి 25 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 165 కోట్లు) సమీకరించే ప్రయత్నాలు చేస్తున్నామని, త్వరలోనే ఇవి ఫైనల్ అవుతాయని అన్నారు. ఉడాన్ పథకం కింద అత్యంత చౌక ధరలకే విమాన సర్వీసులను ట్రూజెట్ నడుపుతోన్న సంగతి తెలిసిందే.
This post was last modified on February 19, 2022 6:40 pm
ప్యాన్ ఇండియా సినిమాల వాయిదా పర్వం కొనసాగుతూనే ఉంది. జూన్ 13 విడుదలను లాక్ చేసుకుని ఆ మేరకు తమిళనాడు…
సీనియర్ జర్నలిస్ట్ రవిప్రకాష్ గురించి తెలుగు నాట తెలియనివారెవరు.? మీడియాకి సంబంధించి ‘సీఈవో’ అన్న పదానికి పెర్ఫెక్ట్ నిర్వచనంగా రవిప్రకాష్…
బుల్లితెర యాంకర్, బిగ్ బాస్ రియాల్టీ షో ఫేం శ్యామల, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆంధ్ర ప్రదేశ్లో ఎన్నికల…
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏదో అనుకుంటే ఇంకేదో అయింది. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలనే కలలు గన్న…
కాంగ్రెస్ పీసీసీ చీఫ్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. కొన్నాళ్లుగా వైసీపీ అధినేత, సొంత అన్నపై ఆమె తీవ్రస్థాయిలో యుద్ధం…
పెద్ద హీరోల పుట్టిన రోజులు, ఇంకేదైనా ప్రత్యేక సందర్భాలు వస్తే అభిమానులు వాళ్లు నటిస్తున్న కొత్త చిత్రాల నుంచి అప్డేట్స్…