మిల్కీ బ్యూటీ తమన్నా ఇండస్ట్రీలోకి వచ్చి చాలా కాలమే అయినా.. ఇంకా స్టార్ హీరోయిన్గానే సత్తా చాటుతూ తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో వరుస సినిమాలు చేస్తోంది. ఇటీవల డిజిటల్ ఎంట్రీ కూడా ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. తాజాగా ఓ పాన్ ఇండియా మూవీకి సైన్ చేసింది. అదే `బబ్లీ బౌన్సర్`. బాలీవుడ్ సంచలన దర్శకుడు మధుర్ భండార్కర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు.
ఫాక్స్ స్టార్ స్టూడియోస్, జంగ్లీ పిక్చర్స్ బ్యానర్లపై నిర్మితం కాబోతున్న ఈ చిత్రం నిన్ననే పూజా కార్యక్రమాలతో గ్రాండ్గా ప్రారంభమైంది. బాక్సింగ్ నేపథ్యంలో బాక్సర్స్ టౌన్ గా పేరుగాంచిన అసోలా ఫతైపూర్ బ్యాక్ డ్రాప్ లో రూపుదిద్దుకోబోతున్న ఈ సినిమాలో తమన్నా ఓ లేడీ బౌన్సర్ గా కనిపించబోతోంది.
ఇండియాలో ఓ మహిళ బౌన్సర్ కథ ఆధారంగా వస్తున్న తొలి చిత్రమిది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ సైతం స్టార్ట్ కానుంది. ఇకపోతే ఈ పాన్ ఇండియా సినిమాతో తమన్నా తన రెమ్యునరేషన్ను భారీగా పెంచేసిందట. ఇంతకు ముందుకు ఒక్కో సినిమాకు రెండు కోట్ల రూపాయిల వరకు పుచ్చుకున్న తమన్నా.. `బబ్లీ బౌన్సర్`కు మాత్రం ఏకంగా రూ. 4 కోట్లను డిమాండ్ చేసిందని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది.
మరి ఈ ప్రచారమే నిజమైతే ఇక తమన్నాను తట్టుకోవడం టాలీవుడ్ నిర్మాతలకు కష్టమే అవుతుందని అంటున్నారు సినీ ప్రియులు. కాగా, తమన్నా ప్రస్తుతం తెలుగులో అనిల్ రావిపూడి దర్శకత్వంలో `ఎఫ్ 3` సినిమాలో నటిస్తోంది. అలాగే టాలెంటెడ్ హీరో సత్యదేవ్తో `గుర్తుందా శీతాకాలం` అనే మూవీ చేసింది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ రెండు చిత్రాలు త్వరలోనే విడుదల కానున్నాయి.
This post was last modified on February 19, 2022 11:40 am
అమెరికాలో గ్రీన్కార్డ్ కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న భారతీయులు తిరిగి స్వదేశానికి వస్తే భారత్కు భారీ లాభం జరుగుతుందా? ఇండియన్…
పేరున్న హీరో హీరోయిన్లు లేకపోయినా.. ప్రి రిలీజ్ బజ్ కూడా పెద్దగా లేకపోయినా.. కంటెంట్తో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుని పెద్ద…
ఇమేజ్, మార్కెట్ ఉన్న స్టార్లే కాదు అప్ కమింగ్ హీరోలకు సైతం ఏడాదికి ఒక సినిమా రిలీజ్ చేయడమే మహా…
సందీప్ రెడ్డి వంగనే కాదు.. ఆయన సోదరుడు ప్రణయ్ రెడ్డి వంగ కూడా మామూలోడు కాదని.. ఆయన కాన్ఫిడెన్స్ లెవెల్…
AI వల్ల ఉద్యోగాలు, బ్యాంకింగ్, విద్య రంగాల్లో మార్పులు వస్తున్నాయనే ఆందోళన ఇప్పటికే ఉంది. ఇప్పుడు ఎన్నికలపైనా దీని ప్రభావం…
రెండు నెలల విరామం తర్వాత జస్ప్రీత్ బుమ్రా మళ్లీ టీమ్ఇండియాతో చేరారు. ఆఫ్ఘనిస్థాన్తో టీ20 సిరీస్కు ముందు ఢిల్లీలో జరిగిన…