మిల్కీ బ్యూటీ తమన్నా ఇండస్ట్రీలోకి వచ్చి చాలా కాలమే అయినా.. ఇంకా స్టార్ హీరోయిన్గానే సత్తా చాటుతూ తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో వరుస సినిమాలు చేస్తోంది. ఇటీవల డిజిటల్ ఎంట్రీ కూడా ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. తాజాగా ఓ పాన్ ఇండియా మూవీకి సైన్ చేసింది. అదే `బబ్లీ బౌన్సర్`. బాలీవుడ్ సంచలన దర్శకుడు మధుర్ భండార్కర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు.
ఫాక్స్ స్టార్ స్టూడియోస్, జంగ్లీ పిక్చర్స్ బ్యానర్లపై నిర్మితం కాబోతున్న ఈ చిత్రం నిన్ననే పూజా కార్యక్రమాలతో గ్రాండ్గా ప్రారంభమైంది. బాక్సింగ్ నేపథ్యంలో బాక్సర్స్ టౌన్ గా పేరుగాంచిన అసోలా ఫతైపూర్ బ్యాక్ డ్రాప్ లో రూపుదిద్దుకోబోతున్న ఈ సినిమాలో తమన్నా ఓ లేడీ బౌన్సర్ గా కనిపించబోతోంది.
ఇండియాలో ఓ మహిళ బౌన్సర్ కథ ఆధారంగా వస్తున్న తొలి చిత్రమిది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ సైతం స్టార్ట్ కానుంది. ఇకపోతే ఈ పాన్ ఇండియా సినిమాతో తమన్నా తన రెమ్యునరేషన్ను భారీగా పెంచేసిందట. ఇంతకు ముందుకు ఒక్కో సినిమాకు రెండు కోట్ల రూపాయిల వరకు పుచ్చుకున్న తమన్నా.. `బబ్లీ బౌన్సర్`కు మాత్రం ఏకంగా రూ. 4 కోట్లను డిమాండ్ చేసిందని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది.
మరి ఈ ప్రచారమే నిజమైతే ఇక తమన్నాను తట్టుకోవడం టాలీవుడ్ నిర్మాతలకు కష్టమే అవుతుందని అంటున్నారు సినీ ప్రియులు. కాగా, తమన్నా ప్రస్తుతం తెలుగులో అనిల్ రావిపూడి దర్శకత్వంలో `ఎఫ్ 3` సినిమాలో నటిస్తోంది. అలాగే టాలెంటెడ్ హీరో సత్యదేవ్తో `గుర్తుందా శీతాకాలం` అనే మూవీ చేసింది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ రెండు చిత్రాలు త్వరలోనే విడుదల కానున్నాయి.
This post was last modified on February 19, 2022 11:40 am
దేవర పార్ట్ 2 ఉంటుందో లేదోననే అనుమానాలు ఇంకా కొనసాగుతుండగానే దర్శకుడు కొరటాల శివ బాలకృష్ణతో ఒక ప్రాజెక్టు లాక్…
తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్లో వన్ మ్యాన్ `ఆర్మీ`గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనిపిస్తున్నారు. గత ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి…
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఒకప్పుడు దూకుడుగా ఉన్న వైసీపీ ఇప్పుడు పెద్దగా కనిపించడం లేదన్న టాక్ వినిపిస్తోంది. కీలక నాయకులు ఉన్నప్పటికీ..…
ఇమేజ్ ఉన్న హీరోలకు ఎదురయ్యే డైలమా ఒకటుంది. అదే వెబ్ సిరీస్ లకు ఎస్ చెప్పాలా వద్దాని. నాగ చైతన్య…
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…