ఒకప్పుడు కొన్నేళ్ల పాటు టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన కథానాయిక ప్రియమణి. ఆమె కొన్ని సినిమాల్లో ఎంతగా గ్లామర్ ఒలకబోసిందో.. కొన్ని సిినిమాల్లో పెర్ఫామెన్స్తో అంతగా ఆకట్టుకుంది. ‘పరుత్తి వీరన్’ సినిమాకు గాను ఆమె జాతీయ ఉత్తమ నటిగా ఎంపికైన విషయం గుర్తుండే ఉంటుంది.
‘చారులత’ లాంటి కొన్ని సినిమాల కోసం ప్రియమణి పడ్డ కష్టం అంతా ఇంతా కాదు. అది అవిభక్త కవలలకు సంబంధించిన సినిమా కావడంతో నిజ జీవితంలో అలాంటి స్థితిలో ఉన్న వాళ్లను కలిసి అనుభవాలు పంచుకుంది ప్రియమణి. ఇప్పుడు టాలీవుడ్లోకి ‘విరాట పర్వం’ సినిమాతో రీఎంట్రీ ఇవ్వబోతున్న ప్రియమణి.. అందులోనూ తాను చేసిన పాత్ర కోసం ఇలాంటి కమిట్మెంటే చూపించిందట.
‘విరాటపర్వం’లో ప్రియమణి నక్సలైట్ భారతక్క అనే పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పాత్ర చేయడం కోసం ఆమె నిజంగానే నక్సలైట్ను కలిసిందట. ‘విరాట పర్వం’ దర్శకుడు వేణు ఉడుగుల సూచన మేరకు గతంలో నక్సలైట్గా పని చేసి తర్వాత జన జీవన స్రవంతిలో కలిసిన ఓ వ్యక్తిని ప్రియమణి కలిసి తన దగ్గర ట్రైనింగ్ తీసుకుందట.
నక్సలైట్ల జీవన విధానం ఎలా ఉంటుంది.. వాళ్ల ప్లానింగ్ ఎలా ఉంటుంది.. లైఫ్ స్టైల్, బాడీ లాంగ్వేజ్.. ఇలా అన్ని విషయాలు తెలుసుకున్నాకే భారతక్క పాత్ర కోసం రంగంలోకి దిగిందట ప్రియమణి. హీరోయిన్గా ఫేడవుట్ అయిపోయాక కొన్నేళ్ల పాటు టాలీవుడ్ వైపు చూడని ప్రియమణి.. ఒకేసారి రెండు ముఖ్య పాత్రలు, పేరున్న సినిమాలతో టాలీవుడ్లోకి రీఎంట్రీ ఇస్తుండటం విశేషం.
రానా, సాయిపల్లవి లాంటి మంచి పెర్ఫామర్లు కలిసి నటిస్తున్న ‘విరాట పర్వం’లో ఆమెది లీడ్ రోల్స్కు సమానమైన పాత్రే. అలాగే వెంకటేష్ హీరోగా నటిస్తున్న ‘నారప్ప’లోనూ ఆమె కీలక పాత్ర పోషిస్తోంది. పరిస్థితులు చక్కబడితే.. ఈ రెండు చిత్రాలూ ఈ ఏడాదే విడుదలయ్యే అవకాశముంది.
This post was last modified on June 16, 2020 1:52 pm
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…
నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే.…
దేశంలో ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎప్పుడో వెలువడ్డాయి. ఆ ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో…