ఒకప్పుడు కొన్నేళ్ల పాటు టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన కథానాయిక ప్రియమణి. ఆమె కొన్ని సినిమాల్లో ఎంతగా గ్లామర్ ఒలకబోసిందో.. కొన్ని సిినిమాల్లో పెర్ఫామెన్స్తో అంతగా ఆకట్టుకుంది. ‘పరుత్తి వీరన్’ సినిమాకు గాను ఆమె జాతీయ ఉత్తమ నటిగా ఎంపికైన విషయం గుర్తుండే ఉంటుంది.
‘చారులత’ లాంటి కొన్ని సినిమాల కోసం ప్రియమణి పడ్డ కష్టం అంతా ఇంతా కాదు. అది అవిభక్త కవలలకు సంబంధించిన సినిమా కావడంతో నిజ జీవితంలో అలాంటి స్థితిలో ఉన్న వాళ్లను కలిసి అనుభవాలు పంచుకుంది ప్రియమణి. ఇప్పుడు టాలీవుడ్లోకి ‘విరాట పర్వం’ సినిమాతో రీఎంట్రీ ఇవ్వబోతున్న ప్రియమణి.. అందులోనూ తాను చేసిన పాత్ర కోసం ఇలాంటి కమిట్మెంటే చూపించిందట.
‘విరాటపర్వం’లో ప్రియమణి నక్సలైట్ భారతక్క అనే పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పాత్ర చేయడం కోసం ఆమె నిజంగానే నక్సలైట్ను కలిసిందట. ‘విరాట పర్వం’ దర్శకుడు వేణు ఉడుగుల సూచన మేరకు గతంలో నక్సలైట్గా పని చేసి తర్వాత జన జీవన స్రవంతిలో కలిసిన ఓ వ్యక్తిని ప్రియమణి కలిసి తన దగ్గర ట్రైనింగ్ తీసుకుందట.
నక్సలైట్ల జీవన విధానం ఎలా ఉంటుంది.. వాళ్ల ప్లానింగ్ ఎలా ఉంటుంది.. లైఫ్ స్టైల్, బాడీ లాంగ్వేజ్.. ఇలా అన్ని విషయాలు తెలుసుకున్నాకే భారతక్క పాత్ర కోసం రంగంలోకి దిగిందట ప్రియమణి. హీరోయిన్గా ఫేడవుట్ అయిపోయాక కొన్నేళ్ల పాటు టాలీవుడ్ వైపు చూడని ప్రియమణి.. ఒకేసారి రెండు ముఖ్య పాత్రలు, పేరున్న సినిమాలతో టాలీవుడ్లోకి రీఎంట్రీ ఇస్తుండటం విశేషం.
రానా, సాయిపల్లవి లాంటి మంచి పెర్ఫామర్లు కలిసి నటిస్తున్న ‘విరాట పర్వం’లో ఆమెది లీడ్ రోల్స్కు సమానమైన పాత్రే. అలాగే వెంకటేష్ హీరోగా నటిస్తున్న ‘నారప్ప’లోనూ ఆమె కీలక పాత్ర పోషిస్తోంది. పరిస్థితులు చక్కబడితే.. ఈ రెండు చిత్రాలూ ఈ ఏడాదే విడుదలయ్యే అవకాశముంది.
This post was last modified on June 16, 2020 1:52 pm
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకునే నిర్ణయాలు విస్మయానికి గురి చేస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు ఇరాన్పై ఒంటికాలిపై లేచిన…
డీఎస్సీ నియమకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపణలు చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి జగన్ కు విద్యా శాఖ మంత్రి నారా లోకేష్…
తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ మరో సంప్రదాయాన్ని బ్రేక్ చేశారు. ఎన్నికలకు ముందు అందరం ఒక్కటేనంటూ నీతులు వల్లించే నాయకులు…
సౌత్ ఇండియన్ ఫిలిం మేకింగ్ ని కొత్త పుంతలు తొక్కించిన దర్శకుల్లో శంకర్, మురుగదాస్ పేర్లు ప్రత్యేకంగా నిలుస్తాయి. ఎందుకంటే…
‘టాక్సిక్’ వచ్చిన తర్వాత ‘ఇరుముడి’ రన్ మీద ప్రభావం తప్పదేమో అని డౌట్ ఉండేది. పెద్ద పాన్ ఇండియా సినిమా…
సుప్రసిద్ధ గాయని ఏంఎస్ సుబ్బులక్ష్మి జీవిత కథ ఆధారంగా బయోపిక్ తీసేందుకు నిర్మాత బన్నీ వాస్, అల్లు అరవింద్, రాక్…