అక్కినేని నాగచైతన్య ఇటీవలె భార్య సమంతతో విడిపోయిన సంగతి తెలిసిందే. ప్రేమించుకుని పెద్దలను ఒప్పించి ఆపై అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్న ఈ జంట.. నాలుగేళ్లు గడవక ముందే వైవాహిక జీవితానికి ముగింపు పలికారు. ప్రస్తుతం ఎవరి దారి వారు చూసుకున్న చైతు, సామ్లు కెరీర్ పరంగా దూసుకుపోతున్నారు.
ఓవైపు వరుస సినిమాలు చేస్తూనే.. మరోవైపు వీరిద్దరూ వెబ్ సిరీస్లలోనూ నటిస్తున్నారు. ఇప్పటికే సామ్ డిజిటల్ ఎంట్రీ ఇవ్వగా.. చైతు సైతం ఓటీటీలోకి అడుగు పెట్టబోతున్నాడు. అమెజాన్ ప్రైమ్ వీడియో వారు తెరకెక్కిస్తున్న ఓ హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్తో చైతు నటించనున్నాడు. విక్రమ్ కె. కుమార్ దర్శకత్వం వహించనున్న ఈ సిరీస్ మరి కొద్ది రోజుల్లో సెట్స్ మీదకు వెళ్లనుంది.
అయితే లేటెస్ట్ సమాచారం ప్రకారం.. చైతు-సామ్ రూటులోనే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా డిజిటల్ ఎంట్రీ ఇవ్వాలని డిసైడ్ అయ్యాడట. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ అమెరికాకు చెందిన ఓ పాపులర్ వెబ్సిరీస్ను తెలుగులో తెరకెక్కించబోతోందట. అయితే ఈ సిరీస్లో హీరోగా నటించేందుకు నెట్ఫ్లిక్స్ వారు చరణ్ను సంప్రదించగా.. స్టోరీ నచ్చడంతో ఆయన వెంటనే ఓకే చెప్పాడని టాక్ నడుస్తోంది.
అంతేకాదు, ఈ వెబ్ సిరీస్కు గానూ చరణ్ భారీగా రెమ్యునరేషన్ పుచ్చుకుంటున్నాడని, త్వరలోనే ఈ సిరీస్ను ఆఫీషల్గా అనౌన్స్ చేయనున్నారని కూడా ప్రచారం జరుగుతోంది. మరి ఇందులో ఎంత వరకు నిజముందో తెలీదు గానీ.. సోషల్ మీడియాలో మాత్రం ఈ వార్త తెగ వైరల్ అవుతోంది. కాగా, రామ్ చరణ్ సినిమాల విషయానికి వస్తే.. ఇప్పటికే రాజమౌళి దర్శకత్వంలో `ఆర్ఆర్ఆర్`ను పూర్తి చేసుకున్న ఈయన తన తదుపరి చిత్రాన్ని శంకర్తో స్టార్ట్ చేశాడు. ఈ మూవీ అనంతరం గౌతమ్ తిన్ననూరితో ఓ సినిమా, కొరటాల శివతో ఓ సినిమా, ప్రశాంత్ నీల్తో ఓ సినిమా చేయనున్నాడు.
This post was last modified on February 18, 2022 11:40 am
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…
ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికాల యుద్ధం మన దేశంపై కూడా ప్రభావం చూపుతోంది. పెట్రోల్, డీజిల్ తో పోలిస్తే ఎల్పీజీ…
లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సాగుతోంది. ఇలా లోక్సభ స్పీకర్పై తమకు విశ్వాసం…