అక్కినేని నాగచైతన్య ఇటీవలె భార్య సమంతతో విడిపోయిన సంగతి తెలిసిందే. ప్రేమించుకుని పెద్దలను ఒప్పించి ఆపై అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్న ఈ జంట.. నాలుగేళ్లు గడవక ముందే వైవాహిక జీవితానికి ముగింపు పలికారు. ప్రస్తుతం ఎవరి దారి వారు చూసుకున్న చైతు, సామ్లు కెరీర్ పరంగా దూసుకుపోతున్నారు.
ఓవైపు వరుస సినిమాలు చేస్తూనే.. మరోవైపు వీరిద్దరూ వెబ్ సిరీస్లలోనూ నటిస్తున్నారు. ఇప్పటికే సామ్ డిజిటల్ ఎంట్రీ ఇవ్వగా.. చైతు సైతం ఓటీటీలోకి అడుగు పెట్టబోతున్నాడు. అమెజాన్ ప్రైమ్ వీడియో వారు తెరకెక్కిస్తున్న ఓ హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్తో చైతు నటించనున్నాడు. విక్రమ్ కె. కుమార్ దర్శకత్వం వహించనున్న ఈ సిరీస్ మరి కొద్ది రోజుల్లో సెట్స్ మీదకు వెళ్లనుంది.
అయితే లేటెస్ట్ సమాచారం ప్రకారం.. చైతు-సామ్ రూటులోనే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా డిజిటల్ ఎంట్రీ ఇవ్వాలని డిసైడ్ అయ్యాడట. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ అమెరికాకు చెందిన ఓ పాపులర్ వెబ్సిరీస్ను తెలుగులో తెరకెక్కించబోతోందట. అయితే ఈ సిరీస్లో హీరోగా నటించేందుకు నెట్ఫ్లిక్స్ వారు చరణ్ను సంప్రదించగా.. స్టోరీ నచ్చడంతో ఆయన వెంటనే ఓకే చెప్పాడని టాక్ నడుస్తోంది.
అంతేకాదు, ఈ వెబ్ సిరీస్కు గానూ చరణ్ భారీగా రెమ్యునరేషన్ పుచ్చుకుంటున్నాడని, త్వరలోనే ఈ సిరీస్ను ఆఫీషల్గా అనౌన్స్ చేయనున్నారని కూడా ప్రచారం జరుగుతోంది. మరి ఇందులో ఎంత వరకు నిజముందో తెలీదు గానీ.. సోషల్ మీడియాలో మాత్రం ఈ వార్త తెగ వైరల్ అవుతోంది. కాగా, రామ్ చరణ్ సినిమాల విషయానికి వస్తే.. ఇప్పటికే రాజమౌళి దర్శకత్వంలో `ఆర్ఆర్ఆర్`ను పూర్తి చేసుకున్న ఈయన తన తదుపరి చిత్రాన్ని శంకర్తో స్టార్ట్ చేశాడు. ఈ మూవీ అనంతరం గౌతమ్ తిన్ననూరితో ఓ సినిమా, కొరటాల శివతో ఓ సినిమా, ప్రశాంత్ నీల్తో ఓ సినిమా చేయనున్నాడు.
This post was last modified on February 18, 2022 11:40 am
రాజకీయాల్లో అవకాశాలు రావడమే అరుదు. వచ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవసరం.. వాటిని పట్టుకుని ఎదగాల్సిన అవసరం కూడా పార్టీలకు, నాయకులకు…
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…
పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…
తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత పరిస్థితి తొలిగిపోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన…
దేశ ప్రధాని నరేంద్ర మోడీ.. ఆదివారం హైదరాబాద్లో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ పర్యటనలో మరో…
‘కహోనా ప్యార్ హై’ చిత్రంతో హృతిక్ రోషన్ మాత్రమే కాదు.. ఆ చిత్ర కథానాయిక అమీషా పటేల్ సైతం ఓవర్…