గత ఏడాది అక్కినేని నాగచైతన్య-సమంతల విడాకుల వార్త తెలుగు అభిమానులను ఎంతగా బాధ పెట్టిందో తెలిసిందే. ఇప్పటికీ కూడా వాళ్లు విడిపోవడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. తమిళంలో ఇదే స్థాయిలో అభిమానులను బాధ పెట్టింది ధనుష్-ఐశ్వర్యల విడాకుల వార్త. ఐశ్వర్య మామూలు వ్యక్తి కూడా కాదు. సూపర్ స్టార్ రజినీకాంత్ కూతురు. 18 ఏళ్ల పాటు వైవాహిక జీవితంలో ఉంటూ ఎంతో అన్యోన్యంగా కనిపించిన ఈ జంట.. ఇప్పుడిలా విడిపోవాలని నిర్ణయించుకోవడం అందరికీ పెద్ద షాక్.
వీళ్లిద్దరూ విడాకుల ప్రకటన విషయంలో తొందరపడ్డారని.. కుటుంబ సభ్యులు సర్దిచెప్పే ప్రయత్నం చేస్తున్నారని.. మళ్లీ ధనుష్, ఐశ్వర్య కలిసే అవకాశాలున్నాయని కోలీవుడ్ మీడియాలో వార్తలొచ్చాయి. కానీ అది నిజం కాదని.. ఇద్దరూ విడిపోతున్నారని.. విడాకుల కేసు కూడా ఫైల్ చేశారని.. రజినీ కూడా ఈ విషయంలో ఏమీ చేయలేకపోయారని సన్నిహిత వర్గాలు అంటున్నాయి.ఇదిలా ఉండగా.. విడాకుల ప్రకటన చేయడం తప్ప ధనుష్, ఐశ్వర్య ఈ విషయమై మీడియాలో ఎక్కడా మాట్లాడలేదు.
ఐతే తాజాగా ఐశ్వర్య మాత్రం ఒక మీడియా ఇంటర్వ్యూలో విడాకుల గురించి పరోక్షంగా మాట్లాడింది. ధనుష్ పేరెత్తకుండా.. అతడితో మళ్లీ కలిసే అవకాశం లేదని చెప్పకనే చెప్పేసింది. ‘‘జీవితంలో ఏదో ఒక సమయంలో ప్రతి ఒక్కరికీ ఆటుపోట్లు ఎదురవుతాయి. వాటిని తప్పకుండా ఎదురుకోవాలని అన్నారు. అంతేకాదు ప్రేమ అనేది అద్భుతమైన భావవ్యక్తీకరణ.
ఒకరి భావాలను మరొకరు వ్యక్తపరుచుకోవడమే ప్రేమ. కానీ అది ఒక వ్యక్తికో, వస్తువుకో సంబంధించింది కాదు. నేను ఎదిగేకొద్దీ నా మనసులో ప్రేమ నిర్వచనం కూడా మారుతూ వచ్చింది. అయితే నేను నా తల్లిదండ్రులను, నా పిల్లలను ప్రేమిస్తున్నాను. ఒక వ్యక్తితోనే ప్రేమ ఆగిపోదు’’ అని ఐశ్వర్య చెప్పుకొచ్చింది. ఎక్కడా ధనుష్ ప్రస్తావన తీసుకురానప్పటికీ.. ఒక వ్యక్తితోనే ప్రేమ ఆగిపోదు అని ఐశ్వర్య అనడం చూస్తే.. ధనుష్తో ఆమె మళ్లీ కలిసే అవకాశం లేదన్నది స్పష్టం.
This post was last modified on February 18, 2022 10:09 am
ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నుంచి వచ్చిన ‘మన శంకర వరప్రసాద్’ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్బస్టర్ అయ్యే దిశగా దూసుకెళ్తోంది.…
మన శంకరవరప్రసాద్ గారు రిలీజయ్యాక చాలా మందికి కలిగిన సందేహం ఒకటుంది. చిరంజీవి, నయనతార లవ్ ఎపిసోడ్స్ లో బ్యాక్…
తమిళ దిగ్గజ నటుడు, తమిళగ వెట్రి కగళం(టీవీకే) అధ్యక్షుడు విజయ్ వ్యవహారం.. మరింత ముదురుతోంది. గత ఏడాది సెప్టెంబరు 27న…
రికార్డులు బద్దలు కొట్టేస్తుందని అభిమానులు గంపెడాశలు పెట్టుకున్న ది రాజా సాబ్ ఫలితం చూస్తున్నాం. ఆడియన్స్ ని పూర్తి స్థాయిలో…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత గ్రామం.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నారావారి పల్లెలో ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.…
గత కొన్నేళ్లుగా మినిమమ్ హిట్ లేకుండా అభిమానులను హర్ట్ చేస్తున్న మాస్ మహారాజా రవితేజ ఈసారి పూర్తిగా రూటు మార్చి…