గత ఏడాది అక్కినేని నాగచైతన్య-సమంతల విడాకుల వార్త తెలుగు అభిమానులను ఎంతగా బాధ పెట్టిందో తెలిసిందే. ఇప్పటికీ కూడా వాళ్లు విడిపోవడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. తమిళంలో ఇదే స్థాయిలో అభిమానులను బాధ పెట్టింది ధనుష్-ఐశ్వర్యల విడాకుల వార్త. ఐశ్వర్య మామూలు వ్యక్తి కూడా కాదు. సూపర్ స్టార్ రజినీకాంత్ కూతురు. 18 ఏళ్ల పాటు వైవాహిక జీవితంలో ఉంటూ ఎంతో అన్యోన్యంగా కనిపించిన ఈ జంట.. ఇప్పుడిలా విడిపోవాలని నిర్ణయించుకోవడం అందరికీ పెద్ద షాక్.
వీళ్లిద్దరూ విడాకుల ప్రకటన విషయంలో తొందరపడ్డారని.. కుటుంబ సభ్యులు సర్దిచెప్పే ప్రయత్నం చేస్తున్నారని.. మళ్లీ ధనుష్, ఐశ్వర్య కలిసే అవకాశాలున్నాయని కోలీవుడ్ మీడియాలో వార్తలొచ్చాయి. కానీ అది నిజం కాదని.. ఇద్దరూ విడిపోతున్నారని.. విడాకుల కేసు కూడా ఫైల్ చేశారని.. రజినీ కూడా ఈ విషయంలో ఏమీ చేయలేకపోయారని సన్నిహిత వర్గాలు అంటున్నాయి.ఇదిలా ఉండగా.. విడాకుల ప్రకటన చేయడం తప్ప ధనుష్, ఐశ్వర్య ఈ విషయమై మీడియాలో ఎక్కడా మాట్లాడలేదు.
ఐతే తాజాగా ఐశ్వర్య మాత్రం ఒక మీడియా ఇంటర్వ్యూలో విడాకుల గురించి పరోక్షంగా మాట్లాడింది. ధనుష్ పేరెత్తకుండా.. అతడితో మళ్లీ కలిసే అవకాశం లేదని చెప్పకనే చెప్పేసింది. ‘‘జీవితంలో ఏదో ఒక సమయంలో ప్రతి ఒక్కరికీ ఆటుపోట్లు ఎదురవుతాయి. వాటిని తప్పకుండా ఎదురుకోవాలని అన్నారు. అంతేకాదు ప్రేమ అనేది అద్భుతమైన భావవ్యక్తీకరణ.
ఒకరి భావాలను మరొకరు వ్యక్తపరుచుకోవడమే ప్రేమ. కానీ అది ఒక వ్యక్తికో, వస్తువుకో సంబంధించింది కాదు. నేను ఎదిగేకొద్దీ నా మనసులో ప్రేమ నిర్వచనం కూడా మారుతూ వచ్చింది. అయితే నేను నా తల్లిదండ్రులను, నా పిల్లలను ప్రేమిస్తున్నాను. ఒక వ్యక్తితోనే ప్రేమ ఆగిపోదు’’ అని ఐశ్వర్య చెప్పుకొచ్చింది. ఎక్కడా ధనుష్ ప్రస్తావన తీసుకురానప్పటికీ.. ఒక వ్యక్తితోనే ప్రేమ ఆగిపోదు అని ఐశ్వర్య అనడం చూస్తే.. ధనుష్తో ఆమె మళ్లీ కలిసే అవకాశం లేదన్నది స్పష్టం.
This post was last modified on February 18, 2022 10:09 am
కలిసి రాజకీయం చేయకపోయినా వైఎస్సార్సీపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య కొన్ని పోలికలు కనిపిస్తున్నాయి. అటు ఏపీలో, ఇటు తెలంగాణలో ఈ…
సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటూ.. తన సినిమాల ఈవెంట్లలో, ఇంటర్వ్యూల్లో హాట్ హాట్ కామెంట్లు చేస్తుంటాడు ప్రముఖ తెలుగు…
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు'తో ఇప్పుడు తప్పకుండా హిట్ కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. గతంలో 'గద్దలకొండ గణేష్'…
ఆదివారం రోజు అందులోనూ ప్రత్యేకంగా సాయంత్రం షోలకు ఆక్యుపెన్సీలు బాగుండటం సహజమే కానీ ఈవారం మాత్రం బయ్యర్లు ఆనందంతో మునిగిపోయేలా…
తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమలులో కీలక మార్పులు తెచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతుంది. కళాశాలలకు…
నీట్ ప్రశ్నపత్రం లీకేజీకి వ్యతిరేకంగా విద్యార్థులు చేపట్టిన ఢిల్లీ నిరసనలో ఉగ్రవాదుల కుట్ర కోణం బయట పడిందని ఢిల్లీ టాస్క్ఫోర్స్…