గత ఏడాది అక్కినేని నాగచైతన్య-సమంతల విడాకుల వార్త తెలుగు అభిమానులను ఎంతగా బాధ పెట్టిందో తెలిసిందే. ఇప్పటికీ కూడా వాళ్లు విడిపోవడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. తమిళంలో ఇదే స్థాయిలో అభిమానులను బాధ పెట్టింది ధనుష్-ఐశ్వర్యల విడాకుల వార్త. ఐశ్వర్య మామూలు వ్యక్తి కూడా కాదు. సూపర్ స్టార్ రజినీకాంత్ కూతురు. 18 ఏళ్ల పాటు వైవాహిక జీవితంలో ఉంటూ ఎంతో అన్యోన్యంగా కనిపించిన ఈ జంట.. ఇప్పుడిలా విడిపోవాలని నిర్ణయించుకోవడం అందరికీ పెద్ద షాక్.
వీళ్లిద్దరూ విడాకుల ప్రకటన విషయంలో తొందరపడ్డారని.. కుటుంబ సభ్యులు సర్దిచెప్పే ప్రయత్నం చేస్తున్నారని.. మళ్లీ ధనుష్, ఐశ్వర్య కలిసే అవకాశాలున్నాయని కోలీవుడ్ మీడియాలో వార్తలొచ్చాయి. కానీ అది నిజం కాదని.. ఇద్దరూ విడిపోతున్నారని.. విడాకుల కేసు కూడా ఫైల్ చేశారని.. రజినీ కూడా ఈ విషయంలో ఏమీ చేయలేకపోయారని సన్నిహిత వర్గాలు అంటున్నాయి.ఇదిలా ఉండగా.. విడాకుల ప్రకటన చేయడం తప్ప ధనుష్, ఐశ్వర్య ఈ విషయమై మీడియాలో ఎక్కడా మాట్లాడలేదు.
ఐతే తాజాగా ఐశ్వర్య మాత్రం ఒక మీడియా ఇంటర్వ్యూలో విడాకుల గురించి పరోక్షంగా మాట్లాడింది. ధనుష్ పేరెత్తకుండా.. అతడితో మళ్లీ కలిసే అవకాశం లేదని చెప్పకనే చెప్పేసింది. ‘‘జీవితంలో ఏదో ఒక సమయంలో ప్రతి ఒక్కరికీ ఆటుపోట్లు ఎదురవుతాయి. వాటిని తప్పకుండా ఎదురుకోవాలని అన్నారు. అంతేకాదు ప్రేమ అనేది అద్భుతమైన భావవ్యక్తీకరణ.
ఒకరి భావాలను మరొకరు వ్యక్తపరుచుకోవడమే ప్రేమ. కానీ అది ఒక వ్యక్తికో, వస్తువుకో సంబంధించింది కాదు. నేను ఎదిగేకొద్దీ నా మనసులో ప్రేమ నిర్వచనం కూడా మారుతూ వచ్చింది. అయితే నేను నా తల్లిదండ్రులను, నా పిల్లలను ప్రేమిస్తున్నాను. ఒక వ్యక్తితోనే ప్రేమ ఆగిపోదు’’ అని ఐశ్వర్య చెప్పుకొచ్చింది. ఎక్కడా ధనుష్ ప్రస్తావన తీసుకురానప్పటికీ.. ఒక వ్యక్తితోనే ప్రేమ ఆగిపోదు అని ఐశ్వర్య అనడం చూస్తే.. ధనుష్తో ఆమె మళ్లీ కలిసే అవకాశం లేదన్నది స్పష్టం.
టాలీవుడ్ లో క్లాసిక్ లుక్స్ తో ప్రేక్షకుల మనసు గెలుచుకున్న హీరోయిన్లలో మృణాల్ థాకూర్ ఒకరు. సీతారామం సినిమాతో తెలుగు…
పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కావడం ఇప్పుడు చాలా కామన్ పాయింట్. కానీ ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా…
ధనుష్ కొత్త సినిమా పేరు 'ఓం'గా ఫిక్సయ్యింది. అమరన్ ఫేమ్ రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్…
తెలుగులో ఇప్పుడు నిర్మాతల పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా మారిందో తెలిసిందే. నిలకడగా విజయాలు అందుకుని, లాభాలు దక్కించుకునే నిర్మాతలు అరుదైపోయారు.…
విజయవాడలో కనిపించకుండా పోయిన గాదె సాయికృష్ణ వ్యవహారం అంతకంతకూ జఠిలంగా మారుతోంది. సాయికృష్ణ బతికి లేడని, అతడిని పోలీసులే అంతమొందించారని…
తప్పు చేసిన నేతలు ఎప్పటికైనా ప్రజాగ్రహానికి గురి కావాల్సి వస్తుందని చెప్పడానికి పల్నాడు జిల్లాలో జరిగిన ఈ ఘటన ఉదాహరణగా…