టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న పూజాహెగ్డే ఇప్పుడు తమిళ, హిందీ భాషల్లో కూడా నటిస్తోంది. కోలీవుడ్ లో విజయ్ సరసన ‘బీస్ట్’ అనే సినిమాలో నటించింది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక బాలీవుడ్ లో అయితే క్రేజీ ప్రాజెక్ట్ లను లైన్ లో పెట్టింది. తెలుగులో కూడా బిజీగానే ఉంది. త్వరలోనే మహేష్ బాబు-త్రివిక్రమ్ సినిమా షూటింగ్ లో పాల్గొనుంది.
ఇప్పుడు ఓ యంగ్ హీరో సినిమాలో పూజాకి ఛాన్స్ వచ్చిందట. తెలుగులో ‘ఒక లైలా కోసం’ అనే సినిమాలో నాగచైతన్యతో కలిసి నటించింది పూజాహెగ్డే. ఇప్పుడు మరోసారి అతడి సినిమాలో నటించమని దర్శకనిర్మాతలు పూజాను సంప్రదించారట. రీసెంట్ గా ‘లవ్ స్టోరీ’, ‘బంగార్రాజు’ సినిమాలతో భారీ హిట్స్ అందుకున్న చైతు.. వెంకట్ ప్రభు డైరెక్షన్ లో సినిమా చేయడానికి అంగీకరించారు.
ఇప్పటివరకు తమిళంలో సినిమాలు చేసిన వెంకట్ ప్రభు ఈ సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వబోతున్నారు.
శ్రీనివాస చిట్టూరి నిర్మించనున్న ఈ సినిమాలో హీరోయిన్ గా పూజాహెగ్డేను తీసుకోవాలనుకుంటున్నారు. ఈ మేరకు ఆమెతో సంప్రదింపులు కూడా జరిపారు. కానీ ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది.
ప్రస్తుతం ఆమె చేతిలో చాలా సినిమాలున్నాయి. ఇలాంటి సమయంలో మరో సినిమా ఒప్పుకుంటుందో లేక వదులుకుంటుందో చూడాలి. ప్రస్తుతం చైతు.. విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో ‘థాంక్యూ’ అనే సినిమాలో నటిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అలానే ఓ హారర్ వెబ్ సిరీస్ లో నటించబోతున్నారు. దీన్ని కూడా విక్రమ్ కుమారే డైరెక్ట్ చేయనున్నారు. ఈ సిరీస్ కి ‘దూత’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
This post was last modified on February 17, 2022 9:49 pm
నిన్న లండన్ సిల్వర్ స్టోన్ పార్క్ లో జరిగిన కార్ రేసింగ్ లో అజిత్ కు మద్దతు ఇచ్చేందుకు తమిళనాడు…
శ్రీ సత్యసాయి జిల్లాలోని హిందూపురం నియోజకవర్గంలో స్థానిక సంస్థల రాజకీయం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చుట్టూనే తిరుగుతోంది. ఆయన అనుకూల…
మంచి నటన, చలాకీతనం, అందం అన్నీ ఉన్నా కార్తీ విషయంలో జరుగుతున్న పరిణామాలు అభిమానులను తెగ కలవరపెడుతున్నాయి. సరైన హిట్…
విశాఖపట్నంలో జరగనున్న కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ ఆశలు గల్లంతవుతున్నాయి. గతంలో ఉన్న పట్టు.. ఇప్పుడు లేకపోవడం.. గతంలో సాయిరెడ్డి వంటి…
టాలెంట్ ఎంత ఉన్నా సక్సెస్ విషయంలో పోరాడుతూనే ఉన్న హీరోల్లో సుహాస్ ఒకడు. కలర్ ఫోటోకు జాతీయ అవార్డు వచ్చినా…
పహల్గామ్ ఉగ్రదాడి విషయంలో భారత్కు అంతర్జాతీయ వేదికపై కీలక మద్దతు లభించింది. ఢిల్లీలో జరిగిన బ్రిక్స్ సదస్సులో ఆమోదించిన న్యూఢిల్లీ…