Movie News

చైతు సినిమాలో పూజాహెగ్డే..?

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న పూజాహెగ్డే ఇప్పుడు తమిళ, హిందీ భాషల్లో కూడా నటిస్తోంది. కోలీవుడ్ లో విజయ్ సరసన ‘బీస్ట్’ అనే సినిమాలో నటించింది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక బాలీవుడ్ లో అయితే క్రేజీ ప్రాజెక్ట్ లను లైన్ లో పెట్టింది. తెలుగులో కూడా బిజీగానే ఉంది. త్వరలోనే మహేష్ బాబు-త్రివిక్రమ్ సినిమా షూటింగ్ లో పాల్గొనుంది.

ఇప్పుడు ఓ యంగ్ హీరో సినిమాలో పూజాకి ఛాన్స్ వచ్చిందట. తెలుగులో ‘ఒక లైలా కోసం’ అనే సినిమాలో నాగచైతన్యతో కలిసి నటించింది పూజాహెగ్డే. ఇప్పుడు మరోసారి అతడి సినిమాలో నటించమని దర్శకనిర్మాతలు పూజాను సంప్రదించారట. రీసెంట్ గా ‘లవ్ స్టోరీ’, ‘బంగార్రాజు’ సినిమాలతో భారీ హిట్స్ అందుకున్న చైతు.. వెంకట్ ప్రభు డైరెక్షన్ లో సినిమా చేయడానికి అంగీకరించారు.

ఇప్పటివరకు తమిళంలో సినిమాలు చేసిన వెంకట్ ప్రభు ఈ సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వబోతున్నారు. 
శ్రీనివాస చిట్టూరి నిర్మించనున్న ఈ సినిమాలో హీరోయిన్ గా పూజాహెగ్డేను  తీసుకోవాలనుకుంటున్నారు. ఈ మేరకు ఆమెతో సంప్రదింపులు కూడా జరిపారు. కానీ ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది.

ప్రస్తుతం ఆమె చేతిలో చాలా సినిమాలున్నాయి. ఇలాంటి సమయంలో మరో సినిమా ఒప్పుకుంటుందో లేక వదులుకుంటుందో చూడాలి. ప్రస్తుతం చైతు.. విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో ‘థాంక్యూ’ అనే సినిమాలో నటిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అలానే ఓ హారర్ వెబ్ సిరీస్ లో నటించబోతున్నారు. దీన్ని కూడా విక్రమ్ కుమారే డైరెక్ట్ చేయనున్నారు. ఈ సిరీస్ కి ‘దూత’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. 

This post was last modified on February 17, 2022 9:49 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

8 minutes ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

15 minutes ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

45 minutes ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

2 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

3 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

5 hours ago