మెగా ఫ్యాన్స్కి మాంచి కిక్కిచ్చే న్యూస్ ఒకటి తాజాగా బయటకు వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం `ఆచార్య`. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇందులో కీలక పాత్ర పోషించగా.. కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే హీరోయిన్లుగా నటించారు. రెజీనా కాసాండ్రా ఇందులో స్పెషల్ సాంగ్ చేసింది.
కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై రామ్చరణ్, నిరంజన్రెడ్డి సంయుక్తంగా ఈ మూవీని నిర్మించారు. గత ఏడాది మే నెలలోనే ఈ సినిమా విడుదల కావాల్సి ఉన్నా.. కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. ఇక ఎట్టకేలకు ఈ చిత్రాన్ని మార్చి 25న విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ఇటీవలె అధికారికంగా ప్రకటించారు.
అయితే తాజా సమాచారం ప్రకారం.. మెగా మల్టీస్టారర్గా రాబోతున్న ఆచార్య తెలుగులో మాత్రమే కాదు హిందీలోనూ రిలీజ్ కాబోతోంది. అవును, ఈ సినిమా హిందీ వర్షన్ను పెన్ స్టూడియోస్ వారు విడుదల చేయబోతున్నారు. ఈ విషయాన్ని సదరు సంస్థ అధికారంగా తెలియజేసింది. ఈ మేరకు ఓ పోస్టర్ను కూడా వదలగా.. మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయిపోతున్నారు.
కాగా, దేవాదాయ భూముల ఆక్రమణల నేపథ్యానికి నక్సలిజాన్ని జోడించి తెరకెక్కించిన ఈ చిత్రంలో చిరంజీవి, రామ్ చరణ్లు నక్సలైట్లుగా కనిపించబోతున్నారు. అలాగే మణిశర్మ అందించే సంగీతం ఈ మూవీకి ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతోంది.
తెలుగులో చాలా కొద్ది మంది హీరోయిన్లకు మాత్రమే సాధ్యమైన స్టార్ ఇమేజ్ సంపాదించింది సమంత. విజయశాంతి, అనుష్కల తర్వాత హీరోలతో…
కేవలం పది కోట్ల బడ్జెట్లో తెరకెక్కిన సినిమా.. అబ్సెషన్. ఈ హాలీవుడ్ హార్రర్ మూవీ విడుదలైనప్పటి నుంచి వరల్డ్ వైడ్…
స్టార్ హీరో సినిమాల రిపీట్ వేల్యూకి ప్రధానంగా దోహదం చేసేది పాటలే. ఫైట్లు, ఎలివేషన్లు, యాక్షన్ ఎపిసోడ్లు ఎక్కువ లేని…
సంక్రాంతికి రిలీజైన మన శంకరవరప్రసాద్ గారులో ప్రాణ స్నేహితులుగా నటించిన చిరంజీవి, వెంకటేష్ మొదటిసారి స్క్రీన్ పంచుకుని ఎంత పెద్ద…
హెడింగ్ చూడగానే ఏవో ముళ్లచెట్ల వల్ల ఎవరికో ఏదో అయిపోయి షూటింగ్ బ్రేక్ పడిందని అనుకోకండి. ఇక్కడ అడ్డంకులనే కోణంలో…
రాష్ట్రంలో అటవీ సంపదను కాపాడడంతోపాటు.. వన్యప్రాణుల సంరక్షణకు సైతం ప్రాధాన్యం ఇస్తున్న ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవన్…