Movie News

మెగా ఫ్యాన్స్‌కి మాంచి కిక్కిచ్చే న్యూస్ ఇది..!

మెగా ఫ్యాన్స్‌కి మాంచి కిక్కిచ్చే న్యూస్ ఒక‌టి తాజాగా బ‌య‌ట‌కు వ‌చ్చింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన తాజా చిత్రం `ఆచార్య‌`. మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ఇందులో కీల‌క పాత్ర పోషించ‌గా.. కాజ‌ల్ అగ‌ర్వాల్‌, పూజా హెగ్డే హీరోయిన్లుగా న‌టించారు. రెజీనా కాసాండ్రా ఇందులో స్పెష‌ల్ సాంగ్ చేసింది.

కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్ల‌పై రామ్‌చరణ్, నిరంజన్‌రెడ్డి సంయుక్తంగా ఈ మూవీని నిర్మించారు. గ‌త ఏడాది మే నెల‌లోనే ఈ సినిమా విడుద‌ల కావాల్సి ఉన్నా.. క‌రోనా కార‌ణంగా వాయిదా ప‌డుతూ వ‌స్తోంది. ఇక ఎట్ట‌కేల‌కు ఈ చిత్రాన్ని మార్చి 25న విడుదల చేయ‌బోతున్న‌ట్లు మేక‌ర్స్ ఇటీవ‌లె అధికారికంగా ప్ర‌క‌టించారు.

అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం.. మెగా మల్టీస్టారర్‌గా రాబోతున్న ఆచార్య తెలుగులో మాత్ర‌మే కాదు హిందీలోనూ రిలీజ్ కాబోతోంది. అవును, ఈ సినిమా హిందీ వ‌ర్ష‌న్‌ను పెన్‌ స్టూడియోస్ వారు విడుద‌ల చేయ‌బోతున్నారు. ఈ విష‌యాన్ని స‌ద‌రు సంస్థ అధికారంగా తెలియ‌జేసింది. ఈ మేర‌కు ఓ పోస్ట‌ర్‌ను కూడా వ‌ద‌ల‌గా.. మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయిపోతున్నారు.

కాగా, దేవాదాయ భూముల ఆక్రమణల నేపథ్యానికి నక్సలిజాన్ని జోడించి తెర‌కెక్కించిన ఈ చిత్రంలో చిరంజీవి, రామ్ చ‌ర‌ణ్‌లు నక్సలైట్లుగా క‌నిపించ‌బోతున్నారు. అలాగే మణిశర్మ అందించే సంగీతం ఈ మూవీకి ప్రత్యేక ఆకర్షణగా నిలవ‌బోతోంది.

This post was last modified on February 17, 2022 1:18 pm

Share

Recent Posts

లిక్క‌ర్ కేసు… కారుమూరితోనే క‌థ అయిపోలేదు!

వైసీపీ హ‌యాంలో జ‌రిగిన 3500 కోట్ల రూపాయ‌ల లిక్క‌ర్ కుంభ‌కోణం కేసు.. అనేక మ‌లుపులు తిరుగుతోంది. తాజాగా వైసీపీ కీల‌క…

1 minute ago

మహాకాళి శ్రియ… థియేటర్లలో పూనకాలే!

శ్రియా రెడ్డి అంటే తెలుగు ప్రేక్షకుల్లో చాలామందికి ఇప్పటికీ ‘పొగరు’ సినిమాలోని ఈశ్వరి పాత్ర గుర్తొస్తుంది. విశాల్ హీరోగా వచ్చిన…

19 minutes ago

త్రినాధ్ సంభవాన్ని తక్కువంచనా వేశారా

ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో, అటు ప్రేక్షకుల్లో జరుగుతున్న చర్చ ఎల్లుండి నుంచి ఇరుముడికి కేటాయించిన చాలా థియేటర్లు టాక్సిక్ కు…

23 minutes ago

హోంమంత్రి పై కూలిన డ్రోన్‌… ఏం జ‌రిగింది?

ఏపీ హోం మంత్రి వంగ‌ల‌పూడి అనిత ప్ర‌మాదానికి గుర‌య్యారు. ఆమె ఎగుర వేసిన డ్రోన్‌.. కొద్ద దూరం పైకి వెళ్లి…

2 hours ago

కుళ్లిపోయిన 100 టన్నుల చికెన్‌… చేపల ఆహారంగా!

కుళ్లిపోయిన చికెన్‌ వ్యర్థాలను చేపలకు ఆహారంగా వినియోగిస్తున్న వ్యవహారం వెలుగులోకి రావడంతో ప్రజారోగ్యంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో…

3 hours ago

విద్యార్థినులతో కలిసి జలకాలాట… ప్రిన్సిపాల్ సస్పెండ్

బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన ఒక ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్ అభ్యంతరకరంగా వ్యవహరించడం విమర్శలకు తావిచ్చింది. రాజస్థాన్ లోని ఒక ప్రిన్సిపాల్ విద్యార్థినులతో…

3 hours ago