మెగా ఫ్యాన్స్కి మాంచి కిక్కిచ్చే న్యూస్ ఒకటి తాజాగా బయటకు వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం `ఆచార్య`. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇందులో కీలక పాత్ర పోషించగా.. కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే హీరోయిన్లుగా నటించారు. రెజీనా కాసాండ్రా ఇందులో స్పెషల్ సాంగ్ చేసింది.
కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై రామ్చరణ్, నిరంజన్రెడ్డి సంయుక్తంగా ఈ మూవీని నిర్మించారు. గత ఏడాది మే నెలలోనే ఈ సినిమా విడుదల కావాల్సి ఉన్నా.. కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. ఇక ఎట్టకేలకు ఈ చిత్రాన్ని మార్చి 25న విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ఇటీవలె అధికారికంగా ప్రకటించారు.
అయితే తాజా సమాచారం ప్రకారం.. మెగా మల్టీస్టారర్గా రాబోతున్న ఆచార్య తెలుగులో మాత్రమే కాదు హిందీలోనూ రిలీజ్ కాబోతోంది. అవును, ఈ సినిమా హిందీ వర్షన్ను పెన్ స్టూడియోస్ వారు విడుదల చేయబోతున్నారు. ఈ విషయాన్ని సదరు సంస్థ అధికారంగా తెలియజేసింది. ఈ మేరకు ఓ పోస్టర్ను కూడా వదలగా.. మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయిపోతున్నారు.
కాగా, దేవాదాయ భూముల ఆక్రమణల నేపథ్యానికి నక్సలిజాన్ని జోడించి తెరకెక్కించిన ఈ చిత్రంలో చిరంజీవి, రామ్ చరణ్లు నక్సలైట్లుగా కనిపించబోతున్నారు. అలాగే మణిశర్మ అందించే సంగీతం ఈ మూవీకి ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతోంది.
This post was last modified on February 17, 2022 1:18 pm
ఎల్లుండి విడుదల కాబోతున్న గోదారి గట్టుపైన సినిమా కోసం హీరో సుమంత్ ప్రభాస్ ఫుల్ ప్రమోషన్లు చేస్తున్నాడు. ఒకపక్క ఇంటర్వ్యూలు…
టీడీపీ మహిళా నేత, ఏపీ హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత నోట నుంచి వచ్చే మాటలు ఎప్పటికప్పుడు వైరల్…
ఈ రోజుల్లో సినిమా తీయడం కంటే దాన్ని జనాల్లోకి తీసుకెళ్లడం, మంచి రిలీజ్ ఉండేలా చూసుకోవడం సవాలుగా మారింది. తెలుగులో…
సినిమా థియేటర్లలో జనం కనిపించడం లేదనేది ఇప్పుడు ఇండస్ట్రీని వేధిస్తున్న అతిపెద్ద సమస్య. సినిమా బాగుంటే వేరే సంగతి, కానీ…
టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఇప్పుడు ఒక పెద్ద సినిమా వస్తుందంటే చాలు, మిగతా భాషల సినిమాలన్నీ తమ డేట్స్ మార్చుకునే…
ఈ మధ్య కాలంలో చిన్ననాటి స్నేహితులను కలుసుకోవాలనే ఉత్సాహంతో 'గెట్ టు గెదర్' పార్టీలు చేసుకోవడం ఒక ట్రెండ్గా మారింది.…