Movie News

ఆడవాళ్లు.. ఇప్పటికి ముగించారు

మహానుభావుడు సినిమా తర్వాత ఇంతవరకు ఒక్క మంచి హిట్టు కూడా దక్కలేదు శర్వానంద్‌కి. దాంతో మంచి నటుడిగా పేరు వస్తున్నా కమర్షియల్ హీరోగా స్టార్‌‌డమ్ మాత్రం తెచ్చుకోలేకపోతున్నాడు. రణరంగం, జాను, శ్రీకారం, మహాసముద్రం అంటూ చాలా రకాల జానర్లు ట్రై చేసినా కాసులు రాబట్టడంలో పూర్తిగా విఫలమవుతున్నాడు.      అందుకేనేమో.. ఈసారి ఆడవాళ్ల సపోర్ట్ తీసుకున్నాడు శర్వా.

లెక్కలేనంతమంది లేడీ క్యారెక్టర్స్‌తో కిశోర్ తిరుమల తెరకెక్కిస్తున్న ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ చిత్రంలో నటిస్తున్నాడు. రష్మిక హీరోయిన్‌గా నటిస్తోంది. రాధికా శరత్‌కుమార్, ఖుష్బూ, ఊర్వశి లాంటి సీనియర్ హీరోయిన్లంతా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.     

రీసెంట్‌గా రిలీజైన టీజర్‌‌ని బట్టి ఇది ఫన్ అండ్ ఎమోషన్స్‌ మిక్స్ చేసిన కూల్‌ ఫ్యామిలీ ఎంటర్‌‌టైనర్ అని అర్థమయ్యింది. మూవీపై ఆసక్తి పెరిగింది. ఈ నెల 25న సినిమా విడుదల చేస్తామని టీమ్ కూడా ప్రకటించింది. ప్రమోషన్స్‌లో జోరు పెంచింది. దాంతో మూవీ రెడీ అని అందరూ అనుకున్నారు. కానీ నిజానికి.. సినిమా షూటింగ్‌ ఇప్పటికి పూర్తయ్యింది.     తమ సినిమా షూటింగ్‌ పూర్తయ్యిందంటూ కాసేపటి క్రితమే మేకర్స్ అనౌన్స్ చేయడంతో అందరూ ఆశ్చర్యపోయారు.

పది రోజుల్లో సినిమా రిలీజ్ పెట్టుకుని ఇప్పటి వరకు షూటింగ్ చేయడమేంటి అంటున్నారు. ఈమధ్య కాలంలో చాలా సినిమాల విషయంలో ఇలా జరుగుతోంది. రిలీజ్ దగ్గరపడుతున్నా వర్క్ పూర్తి కావడం లేదు. దాంతో చివరి నిమిషంలో రిలీజ్ ఆపి, మరో డేట్‌ని ఫిక్స్ చేసుకున్నవాళ్లూ ఉన్నారు. అయితే షూట్ కంప్లీటైన విషయాన్ని చెబుతూ ఫిబ్రవరి 25న సినిమా రిలీజ్ అని మరోసారి కన్‌ఫర్మ్ చేశారు కాబట్టి, శర్వా సినిమాకి అలాంటి పరిస్థితి రాదనే అనిపిస్తోంది.

This post was last modified on February 14, 2022 8:27 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

కమ్యూనిస్టులు… మళ్ళీ అదే తప్పిదం

రాజ‌కీయాల్లో అవ‌కాశాలు రావ‌డ‌మే అరుదు. వ‌చ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవ‌స‌రం.. వాటిని ప‌ట్టుకుని ఎద‌గాల్సిన అవ‌స‌రం కూడా పార్టీల‌కు, నాయ‌కుల‌కు…

2 hours ago

సంచలనాలకు సిద్ధమవుతున్న జన నాయకుడు

తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…

3 hours ago

దృశ్యం 3 ఇక్కడితో ఆగడం లేదా

పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…

3 hours ago

ఇక సీఎం విజయ్ ను ఎవరు ఆపలేరు

త‌మిళ‌నాడు రాజ‌కీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత ప‌రిస్థితి తొలిగిపోయింది. ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అతి పెద్ద పార్టీగా అవ‌త‌రించిన…

3 hours ago

ప‌వ‌న్ ఇంటికి ప్ర‌ధాని మోడీ?

దేశ ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ.. ఆదివారం హైద‌రాబాద్‌లో ప‌ర్య‌టించ‌నున్నారు. వివిధ అభివృద్ధి కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ ప‌ర్య‌ట‌న‌లో మ‌రో…

5 hours ago

కొత్తమ్మాయిలపై విరుచుకుపడ్డ ‘బద్రి’ భామ

‘కహోనా ప్యార్ హై’ చిత్రంతో హృతిక్ రోషన్ మాత్రమే కాదు.. ఆ చిత్ర కథానాయిక అమీషా పటేల్ సైతం ఓవర్…

6 hours ago